28, డిసెంబర్ 2011, బుధవారం

కాల్ సెంటర్లపై కత్తి

బళ్లు ఓడలు, ఓడలు బళ్లు అవడమంటే ఇదేనేమో! స్వేచ్ఛావాణిజ్యమే పునాదిగా ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రతీకగా అలరారే అమెరికా ఇప్పుడు స్వేచ్ఛా వాణిజ్యం అంటేనే జడుసుకుంటోంది. చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అన్నట్టుగా ‘రక్షణాత్మక’ విధానాలలోకి జారిపోతోంది. ‘పొరుగు సేవల’ (బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్-బీపీఓ) పేరుతో అమెరికా ఉద్యోగాలను బయటి దేశాలకు తరలిస్తున్న కంపెనీలపై అధ్యక్షుడు బరాక్ ఒబామా కొంతకాలం క్రితం కస్సు బుస్సులాడడం చూశాం. ‘బెంగళూరు వద్దు, బుఫాలో(కెనడా సరిహద్దులను ఆనుకుని ఉన్న ఒక నగరం)ముద్దు’ అన్నది అప్పుడాయన ఇచ్చిన నినాదం. తాజాగా డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు రెండూ కలసి ‘యూఎస్ కాల్ సెంటర్ ఉద్యోగులు, వినియోగదారుల రక్షణ చట్టం’ పేరుతో ఒక బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టడం బీపీఓ ఉద్యోగాల గురించిన చర్చను మళ్లీ తెరమీదికి తెచ్చింది. ‘రక్షణాత్మక’చర్యగా పేర్కొంటూ మనదేశం సహా అనేక దేశాలు ఈ చర్యను గర్హించాయి.

కాల్ సెంటర్లను విదేశాలకు తరలించే కంపెనీలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి గ్రాంట్లు కానీ, రుణాలు కానీ ఇవ్వరాదని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. అమెరికా వెలుపల కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయదలచుకున్న ఏ కంపెనీ అయినా ఆ విషయాన్ని అమెరికా కార్మికశాఖకు ముందుగా తెలియజేయాలనీ, తెలియజేయని పక్షంలో రోజుకు పదివేల డాలర్లు జరిమానాగా చెల్లించవలసి ఉంటుందనీ బిల్లు స్పష్టంచేస్తోంది. అలాగే, ఈ కంపెనీలు ప్రభుత్వం నుంచి గ్రాంట్లను, రుణాలను పొందే అర్హతను అయిదేళ్లపాటు కోల్పోతాయి. అమెరికన్ కంపెనీలు ‘పొరుగు సేవలు’ అందుకుంటున్న దేశాలలో మనదేశంతోపాటు లాటిన్ అమెరికా దేశాలు, ఐర్లాండ్, ఫిలిప్పీన్స్, కెనడా వగైరాలు కూడా ఉన్నాయి. ఈ బిల్లు చట్టమై అమలులోకి రావడమే జరిగితే ఈ దేశాల ప్రయోజనాలు దెబ్బతినే మాట నిజమే కానీ ఆ నష్టం ఏ ప్రమాణంలో ఉంటుందో ఇప్పుడే చెప్పలేమంటున్నారు.

మనదేశంపై దీని ప్రభావం ఏమంత ఉండదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఫిలిప్పీన్స్ తదితర దేశాలు వాయిస్ ఆధారిత కాల్ సెంటర్ సేవల్లో ఉండగా మనదేశం అంతకంటె ఎక్కువ స్థాయి కలిగిన లావాదేవీల సేవలకు మళ్లిందనీ, అదీగాక భారతీయ కంపెనీలు అమెరికా ప్రభుత్వ గ్రాంట్లను, రుణాలను తీసుకోవడంలేదు కనుక ఆందోళన చెందనవసరం లేదనీ అంటున్నారు. మనదేశ బీపీఓ మార్కెట్ విలువ 1400 కోట్ల డాలర్లు కాగా, కాల్ సెంటర్ల వ్యాపారం విలువ 6-7 వందల కోట్ల డాలర్లేనంటున్నారు. అమెరికా మార్కెట్లలో నెలకొన్న స్తబ్ధత వల్ల ఇప్పటికే ఒత్తిడికి లోనవుతున్న మన బీపీఓ మార్కెట్, ఈ చట్టం అమలులోకి వస్తే మరింత కుంగిపోవడం ఖాయమన్న భయాన్ని మరికొందరు వ్యక్తంచేస్తున్నారు. అదలా ఉండగా, ఈ బిల్లు అసలు చట్టం అవుతుందా అన్నది మరికొందరి సందేహం. చట్టసభల ముందుకు వచ్చే అనేక బిల్లులలో చట్టమయ్యేవి కొన్నే. ఈ బిల్లు చట్టరూపం ధరిస్తుందనుకున్నా అందుకు చాలా సమయం పడుతుంది.

