26, సెప్టెంబర్ 2013, గురువారం

సీమాంధ్ర ప్రజలారా.. విభజన మన మంచికే!


కోస్తా వారితో కలసి నడవలేమంటే సీమ వారికి తక్షణమే నాలుగు జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. అభివృద్ధి నిరోధక ఆందోళనలకు స్వస్తి చెప్పాలి.విభజన మన మంచికేనని ముందుకు సాగితే తెలుగు వారికి కోస్తా తీర ప్రాంతాన ఓ మహానగరం వెలియడం, సీమాంవూధులు ప్రగతి బాట పట్టడం ఖాయం.
తెలంగాణపై ఏదో ఒకటి తేల్చేయండి అని డిమాండ్ చేసిన వారంతా ఆ విషయాన్ని తేల్చేయగానే అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించారు. రాష్ట్రాన్ని విభజిస్తే నీటి సమస్యలు, హైదరాబాద్ లేకపోతే విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, రెవెన్యూ లేదంటూ సీమాంవూధలోని శక్తివంతమైన వర్గాలైన రాజకీయ పార్టీలు, ఉద్యోగస్తులు ఏకమై ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. జై సమైక్యాంధ్ర అంటూ సమ్మెలు, బంద్ లు చేస్తూ యాభై రోజులకుపైగా సామాన్య జనాలను, విద్యార్థులను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తున్నారు. విభజన వల్ల వచ్చే సమస్యలను తెలియచేయాల్సిన బాధ్యత, హక్కు అన్ని రాజకీయ పార్టీలకు,ఉద్యోగస్తులకు, మీడియా వారికి వున్నది. కాని రాష్ట్ర విభజన జరగటానికి వీల్లేదు, ‘జై సమైక్యాంధ్ర’ ఒక్కటే అమలు చేయాలని డిమాండ్ చేసే హక్కుఎవరికీ లేదు.

ప్రియమైన విద్యార్థుల్లారా! పెద్ద మనుషుల ఒప్పందాలతో, ముల్కీ రూల్స్‌తో, ఆరు సూత్రాలతో, 610 జీవో, ఆ జోన్‌లతో, ఈజోన్‌లతో కూడుకున్న హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలేని, ఎన్నో తారతమ్యాలున్న ‘ఆంధ్రవూపదేశ్’ అనే జైలు నుంచి మీరు బయటపడితేనే మీకు, యావత్ తెలుగు ప్రజలకు భవిష్యత్ ఉంటుంది. అసలు హైదరాబాద్‌లో వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని? విడిపోతే కొత్త రాజధానిలో రావా? ప్రతిభ వుంటే ప్రైవేట్ కంపెనీ లో ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం పొందగలిగే ఈ రోజుల్లో హైదరాబాద్‌లో ఎందుకురావు? మా తాతలు తవ్వించిన నుయ్యి, ఆ ఉప్పునీటినే త్రాగుతూ బ్రతుకుతానంటే ఎట్లా? హైదరాబాద్ పై లేనిపోని ఆందోళనలకు స్వస్తి చెప్పి మీ చదువులలో మీరు నిమగ్నమవ్వండి.
ప్రియమైన రైతుల్లారా! నీటి సమస్యలంటూ సీఎం తో సహా వాలు-ఈలు, గాలిపాటు చూసుకొనే కొంతమంది రైతాంగ రాజకీయవేత్తలు మిమ్మల్ని పక్కదారి పట్టిస్తున్నారు. అసలు వ్యవసాయాన్ని దివాళా తీయించిందెవరు? రైతుల ఆత్మహత్యలకు కారణంగా వున్న ఈ వ్యవస్థకు కారకుపూవరు? నీరు పుష్కంగావున్న గోదావరి డెల్టాలో ‘క్రాప్ హాలిడే’ ప్రకటించుకునే దుస్థితి కల్పించిందెవరు?ఆంధ్రవూపదేశ్‌లోనే నీటి విడుదలలో న్యాయం చేయకుండా రైతులను గాలికి వదిలేసిన వారు భవిష్యత్తులో చేస్తారా? ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల సత్వర పూర్తి కై రైతులంతా సమష్టిగా పోరాడి పూర్తి చేయించుకుం వ్యవసాయానికి నికరమయిన మనుగడ లభిస్తుంది గాని రాష్ట్రం కలసి వుంటేనో లేక విడిపోతేనోగాదు.