కాకపోతే, భారత ఐటీ పారిశ్రామికుల సంఘం నాస్కామ్ అధ్యక్షుడు సోమ్ మిట్టల్ వ్యాఖ్యానించినట్టు ఈ బిల్లు అమెరికా విధాన నిర్ణేతల ఆలోచనా సరళిని వెల్లడిస్తుంది. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో తీసుకున్న ‘రాజకీయ’ చర్యగా కూడా ఈ బిల్లు ప్రతిపాదనను ఆయన అభివర్ణించారు. నిజానికి బీపీఓ కంపెనీలు ఆయా సేవలను ఎన్నింటినో సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చాయనీ, ఇటువంటి చట్టాలు వాటి ఖర్చును పెంచి ప్రజల తిరస్కృతిని మూటగట్టుకుంటాయనీ ఆయన విమర్శించారు. ఈ బిల్లు అమెరికా పౌరులకు ఏవిధంగా మేలు చేస్తుందన్నది మరో ప్రశ్న. బీపీఓ ద్వారా అమెరికానుంచి బయటికి వెళ్లే ఒక్కొక్క డాలర్‌కు ప్రతిగా మూడేసి డాలర్లు దేశంలోకి వస్తున్నాయని ఒక వివరణ. గత పదేళ్లలో బీపీఓ ద్వారా అమెరికా వినియోగదారుడే ఎంతో లబ్ధి పొందాడు. అవతలివైపునుంచి ఫోన్ కాల్ కోసం సుదీర్ఘకాలం ఎదురు చూసే దుస్థితి తప్పిపోయింది. ఇప్పుడు బీపీఓ సేవలకు కత్తెర వేస్తే అందువల్ల పెరిగే వ్యయభారాన్ని అమెరికా వినియోగదారుడే భరించవలసివస్తుంది. కనుక ఈ బిల్లు చట్టం కావడం అంత తేలికకాదన్న ధీమాను కొన్ని కంపెనీలు వ్యక్తంచేస్తున్నాయి.

మరి స్వదేశంలోని వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చని ఇలాంటి బిల్లును ఎందుకు ప్రతిపాదించినట్టు? అమెరికా విధాన నిర్ణేతల ప్రస్తుత ఆలోచనా సరళిలోనే అందుకు సమాధానం లభిస్తుంది. అమెరికా రక్షణాత్మక విధానాలవైపు మళ్లుతున్నదనడానికి ఇదొక్కటే కాదు, మరెన్నో ఉదాహరణలు. ఎగుమతి సామర్థ్యాన్ని పెంచుకోడానికి చైనా తన కరెన్సీ విలువను కృత్రిమంగా తగ్గించు కోడాన్ని అమెరికా చాలాకాలంగా వ్యతిరేకిస్తోంది. దానిని కట్టడి చేయడం లక్ష్యంగా అమెరికన్ సెనేట్ ఒక బిల్లును కూడా ఆమోదించింది. 1930ల నాటి మహా మాంద్యంలో అనుసరించిన రక్షణాత్మక విధానాలను అమెరికా అనుసరిస్తున్న దంటూ చైనాతోపాటు అనేక దేశాలు ఈ చర్యను ఖండించాయి. రక్షణాత్మక మనస్తత్వం అమెరికన్ పౌరుల్లోనే క్రమంగా బలపడుతోంది. ఉద్యోగాలు తరలి పోతాయన్న ఆరోపణతో చివరికి ఆయా దేశాలతో చేసుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను కూడా జనం వ్యతిరేకిస్తున్నారు. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో ఇటువంటి జనమనోభావాలను సొమ్ముచేసుకునే ఆలోచనలో కాల్ సెంటర్ బిల్లు భాగమైనా ఆశ్చర్యంలేదు. అమెరికా ఈనాడు స్వేచ్ఛా వాణిజ్యానికి అనుకూలంగా గొంతెత్తలేని స్థితిలో ఉంది. దోహా రౌండ్ స్వేచ్ఛా వాణిజ్య చర్చలలో స్తబ్ధత నెలకొనడానికి అది కూడా ఒక కారణం. కాల్ సెంటర్ బిల్లుకు ఆగ్రహించాలో, దాని వెనుకనున్న రక్షణాత్మక వైఖరికి జాలిపడాలో ముందు ముందు మరింత స్పష్టపడుతుంది.

భగవద్గీత నిషేధానికి నో

భారతీయ తత్వానికి అద్దంపట్టే భగవద్గీతపై రష్యాలో ఆరు నెలలుగా నెలకొన్న వివాదానికి తెరపడింది.
పిటిషన్‌ను తోసిపుచ్చిన రష్యా కోర్టు
తీర్పుపై భారత్, ఇస్కాన్ హర్షం
రష్యాకు విదేశాంగ మంత్రి ఎస్.ఎం. కృష్ణ కృతజ్ఞతలు


మాస్కో/న్యూఢిల్లీ: భారతీయ తత్వానికి అద్దంపట్టే భగవద్గీతపై రష్యాలో ఆరు నెలలుగా నెలకొన్న వివాదానికి తెరపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలకు గౌరవం దక్కింది. దౌత్యపరంగా భారత్ సాగించిన గట్టి ప్రయత్నాలకు తగిన ఫలితం లభించింది. భగవద్గీత రష్యన్ అనువాదం ‘భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్’పై నిషేధం విధించాలంటూ సైబీరియాలోని టామ్స్క్‌లో దాఖలైన పిటిషన్‌ను కోర్టు బుధవారం తోసిపుచ్చింది. ఇస్కాన్ వ్యవస్థాపకులైన ఎ.సి.భక్తివేదాంత స్వామి ప్రభుపాద రష్యన్ భాషలోకి అనువదించిన ఈ ‘గీత’ సాంఘిక వ్యతిరేకతను, ద్వేషాన్ని పెంచుతుందంటూ కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ వాదించింది. అందువల్ల ఈ అనువాద గ్రంథాన్ని రష్యన్ ఫెడరల్ తీవ్రవాద సాహిత్యం జాబితాలో చేర్చాలని డిమాండ్ చేసింది. అడాల్ఫ్ హిట్లర్ రాసిన ‘మీన్ కాంఫ్’ సహా ఇప్పటికే నిషేధించిన వెయ్యికిపైగా పుస్తకాల లిస్టులో దీన్ని కూడా చేర్చాలని పట్టుబట్టింది. అయితే ఈ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఇస్కాన్ తరఫున వాదించిన లాయర్లు మిఖాయిల్ ఫ్రాలోవ్, అలెగ్జాండర్ సాఖావ్ గట్టిగా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలను విన్న కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు వెలువరించింది. తీర్పు అనంతరం సాఖావ్ స్పందిస్తూ ‘రష్యా నిజమైన ప్రజాస్వామిక సమాజంగా మారుతోందని జడ్జీల నిర్ణయం తెలియజేస్తోంది’ అని వ్యాఖ్యానించారు.

భారత్ హర్షం

కోర్టు తీర్పుపై భారత ప్రభుత్వంతోపాటు ‘ఇస్కాన్’ హర్షం వ్యక్తం చేసింది. సున్నితమైన అంశంపై వివేకమైన తీర్పును ప్రశంసిస్తున్నట్లు భారత విదేశాంగశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ వివాదానికి తెరపడటం సంతోషంగా ఉందని తెలిపింది. ఈ తీర్పు సాధ్యమయ్యేలా చేసిన రష్యాలోని స్నేహితులందరినీ అభినందిస్తున్నామని కొనియాడింది. భారత్, రష్యా ప్రజలకు ఉభయ దేశాల సంస్కృతిపై సంపూర్ణ అవగాహన ఉందని ఈ తీర్పుతో మరోసారి రుజువైందని...ఉమ్మడి నాగరికత విలువలను అవమానించేందుకు జరిగే ఎటువంటి ప్రయత్నాన్ని అయినా తోసిపుచ్చుతామనే సందేశాన్ని తాజా ఉత్తర్వులతో ఇచ్చినట్లు అయిందని చెప్పింది. కోర్టు కేసు విషయంలో తమకు మద్దతు పలికినందుకు రష్యాకు భారత విదేశాంగ మంత్రి ఎస్.ఎం. కృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు. కోర్టు తీర్పు మెచ్చుకోదగ్గదని రష్యాలోని భారత రాయబారి అజయ్ మల్హోత్రా అన్నారు. కోర్టు తీర్పు సంతోషం కలిగించిందని మాస్కోలోని ఇస్కాన్ విభాగం సభ్యురాలు, హిందూ కౌన్సిల్ ఆఫ్ రష్యా చైర్మన్ సాధుప్రియా దాస్‌తోపాటు ఢిల్లీలోని ఇస్కాన్ ప్రతినిధి బ్రజేంద్ర నందన్ తెలిపారు.

27, డిసెంబర్ 2011, మంగళవారం

‘హిందూ సంస్కృతిని ఆచరించండి లేదా హిందూ జాతికి బానిసలు కండి” -ఆర్.ఎస్.ఎస్ గురువు గోల్వాల్కర్