ప్రియమైన ఉద్యోగస్తుల్లారా! రాష్ట్రం ఒకటిగా వుండాలా లేదా మూడుగా చేయాలా అనేది అధికార ప్రతిపక్ష ప్రజా ప్రతినిధుల నిర్ణయం. మీకు ఉద్యోగ రీత్యా ఎదురయ్యే సమస్యలు తెలుపుకొని పరిష్కరించుకోవాలే గాని ‘జై సమైక్యాంధ్ర’ అంటూ జెండా పట్టుకుని సమ్మెలకు దిగటం సరికాదు. కోట్లాదిమంది ప్రజల మధ్య తలెత్తిన విభజన సమస్యను పరిష్కరించకుండా పార్టీలు, ప్రభుత్వాలు ఎంత కాలం విస్మరిస్తాయి? అయినా బాధలు లేనిదెవరు? అత్యధిక శాతం ఉద్యోగస్తులచే ప్రజలు బాధలు పడటం లేదా? సాటి తెలుగోడ్ని ఆఫీస్ కొస్తే నుంచో బెట్టి మాట్లాడే మీరు, ప్రభుత్వ లెక్చరర్లుగా, టీచర్లుగా భారీ జీతాలు, పెన్షన్‌లు పొందుతూ మీ పిల్లలను చైతన్య, నారాయణలలో చదివించుకునే మీరు, జీతాలుపెన్షన్‌లు సరిగా రావేమోనన్న శంకతో నేడు ‘జై సమైక్యాంధ్ర’. ఆహా! ఇదంతా ఎవరి కోసమటండి! సీమాంవూధుల కోసమేనా? గుండె మీద చేయి వేసుకుని చెప్పండి! అసలు ప్రజలు మీ గురిం చి చెప్పుకునేవన్నీ కాగితం మీద పెట్టలేను. మీరు, ఆర్.టి.సి వారు మీకు గాని సమస్యల్లో, పోరాటంలో దూరారు. అసలు ఏ పెద్ద మనిషి చెప్పాడు.

ఆర్‌టీసీని లేకుం డా చేస్తామని? రాష్ట్ర విభజన చేస్తే, సంస్థే ఉండదని అటు సిబ్బందిని ఇటు ప్రజల్ని తప్పుదారి పట్టించటమేనా? రాను పోను 20 రూ॥ లతో పోయే చార్జీకి 40 రూ॥ ఆటోలకు ఎంతకాలము, ఎక్కడి నుండి తెచ్చి సామాన్యులు చెల్లించుకుంటారు? అటు సూర్యుడు ఇటు పొడిచినా రాష్ట్ర విభజన ఆగదు. నిండా మునగక ముందే తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరటం మీకు, సంస్థకు, ప్రజలకు శ్రేయస్కరం.

ప్రియమైన రాజకీయుల్లారా! ఇటీవల మీరు సమన్యాయం అంటూ ఓ సరికొత్త సుభాషితం వల్లిస్తున్నారు! అసలు మీ మంత్రి వర్గంలో సమన్యాయం ఉందా? ఒక వర్గం వారెంతమంది? అసలు చోటేలేని వారెంతమంది? తండ్రిపోగానే కొడుకు సి.ఎమ్ కావాలనటం లేదా అదే కుటుంబంలో వారే ప్రజావూపతినిధి అవటం సమన్యాయమా? మీ పాలనల్లో సీమాంధ్ర ప్రాంతానికి సమన్యాయం జరిగిందా? పట్టుమని ఓ నాలుగు వేలమంది పనిచేసే ఒక్క ప్రభుత్వ పరివూశమన్నా పెట్టారా? విజయవాడలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు నిధులు ఇవ్వటానికి చేతులొచ్చాయా? హై కోర్ట్ బెంచ్‌కు, గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు, బందరు పోర్ట్‌కు, ఐ.టి పార్క్‌కు ఏ గతి పట్టించారు? అసలు ఈ ప్రాంతం అంటేనే అంతులేని ఈర్ష్యతో రగిలిపోయే మీరు నేడు సమన్యాయమా? ఎవరి కోసమండీ? మీరు చేయని, చెప్పని సమన్యాయాన్ని ఏ ముఖం పెట్టుకుని సోనియాను అడుగుతూ, అమాయక ప్రజల్ని రెచ్చగొడుతున్నారు?ఇందిర తెలుగుజాతి సమైక్యతకు పాటుబడిందట! సోనియా విచ్ఛిన్నం చేసిందట! అంత గొప్ప ప్రేమానుబంధాలతో పెనవేసుకుని బతుకుతోందా తెలుగు జాతి? అసలు పంజాబ్‌లో శ్రీమతి ఇందిర చేసింది ఏమిటి? పంజాబ్‌లోని హిందువులంతా పాటియాలాను, ఇపుడున్న హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని భాగాలను కలిపి అఖండ పంజాబ్‌ను ఏర్పాటు చేయమని పోరాడగా దీనికి పూర్తి విరుద్ధంగా సిక్కులు పంజాబ్‌ను విడగొట్టమని సమ్మెలు, బంద్‌లు, ఆమరణ నిరాహార దీక్షలు చేసి మన కన్నా ఎంతో త్యాగ స్ఫూర్తితో పోరాడారు.


అయినా జవహర్‌లాల్ బతికి వున్నంత వరకు వారి కోర్కె నెరవేరలేదు. అయితే వారి తరువాత వారి తనయురాలు ఇందిర, హుకుంసింగ్ కమిటీ నివేదిక సూచించిన విధంగా 1966లో రాష్ట్రపతి పాలన విధించిమరీ పంజాబ్‌ను రెండుగా చేసి, చండీగఢ్‌ను ఉమ్మడి రాజధానిగా చేసిన విషయం మీకు తెలియదా? సీమాంవూధలోనే భావ సమైక్యత ఏమాత్రం లేని, నాయకత్వం లేని, పరిష్కారం దొరకని, ఎవరి స్వార్థం తో వారు చేస్తున్న ఈ పాల పొంగు జై సమైక్యాంధ్ర ఉద్యమానికి తలొంచేదెవరు? డబుల్ గేమ్‌లకు ఇకనైనా స్వస్తి చెప్పి, రాష్ట్రాన్ని విభజించకుండా ఎవరమూ ఏమీ చేయలేని పరిస్థితి వచ్చిందని ధైర్యంగా ప్రజలకు వివరించి తెలుగు ప్రజల్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్ళండి!


ప్రియమైన సీమాంవూధులారా! టి.వి. ఛానల్స్ ముందుకొచ్చి వారినీ, వీరిని నిందించడం రాజీనామాలు చేయమని డిమాండ్‌లు చేస్తే పరిష్కారమవుతుందను కుంటున్నారా? వెయ్యిమంది తెలంగాణా పిల్లలు చనిపోయినా తెలంగాణ మంత్రులు రాజీనామాలు చేయనపుడు సీమాంధ్ర మంత్రులు ఎందుకు చేయాలి? మీరు అవునన్నా, కాదన్నా రాష్ట్రం విడిపోవడం అనేది మనమంచికే! ఆంధ్రనాట ఇదో చారివూతాత్మక శుభ పరిణామం! కొత్త రాజధానికి, నూతన రాష్ట్రానికి ఆర్థిక జవసత్వాలు అందజేయమని రాజకీయ వాదులంతా కేంద్రంపై పోరాటం చేసేలా మీరు ఆందోళనలు చేయండి! ఇకపోతే నూతన రాజధానిగా ఇపుడున్న భౌగోళిక పరిస్థితులలో సీమాంవూధలో విజయవాడగుంటూరులకు మించింది లేదు. గన్నవ రం ఎయిర్‌పోర్ట్, బందరు పోర్ట్, అతి పెద్ద రైల్వే జంక్షన్, నీటి సమస్య లేకుండా పవిత్ర కృష్ణవేణీ తీరాన వెలసిన స్వతహాగా ఎంతో కొంత అభివృద్ధి చెందిన పట్టణాలు. విజయవాడ యావత్తు తెలుగు ప్రజలంతా ఇష్టపడే ఫ్యాన్సీ వున్న బ్లూ చిప్ సిటీ. అటు అనంతపూర్‌కు 480 కి.మీ. దూరంలోను ఇటు శ్రీకాకుళానికి 482 కి.మీ సమదూరంలోను వున్న ప్రాంతం. అనేక రకాలయిన రుగ్మతలతో, సీమ వారికి విజయవాడ ఇష్టం కాదని, ఏదో ఓ ప్రాంతాన్ని, ఏ హంగులూ లేని చోట రాజధాని ఏర్పాటు చేస్తే అది హైదరాబాద్‌ను తలదన్నే మహా నగరం అవుతుందనేది కేవలం భ్రమ, తెలియనితనం మాత్ర మే. రాజధాని వున్నంత మాత్రాన అది మహా నగరం అవటం జరగదు. 20 కోట్ల జనాభాతో 70 జిల్లాలతో వున్న ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో (29 లక్షలు), పదిన్నర కోట్ల జనాభా కల బీహార్ రాజధాని పాట్నా (20.5 లక్షలు), ఏడున్నర కోట్ల జనాభా కల మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ (19 లక్షలు) మహా నగరాలు అయినాయా? ఒరిస్సా రాజధాని అయిన భువనేశ్వర్, పంజాబ్, హర్యానాల ఉమ్మడి రాజధాని చండీగఢ్‌లు నేడు 10 లక్షలలోపు జనాభాతో అసలు విజయవాడ కన్నా తక్కువ జనాభాతోనే వుండి మహా నగరాలుగా ఎదగలేదని అందరూ గుర్తుపెట్టుకోవాలి.