మీరు చదువుతున్న టపా
మార్క్సిజం-లెనిజిజం


(రష్యాలో భగవద్గీతపై నిషేధానికి సంబధించి నేను రాసిన పోస్టు కింద ఓ మిత్రుడు చేసిన వ్యాఖ్యకు ఈ పోస్టు సమాధానం గా గ్రహించగలరు)
గోల్వార్కర్ ఆర్.ఎస్.ఎస్ కి రెండవ గురువు అన్న సంగతి విదితమే. హెడ్గేవార్ ఆర్.ఎస్.ఎస్ స్ధాపించినప్పటికీ గోల్వార్కర్ నేతృత్వంలో ఆర్.ఎస్.ఎస్ భావాజాలం అభివృద్ధి చెందిందని అందరూ అంగీకరిస్తారు. భారత దేశంలో ముస్లింల భవిష్యత్ పై ఆర్.ఎస్.ఎస్ అభిప్రాయాలు ఎలా ఉన్నదీ గురు గోల్వార్కర్ మాటల్లోనే తెలుసుకోవడం ఉచితంగా ఉంటుంది. “వుయ్ ఆర్ అవర్ నేషన్‌హుడ్ డిఫైన్డ్” (We or Our Nationhood Defined) అన్న పుస్తకాన్ని గురు గోల్వాల్కర్ రచించారు. ఆ పుస్తకం నుండి కొన్ని అంశాలను చూద్దాం. ఆయన భారత దేశంలో ముస్లింలను గురించి ఇలా అన్నాడు.
హిందూస్ధాన్ (భారత దేశం)లో ఉన్న విదేశీ జాతులు (races) హిందూ సంస్కృతినీ, భాషనూ అవలంబించడమైనా చేయాలి, హిందూ మతం పట్ల గొప్ప భక్తి శ్రద్ధలను కలిగి ఉండి దానిని గౌరవించడం నేర్చుకోవాలి, హిందూ జాతి, సంస్కృతులను అనగా హిందూ జాతిని కీర్తించడం తప్ప మరే భావజాలాన్నీ వారు కలిగి ఉండకూడదు, మరియు వారి ప్రత్యేక ఉనికిని వదులుకొని హిందూ జాతిలో కలిసి పోవాలి లేదా దేశంలో ఉంటూ పూర్తిగా హిందూ జాతి కింద బానిసలుగా (సబార్డినేట్) ఉండాలి, దేనినీ తమదిగా చెప్పరాదు, ఎటువంటి సౌకర్యాలనూ వారు అనుభవించలేరు, ప్రాధాన్యతా ట్రీట్‌మెంట్ వారికి ఉండరాదు -పౌర హక్కులు సైతం వారికి ఉండరాదు. కనీసం వారికి ఏ ఇతర పద్ధతి (కోర్స్) కూడా అనుసరణకు అందుబాటులో ఉండరాదు. మనము పాత జాతి. మన దేశంలో నివసించడానికి నిర్ణయించుకున్న విదేశీ జాతుల పట్ల పాత జాతులు ఎలా ప్రవర్తిస్తాయో అలానే ప్రవర్తిద్దాం. (‘వుయ్ ఆర్ అవర్ నేషన్‌హుడ్ డిఫైన్డ్’ పుస్తకం నుండి)
… … …జర్మన్ జాతి ప్రతిష్ట ఈ రోజుల్లో చర్చాంశంగా ముందుకొచ్చింది. తమ జాతి స్వచ్ఛతనూ, సంస్కృతినీ కాపాడుకోవడానికి జర్మనీ తన దేశాన్ని సెమిటిక్ జాతి -యూదులు- లేకుండా శుభ్రపరచడం ద్వారా ప్రపంచానికి షాక్ ఇచ్చింది. ఇక్కడ జాతి ప్రతిష్ట అత్యంత సమున్నత స్ధాయిలో స్పష్టం చేయబడింది. పునాదిలో విభేధాలున్న జాతులు మరియు సంస్కృతులు ఒకే మొత్తంగా కలిసి పోవడం దాదాపుగా ఎంత అసాధ్యమో జర్మనీ చాటి చెప్పింది. హిందూస్ధాన్ లో ఉపయోగించడానికీ, నేర్చుకుని లబ్ది పొందడానికీ ఇది మంచి పాఠం. (‘వుయ్ ఆర్ అవర్ నేషన్‌హుడ్ డిఫైన్డ్’ పుస్తకం నుండి)
పైన ఉదహరించిన గురు గోల్వాల్కర్ బోధనలనుండి మనకు ఏమి తెలుస్తోంది. ముస్లింలు తమ ప్రత్యేక ఉనికిని వదులుకుని హిందూ జాతిలోనైనా కలిసి పోవాలి లేదా హిందూ జాతికి బానిసలుగానైనా పడి ఉండాలి అని ఆయన బోధించినట్లు అర్ధం అవుతోంది. ఆయన నేరుగా ‘బానిసలు గా ఉండాలి’ అన్లేదు కదా అని కొందరు తెలివిగలవారు ప్రశ్నించవచ్చు. నిజమే నేరుగా అన్లేదు గానీ బానిసల జీవనవిధానాన్నే ఆయన ముస్లింలకు (విదేశీ జాతులకు) ప్రబోధించాడు. హిందూ జాతికింద ఉండాలనీ, దేనినీ తమదిగా చెప్పరాదనీ (ఆస్తి హక్కులు ఉండరాదని), స్వంత ఉనికిని వదులుకోవాలనీ, అసలు పౌర హక్కులనే వదులుకోవాలనీ ఆయన చేసిన బోధన అంతా బానిసలకు సంబంధించింది తప్ప మరొకటి కాదు. మానవ జాతి చరిత్రను పరికిస్తే కనీస పౌర హక్కులు లేకుండా బతికింది బానిస వ్యవస్ధలో బానిసలు మాత్రమే. ఆ తర్వాత వచ్చిన ఫ్యూడల్ వ్యవస్దలో రైతులకు ఆస్తి హక్కులు ఉన్నాయి. ఇక్కడ భారత దేశంలో ముస్లింలకు ఆస్తి హక్కు కూడా (పౌర హక్కుల్లో ఇదీ ఒకటి) ఉండరాదని గురు గోల్వార్కర్ బోధించాడు. విదేశీ జాతులు అని పేర్కొనడం ద్వారా గురు గోల్వార్కర్, ముస్లిం ప్రజలు లేదా జాతి భారత దేశానికి చెందినవారు కాదనీ, విదేశీయులనీ చెప్పాడు. అంతేకాక భారత దేశంలో ఉన్న ముస్లింలు కూడ విదేశీయులేనని ఆయన స్పష్టం చేశాడు.
అంతేనా! గురు గోల్వార్కర్, యూదులపైన జాతి హత్యాకాండను అమలు జరిపిన జర్మనీని ఆదర్శవంతమైనదిగా కీర్తించాడు. ప్రపంచం అంతా జర్మనీని ఫాసిస్టు దేశంగా, హిట్లర్ ను ఫాసిస్టు నియంతగా తిట్టిపోస్తుంటే ఇక్కడ గురు గోల్వాల్కర్ మాత్రం జర్మనీ తన దేశాన్ని యూదు జాతి లేకుండా శుభ్రపరుచుకుందని కీర్తించాడు. తద్వారా తాను స్వచ్ఛమైన, కల్తీ లేని జాతిగా ఆవిర్భవించిందని కీర్తించాడు. పైగా జర్మనీ పాఠాలు హిందూస్ధాన్ లో అమలు చేయాలని కాంక్షించాడు. తద్వారా భారత దేశంలో హిందూ జాతిని స్వచ్ఛం కావించాలని ఆయన సందేశం ఇచ్చాడు. హిందూ జాతిని స్వచ్ఛం కావించడం అంటే ఇక్కడ ఉన్న విదేశీ జాతులను ఇక్కడినుండి తరిమి వేయాలి. జర్మనీ యూదులను గుంపుగుంపులుగా చంపేసి తరిమేసినట్లుగా భారత దేశం కూడా ముస్లింలను గుంపులు గుంపులు గా చంపేసి ఇక్కడినుండి తరిమి కొట్టాలి. గుజరాత్ లో ముస్లింలపై సాగించిన నరమేధం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు. గుజరాత్ రాష్ట్రం ఆర్.ఎస్.ఎస్ భావాజాలానికి ఒక ప్రయోగశాల గా భాసిల్లుతున్న విషయం కూడా ఇక్కడ ప్రస్తావనార్హం.
ఇందులో ఏవైనా అంశాలను పిడివాదంగా ఎంచి ఆర్.ఎస్.ఎస్ సవరించుకున్నదేమో తెలియదు. అటువంటిది ఏమైనా ఉంటే సంబంధిత మిత్రులు తెలియజేయగలరని ఆశిస్తున్నాను.

ఇంగ్లండులో భారతీయ విద్యార్ధి హత్య, రేసిజమే కారణం?



విహార యాత్రకి వెళ్ళిన భారతీయ విద్యార్ధి ఇంగ్లండులో హత్యకు గురయ్యాడు. లాంకాస్టర్ యూనివర్సిటీ లో ఎలక్ట్రానిక్స్ లో పి.జి చదువుతున్న ఇరవై మూడేళ్ళ విద్యార్ధి సాల్ ఫోర్డ్ (గ్రేటర్ మాంఛెస్టర్) సందర్శనకు వెళ్ళగా అక్కడ ఓ బ్రిటిష్ వ్యక్తి దగ్గరినుండి కాల్చి చంపాడు. సంఘటన సోమవారం తెల్లవారు ఝాముల జరిగింది. పోలీసులు ఈ ఘటన రెచ్చగొట్టబడిన కారణాలు ఏవీ లేకుండానే జరిగిందని చెప్పారు. అయితే జాతి విద్వేషంతో ఈ హత్య జరిగిందా, లేదా అని చెప్పడానికి వారు నిరాకరించారు. భారత దేశంలో ఉన్న విద్యార్ధి తల్లిదండ్రులకు అతని మరణవార్తను తెలియజేశారని తెలుస్తోంది.
క్రిస్టమస్ సెలవు సందర్భంగా విద్యార్ధి తన తొమ్మిది మంది స్నేహితులతో కలిసి సాల్ ఫోర్డ్ వెళ్ళాడు. మిత్రులలో అమ్మాయిలూ, అబ్బాయిలూ ఉన్నట్లు తెలుస్తోంది. బృందంలో ఉన్నవారంతా భారతీయులేనని పత్రికలు తెలిపాయి. హత్య జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే ఉన్న హోటల్ లో తొమ్మిది మంది బసచేశారని పోలీసులు తెలిపారు. సోమవారం తెల్లవారు ఝాము ఒకటిన్నర సమయంలో హోటల్ నుండి సిటీ సెంటర్ కి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు వారిని సమీపించినట్లుగా పోలీసులు తెలిపారు. చాలా కొద్ది సేపు మాత్రమే సంభాషణ జరిగిన అనంతరం ఇద్దరిలో ఒకరు తుపాకి తీసి అత్యంత సమీపం నుండి విద్యార్ధి తలలో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇద్దరు వ్యక్తులు అక్కడినుండి పారిపోయారు.
విద్యార్ధిని ఆసుపత్రికి తీసుకెళ్ళగా అప్పటికే చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. కాల్చిన వ్యక్తి సన్నగా ఉన్నాడనీ, రెండో వ్యక్తి లావుగా ఉన్నాడనీ మిత్రులు తెలిపారు. వారు విద్యార్ధితో ఏమి మాట్లాడిందీ చెప్పడానికి పోలీస్ ఛీఫ్ నిరాకరించాడు. విద్యార్ధి మిత్రులు ప్రారంభ సాక్ష్యం ఇచ్చారనీ, వారికి రక్షణ కల్పించామని పోలీసులు తెలిపారు. “ఇది ముందస్తు కారణం ఏమీ లేకుండా జరిగిన హత్య. ఈ సమయంలో ఏ ఉద్దేశాన్నీ నిందితుడికి ఆపాదించలేము. ప్రతి అంశాన్నీ పరిశీలిస్తున్నాం. దర్యాప్తులో ప్రాధమిక దశలో ఉన్నాం. కాని ఏ అంశాన్నీ కొట్టిపారేయడం లేదు” అని పోలీస్ ఛీఫ్ తెలిపాడు. జాతి విద్వేషం కూడా తమ దర్యాప్తు అంశాలలో ఉందని పోలీస్ ఛీఫ్ పరోక్షంగా తెలిపాడు.
ఈ ఘటనతో స్ధానిక భారత సంతతి ప్రజల్లో భయాందోళలనలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ప్రాంతంలో పోలీసులు భద్రతా చర్యలను పెంచారు. భారతీయుల భయాందోళనలను తామూ పంచుకుంటున్నామనీ నేరస్ధులను అరెస్టు చేయడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తామనీ పోలీస్ ఛీఫ్ ముల్లిగాన్ హామీ ఇచ్చాడు. విద్యార్ధి పేరు పోలీసులు చెప్పలేదు. నిందితుల గురించిన వివరం తెలిసిన వారు పోలీసులకి చెప్పాలని పోలీసు ఛీఫ్ స్ధానికులకి విజ్ఞప్తి చేశాడు. తమ దగ్గరి వ్యక్తులే ఈ ఘోరకలికి బలయ్యారని భావించి నేరస్ధుల సమాచారం ఇవ్వాలని వారు కోరారు.
ఇంగ్లండులో కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వం ప్రజలపైన దారుణమైన పొదుపు విధానాలను అమలు చేస్తున్నది. బడా కంపెనీలకు పెద్ద ఎత్తున బెయిలౌట్లు ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై అప్పు భారం బాగా పెరిగిపొయింది. బడ్జెట్ లోటు బాగా పెరిగిపోయింది. బడ్జెట్ లోటు తగ్గించుకునే పేరుతో బ్రిటన్ ప్రభుత్వం పొదుపు విధానాలను అమలు చేస్తోంది. పొదుపు విధానలలో భాగంగా ఉద్యోగాలు రద్దు చేస్తున్నారు. వేతనాలలో కోత పెడుతున్నారు. సంక్షేమ సదుపాయాలను రద్దు చేయడంఓ కోత పెట్టడమో చేస్తున్నారు. దీనితో ప్రజల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది.
ప్రజల అసంతృప్తిని ప్రభుత్వాల పొదుపు ఆర్ధిక విధానాలనుండి పక్కకు మళ్ళించడానికీ, బ్రిటన్ తో పాటు యూరప్ లోని ఇతర ప్రభుత్వాలు కూడా వివిధ సాంఘిక సమస్యలను రెచ్చగొట్టడం ప్రారభించాయి. అందులో ప్రధానంగా ‘మల్టి కల్చరలిజం’ విఫలం అయిందంటూ ప్రభుత్వాధినేతలే ప్రచారం లంకించుకున్నారు. విదేశీయులు ఉండడం వల్ల యూరోపియన్లకు ఉద్యోగావకాశాలు దొరకడం లేదని తప్పుడు ప్రచారం వీరు చేస్తున్నారు. ఒక్క బ్రిటన్ లో కాకుండా యూరప్ అంతటా ఈ ధోరణి పెచ్చరిల్లింది. దానితో యూరప్ లో విదేశీయులపై దాడులు ఊపందుకున్నాయి. ముఖ్యంగా నల్లవారు, క్రీమ్ కలర్ వారు అన్న తేడాలను చూపడం యువతలో ఎక్కువయ్యింది. ఈ ధోరణిని అరికట్టని పక్షంలో మరిన్ని దారుణాలు జరిగే అవకాశం ఉంది. భారతీయులు ఇంగ్లండ్, ఆ మాటకొస్తే యూరప్, అమెరికాలను కూడా సందర్శించేముందు ఒకటికి రెండుసార్లయినా ఆలోచించుకోవలసిన అవసరం ఉంది.

ఇరాన్ మహిళకు మరణ శిక్ష అమలు చేసే అవకాశం, రాళ్ళతో కొట్టి గానీ లేదా ఉరితీయడం ద్వారా గానీ



వ్యభిచారం నేరం కింద అరెస్టు చేయబడి జైలులో శిక్ష అనుభవిస్తున్న నడి వయసు ఇరానియన్ మహిళకు మరణ శిక్ష అమలు చేసే అవకాశం ఇంకా మిగిలే ఉందని ఇరాన్ అధికారుల ద్వారా తెలుస్తోంది. వేరోక పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకున్న నేరానికి “సకినే మొహమ్మది అష్తియాని” అనే మహిళకు గత సంవత్సరం ఇరాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ శిక్షను రాళ్ళతో కొట్టి చంపడం ద్వారా అమలు చేయాలని ఇరాన్ కోర్టు తీర్పు ఇవ్వడంతో దానికి వ్యతిరేకంగా ప్రపంచం అంతటా ఆందోళనలు వ్యక్తం అయ్యాయి.
ఏ ఖతార్ లోనో, సౌదీ అరేబియాలోనో ఈ విధంగా వ్యభిచారం నేరంపై ఓ మహిళకు మరణ శిక్ష విధించి రాళ్ళతో కొట్టి చంపాలని తీర్పు ఇచ్చినట్లయితే ఆ విషయం అసలు బైటికి పొక్కి ఉండే అవకాశమే ఉండేది కాదు. బైటికి పొక్కినా ఆ అంశాన్ని పశ్చిమ దేశాల పత్రికలు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఉండేవి కాఫు. వీలయితే అటువంటి వార్తలు బైటికి రాకుండా చెయ్యడానికి పశ్చిమ వార్తా సంస్ధలు శాయ శక్తులా సహకరిస్తాయి కూడా. ఇరాన్ పై బురద జల్లే కార్యక్రమాన్ని పశ్చిమ దేశాల వార్తా సంస్ధలూ, వాటిని అనుసరించే మూడో ప్రపంచ దేశాల వ్యాపార వార్తా సంస్ధలు వదులుకోవు గనకనే అస్ధియాని మరణ శిక్షపై ఇంత గొడవ జరుగుతోంది.
సకినే అస్ధియానీ పదేళ్ళ జైలు శిక్ష అనుభవిస్తూ ఇప్పటికే జైలులో ఉంది. తన భర్తను చంపిన కేసులో సహకరించినందని నిర్ధారిస్తూ కోర్టు పదేళ్ల శిక్ష వెయ్యడంతో ఆమె జైలులో ఉంది. రాళ్ళతో కొట్టి చంపాలన్న తీర్పు పట్ల అంతర్జాతీయంగా మానవ హక్కుల సంస్ధలు ఆందోళన వ్యక్తం చెయ్యడంతో ఇరాన్ ప్రభుత్వం ఆ శిక్షను గత సంవత్సరం సస్పెన్షన్ లో పెట్టింది. అయితే అస్ధియానికి మరణ శిక్షను అమలు చేయడాన్ని ఇరాన్ ప్రభుత్వం సస్పెండ్ చెయ్యలేదు. అస్ధియానిని రాళ్ళతో కొట్టి చంపాలన్న శిక్షను ఉరి తీసి చంపడంగా మార్చగల అవకాశాలను న్యాయ నిపుణులు పరిశీలన చేస్తున్నట్లుగా ఇరాన్ న్యాయ విభాగ అధికారులు తెలిపారు.
“తొందరేమీ లేదు. …రాళ్ళతో కొట్టి చంపాలన్న శిక్షను ఉరి తీసి చంపడంగా మార్చవచ్చో లేదో పరిశీలిస్తున్నాం” అని తూర్పు అజర్‌బైజాన్ రాష్ట్ర న్యాయ విభాగపు అధిపతి మాలేక్ అజ్దర్ షరీఫి తెలిపాడు. పరిశోధన ఫలితం వచ్చాక శిక్ష అమలవుతుందని ఆయన చెప్పాడు. వివాహిత స్త్రీ అక్రమ సంబంధం పెట్టుకున్నట్లయితే రాళ్లతో కొట్టి చంపాలని చట్టం చెబుతుందని ఆయన చెప్పాడు. భర్త హత్యానంతరం అస్ధియాని వ్యభిచారానికి (అక్రమ సంబంధం) పాల్పడ్డట్టుగా 2006 లో కోర్టు నిర్ధారించి రాళ్ళతో కొట్టి చంపాలని శిక్ష వేసింది. అనంతరం భర్త హత్యకు సాధనంగా ఉపయోగపడిందన్న ఆరోపణ కోర్టులో రుజువు కావడంతో పదేళ్ల జైలు శిక్ష ఆమెకు విధించారు.
ముస్లిం మతంలో స్త్రీ, పురుష వివక్ష ఇతర మతాలకు మల్లే కొనసాగుతోంది. పురుషుడు ఎంతమంది స్త్రీలనైనా వివాహమాడే అవకాశం ఇస్తూ స్త్రీలను గడపదాటరాదని శాసించే నిబంధనలు ముస్లిం మతంలో దండిగానే ఉన్నాయి. మతంతో సంబంధం లేకుండా స్త్రీలు అన్ని మతాల్లో ఈ విధమైన అణచివేతకు గురవుతున్నారు. స్త్రీలకు ఆర్ధికంగా స్వయం నిర్ణయ హక్కు లేకపోవడం ఈ పరిస్ధితికి దారితీసిన ప్రధాన కారణంగా ఉంది. స్త్రీలు ఆర్ధిక స్వతంత్రులు కానీయకుండా చేయడానికి మతాలు తగిన నియమ నిబంధనలు అమలు చేస్తున్నాయి. అన్ని మతాల్లోనూ స్త్రీలపై అణచివేత కొనసాగడానికి వ్యతిరేకంగా స్త్రీ, పురుషులిరువురూ ఐక్యంగ పోరాడవలసిన అవసరం ఉంది.

IBM's Five Best Predictions in Tech for the Next Five Years

Smart email, mind-reading devices and biometric password are predicted to become mainstream in the next five years.
ZoomIBM has predicted the future, and it contains mind-reading machines and the death of character-based passwords. This revelation stems from the company's sixth annual Five in Five where it predicts five innovations that will change our lives within the next five years. The company assesses not just the availability of a new technology, but also the likelihood of its large scale adoption.
"In addition to the PR value, we complete this exercise annually because it makes IBMers think hard about what’s possible and to strive to make it so," writes IBM's Steve Hamm. "Simply put, the process of choosing the predictions and defending them is good for us."
So what's in store for us within the next five years? Here are all five with a brief summary:
People power will come to life
We will make our own energy instead of relying on monopolizing power companies. If it moves, then it can create energy. "In the next five years, advances in renewable energy technology could make it possible for us to draw on power generated by everything from our running shoes to the ocean’s waves.," predicts IBM distinguished engineer Harry Kolar.
You will never need a password again
Passwords won't be necessary because security measures will depend on your biological makeup. "Biometric data such as retinal scans and voice files will be combined through software to build you a DNA-unique online password," the company claims.
Mind reading is no longer science fiction
Scientists are trying to figure out how to link the devices you own directly to your brain without an actual physical The Matrix-like cranial plug. The idea is to think about making a call, and the smartphone responding to the command.
The digital divide will cease to exist
"Mobile devices will assist you in your daily life by initiating the communication with you and providing helpful information based on your context," predicts IBM chief technology officer for telco research Paul Bloom. "For example, when you order your lunch from your cell phone, you might get a message recommending a healthier selection, based on the restaurant and your personal profile."
Junk mail will become priority mail
"Imagine a future where some sources of unsolicited advertisement produce such useful and perfectly timed ads, that you would signup," writes Jeff Jonas, IBM Distinguished Engineer and Software Group's Chief Scientist of Entity Analytics. "A world where virtually every text message or email pushed at you is so relevant that this 'service' starts feeling like a best friend."
IBM points out that many of its previous predictions have come true including the use of nanotechnology, the ability to affordably decipher an individual’s entire genome, communicating with the internet via speech recognition, and remote access to healthcare. As for its current predictions, IBM explains each in a 5-minute video summary, embedded below.

8 reasons that will make you buy the Aakash

Previously, a $35 laptop was said to be in preps for the Indian market, with a motive to make quality education an achievable target for students who couldn't afford one. Just when the emergence of the device began seeming to be a distant dream, Telecom Minister, Kapil Sibal along with DataWind introduced the "world's most affordable tablet".

Tablets had become a rage by then and clearly seemed to be the next-gen computer. Although, the affordable laptop, which was the original plan, had been in the works, probably and obviously building a tablet may have seemed to be quicker. Tablets have been making a splash, worldwide, through the year and with Aakash, this segment received more boost. Aakash is a basic tablet, while it comes with some improvements in the form of the UbiSlate 7. The DataWind UbiSlate 7, or say the commercial version of Aakash has reached a milestone with over 3 lakh pre-orders, already.

A tear down, earlier by IBN Live clearly exposed the poor internal components and a questionable build quality. The resistive screen has been a big selling hindrance to several devices. But the question is how much are we supposed to ask from a 7-inch tablet, in a price range as low as Rs. 2,500 to 2,999. The device has been crafted to initiate tech-imbued technology for students in schools and colleges, across India. The commercial version brings the tablet within the reach of the masses. We’ve penned down 8 reasons that could make you buy the Aakash in India.
Delighted students at the launch of the Aakash tablet in New Delhi, last month
Cheapest tablet


Affordable Price
It may sound clichéd, but everything boils down to the pricing considering the price sensitive Indian market. The key selling point of the tablet is evidently its pricing. In fact, it was meant to come with a price point, which would be as low as possible to reach wider audiences. Aakash sells for Rs. 2,500, while the UbiSlate for Rs. 2,999. For Rs. 2,999, the 7-inch UbiSlate has a decent set of specifications to be cheapest tablet in the world.

Phone
Another aspect worth considering is the support for call functionality that the tablet offers. Yes, it works as a phone using a SIM card. Unlike the Reliance 3G Tab, it isn’t SIM locked to any carrier and gives you the flexibility of choice. The call functionality is also one of the factors that distinguish it from the Aakash tablet. This sub-3K device has a standard 3.5mm jack, further adding to the convenience of making and receiving calls.

Android 2.3
There are devices still running on Froyo, so it's good to see the UbiSlate run on the Android 2.3 Gingerbread platform. This will also bring in support for the Android Market.

Connectivity
Now, the UbiSlate 7 has a minimalist approach, but it has managed to have the connectivity aspect in place. Several connectivity options and ease of use are some factors that users look forward to, and the UbiSlate 7 strives to offer optimum features within a tiny budget. It supports GPRS, Wi-Fi and 3G dongle. Now, that’s a good deal for a device under Rs. 3,000.

External memory
On the memory front, the UbiSlate 7 is at par with many tablets. It has a 2GB internal memory, which can be further extended up to 32GB, using the external microSD card. The overall storage capacity of this tablet, is almost on the same level as other tablets carrying hefty price tags, comparatively. In fact, it takes a step ahead with support for two standard USB 2.0 ports, which allow connecting external storage devices like a flash drive, webcams and more.

Warranty
Since the Aakash and its commercial version were announced, the question has been about its build quality and overall performance. How long can a Rs. 2,900 device last. Well, we presume at least a year. DataWind offers 30 days replacement warranty, along with a one year warranty.

Portability
Whether it’s the all-plastic body or weaker components, DataWind hasn’t compromised on the portability factor. The 7-incher tips the scale at 350 grams, which is quite decent. You can easily slip the 7-incher in your bag.

Display size and resolution
It is nice to see that UbiSlate 7 didn’t settle for a smaller screen and maintained the average or standard, if we may say so, 7-inch screen size (again we aren’t considering the screen performance). Again the screen carries a fairly acceptable resolution of 800x480.

Though debatable, these may be the selling points that would help make the Aakash UbiSlate 7 a success story in the Indian market. Now available for pre-order from here, it will start shipping by late January 2012. A more improved version is also expected sometime around next year, which will add in better processing speed, along with a few improvements like an external keyboard just for Rs. 3,500.                             

However, the views are based on the price and the spec sheet that the device carries, and things may change depending upon the performance it eventually delivers.