విజయవాడ నేడు భారత పట్టణాలలో 30వ స్థానంలోనున్నది. ఉడా పరిధిలోని విజయవాడ గుంటూరులను రాజధానిగా చేసుకుని అభివృద్ధి చేసుకుంటే 13వ స్థానంలోకి వెంటనే వస్తాయి. కేవలం 5-10 ఏళ్లలో 8వ స్థానంలోకి విజయవంతంగా చేర్చ గలిగే, ఉపాధి నగరంగా రూపొందించగల సత్తా, శక్తి సామర్థ్యాలు సీమాంవూధుల కు వున్నాయి. రెండున్నర కోట్ల జనాభా కల హర్యానాలో 19 జిల్లాలు, మనకన్నా తక్కువ జనాభా కల మధ్య ప్రదేశ్‌లో 48 జిల్లాలున్నాయి. మనము కూడా వెంటనే 20 జిల్లాలుగా చేసుకుని అన్ని ప్రాంతాలను అభివృద్ధి పథంలోకి తీసుకురావచ్చును. కశ్మీర్, మహారాష్ట్ర, కర్నాటకలలో లాగా అసెంబ్లీ కార్య కలాపాలను రెండు ప్రాంతాలలో ఏర్పాటు చేసుకుని ప్రాంతీయ సుహృద్భావాన్ని కాపాడు కోవచ్చును. అలాగే హైకోర్ట్ బెంచ్‌ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చును. విస్తారంగా భూములు ఉన్నచోట భారీ పరివూశమలు ఏర్పాటయ్యేలా చేసి వారికి సబ్సిడీలు ఇవ్వాలి. నూతన రాజధాని కోసం హైదరాబాద్ రెవెన్యూను 15 ఏళ్ల పాటు జనాభా దామాషాగా సీమాంవూధకు కేటాయించాలి. కేంద్రం కూడా అంతే మొత్తాన్ని చట్టం చేసి సీమాంవూధకు ఇవ్వాలి. ఇకపోతే కోస్తా వారితో కలసి నడవలేమంటే సీమ వారికి తక్షణమే నాలుగు జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. అభివృద్ధి నిరోధక ఆందోళనలకు స్వస్తి చెప్పాలి. విభజన మన మంచికేనని ముందుకు సాగితే తెలుగు వారికి కోస్తా తీర ప్రాంతాన ఓ మహానగరం వెలియడం, సీమాంవూధులు ప్రగతి బాట పట్టడం ఖాయం.
-జి.వి. రాం ప్రసాద్, జై ఆంధ్ర సిద్ధాంతవేత్త

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి