30, ఆగస్టు 2013, శుక్రవారం

నిజాం షుగర్స్‌ను నట్టేట ముంచారు !


- ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిన చంద్రబాబు
- సభాసంఘం వేసి చేతులు దులుపుకున్న వైఎస్సార్
- స్వాధీనం చేసుకోవాలన్న సభాసంఘం..హైకోర్టుదీ అదే తీర్పు
- ఏడేళ్లయినా స్పందించని ‘సమైక్య’ పాలకులు
- తెలంగాణ రాష్ట్రంలోనే నిజాం షుగర్స్‌కు పూర్వవైభవం


nizamsబోధన్, ఆగస్టు 29 (టీ మీడియా):కలిసి ఉందామంటూనే సమైక్య పాలకులు తెలంగాణ కు తీరని అన్యాయం తలపెట్టారు. తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రముఖమైన నిజాం షుగర్స్ లిమిటెడ్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. తెలంగాణ వారసత్వ సంపదగా వెలుగొందిన నిజాం షుగర్స్ అస్తిత్వాన్ని దెబ్బతీసి మెజార్టీ వాటాను ప్రైవేట్‌వ్యక్తులకు అంటగట్టడం సమైక్యపాలకులకే చెల్లింది. కంపెనీలు నష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సిన సర్కారు, ఏకంగా అమ్మేయడం ఆంధ్రాబాబుల పాలనలో యథేచ్ఛగా కొనసాగింది. తిరిగి స్వాధీనం చేసుకోవాలని శాసనసభా సం ఘం, హైకోర్టు ఆదేశించి ఏడేళ్లు గడుస్తున్నా నేటికీ స్పందన లేదు. తెలంగాణను అభివృద్ధి చేస్తామంటున్న సమైక్యవాదు లు దీనికి ఎం సమాధానం చెబుతారో? రూ.300 కోట్ల విలువున్న కంపెనీని కారుచౌకగా రూ.67 కోట్లకే మెజార్టీ వాటా ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేయడం వలసపాకులకే చెల్లిం ది. తెలంగాణలోని పరిక్షిశమలపై ప్రైవేట్‌వ్యక్తుల గుత్తాధిపత్యానికి రెడ్‌కార్పేట్ పరిచి పూర్తిగా ప్రైవేటీకరించేందుకు పావులు కదుపుతున్నారు. ఇంకా సమైక్యంగా ఉండాలనడంలో ఏమై నా అర్థం ఉందా!

అనుకున్నదే తడవుగా అమ్మకం
ఒకప్పుడు ఆసియా ఖండంలోనే అతిపెద్ద చక్కెర ఫ్యాక్టరీగా నిజాంషుగర్స్ పేరొందింది. దీని యూనిట్లను అప్పటి సీఎం చంద్రబాబు నిబంధలకు వ్యతిరేకంగా ప్రైవేటీకరించారు. ప్రైవేటీకరణ జాయింట్ వెంచర్ రూపంలో జరిగింది. డెల్టా పేపర్ మిల్స్‌కు 51శాతం వాటా, నిజాం షుగర్స్‌కు 49శాతం వాటాకు పెట్టిన ముద్దుపేరే ‘జాయింట్ వెంచర్’. వాస్తవానికి ఫ్యాక్టరీని మొత్తంగా డెల్టా పేపర్‌మిల్స్ యాజామాన్యం స్వాధీనం చేసుకుంది. 2002లో ఈ ప్రైవేట్ యాజామాన్యం శక్కర్‌నగర్, మెట్‌పల్లి, మెదక్‌యూనిట్లతోపాటు నిజాంషుగర్స్‌కు చెందిన శక్కర్‌నగర్ ఆల్కహాల్ డిస్టిల్లరీ యూనిట్‌ను కూడా స్వాధీనం చేసుకుంది. తెలంగాణ ప్రజలు, బోధన్ ప్రాంత చెరుకు రైతులు, కార్మికులు ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, నాటి చంద్రబాబు ప్రభుత్వం మొండి గా వ్యవహరించింది.

అధికారంలోకి వస్తే నిజాం షుగర్స్ ప్రైవేటీకరణను రద్దు చేస్తామని 2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర్‌డ్డి ప్రకటించారు. 2004లో అధికారంలోకి రాగానే నిజాం షుగర్స్ వ్యవహారంపై శాసనసభా సంఘాన్ని నియమించి అప్పటి దేవాదాయ, ధర్మదాయశాఖ మంత్రి రత్నాకర్‌రావు చైర్మన్‌గా, ఎమ్మెల్యేలు చిన్నాడ్డి, పీ సుదర్శన్‌డ్డి, బాజిడ్డి గోవర్ధన్, ఎస్ గంగారాం, సురేశ్‌షెట్కార్, పద్మాదేవేందర్‌డ్డి, శశిధర్‌డ్డి, కళా సభ్యులుగా నియమించారు. ‘జాయింట్ వెంచర్’ పేరిట జరిగిన ప్రైవేటీకరణలో అవినీతి, అక్రమాలు జరిగాయని సభాసంఘం గుర్తించింది. జాయింట్ వెంచర్ ఒప్పందం తర్వాత కూడా ఒప్పందంలోని అంశాలను ప్రైవేట్ యాజమాన్యం ఉల్లంఘించినట్లు సభాసంఘం తేచ్చింది. నిజాంషుగర్స్ ఆస్తుల విలువను రూ.300కోట్లుగా అంచనావేసి, కారుచౌకగా రూ.67కోట్లకు విక్రయించడాన్ని తప్పుబట్టింది. జా యింట్ వెంచర్ చెల్లదని, నిజాంషుగర్స్ యూనిట్ల ప్రభు త్వం స్వాధీనం చేసుకోవాలని సిఫార్సు చేసింది.

కోర్డులనూ గౌరవించని పాలకులు
నిజాం షుగర్స్ ప్రైవేటీకరణపై సభాసంఘం సిఫార్సుల అమ లు విషయంలోనూ కాంగ్రెస్ పాలకులు కాలయాపన చేస్తున్నారు. స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు తీవ్రస్థాయిలో హెచ్చరించినా ఫలితం లేదు. ఈ విషయమై 2007లో నిజాం షుగర్స్ పరిరక్షణ సమితి కన్వీనర్ ఎం అప్పిడ్డితో పాటు నలుగురు రైతు నాయకులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

2007జూలై 2 ఆరు వారాల్లో సభా సంఘం సిఫార్సులను అమలు చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆరేళ్లయినా ఆ తీర్పును ప్రభుత్వం ఖాతరు చేయలేదు. దీంతో రైతు నాయకులు ఈ ఏడాది జనవరిలో మరోసారి హైకోర్టు లో కొందరు మరో ప్రజావూపయోజన వ్యాజ్యం దాఖలు చేశా రు. ఈసారి కూడా అడ్వకేట్ జనరల్ కుంటిసాకులు చెబు తూ గడువులు తీసుకుంటూ ఏడాదిగా కాలయాపన చేస్తూ వచ్చారు. దీంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గత మార్చి లో మరోసారి ఆదేశాలు జారీచేశారు. అప్పటినుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మారుతుండటంతో ఈ విషయ మై కదలిక లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం కానుండటంతో ఇకనైనా నిజాం షుగర్స్ తమకు దక్కుతుందన్న ఆశ తెలంగాణ ప్రజల్లో కలిగింది.

చెరుకును కనుమరుగు చేసే కుట్ర?
నిజాం కాలంలో 193లో ప్రారంభమైన ఈ ఫ్యాక్టరీ ఆసియాలోనే ఓవెలుగు వెలిగింది. ప్రైవేట్ పరం చేయడానికి కొన్నేళ్ల కిందటి వరకు బోధన్‌తోపాటు మిగతా యూనిట్లలో నాలుగైదు వేల మంది కార్మికులు ఉపాధి పొందేవాళ్లు. ప్రస్తుతం బోధన్‌లో కేవలం 300 కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 220 మంది కాంట్రాక్ట్ కార్మికులే. ఆస్పత్రి, నివాస గృహాలు, రోడ్లు ఉండేవి. పదేళ్ల కింద ఐదు లక్షల టన్నుల చెరుకు క్రషింగ్ చేస్తే, గత ఏడాది 1.63 లక్షల టన్నులకు పడిపోయింది. ప్రైవేట్ పరమయ్యాక సాగు విస్తీర్ణం కూడా భారీగా తగ్గింది.

ఇదే సమయంలో ఈ ప్రాంతంలోని ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీలు లాభాల్లో దూసుకుపోతున్నాయి. అంటే పథకం ప్రకారం ప్రభుత్వరంగంలోని ఫ్యాక్టరీని నష్టాలబాట పట్టించి మూసివేయించడమే లక్ష్యంగా కనిపిస్తోంది. చెరుకును తెలంగాణ నుంచి కనమరుగు చేయడం, సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పెట్టుబడిదారులే చెరుకు పంటపై ఆధిపత్యం సాధించడమనేది స్థూల నిర్ణయమని తెలుస్తోంది. పదేళ్ల కింద రాష్ట్ర ఆదాయంతో పోలిస్తే ఇప్పుడు పదిట్లకు పైగా పెరిగింది. నిజాం షుగర్స్ విక్రయించే నాటికి బడ్జెట్ పదివేల కోట్లపైన ఉంటే, ప్రస్తుతం లక్షా యాభైవేల కోట్లు దాటింది. అయినా ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవడానికి అడ్డొచ్చే అవరోధాలు ఏమిటో వలసపాలకులకే తెలియాలి!

కృష్ణా జలాలపై.. ట్రిబ్యునల్ ముందు ముగిసిన వాదనలు


8/31/2013 2:00:33 AM
తీర్పు రిజర్వు, వచ్చే నెల 30లోగా వెలువరించే అవకాశం
హైదరాబాద్, ఆగస్టు 30(టీ మీడియా): కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల వినియోగం పూర్తయిన తర్వాతే ఇతర కేటాయింపుల వినియోగం ప్రారంభం కావాలని ఆంధ్రవూపదేశ్ పునరుద్ధాటించింది. మిగులు జలాల వినియోగానికి సంబంధించి ట్రిబ్యునల్ చేసిన తాజా ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ మేరకు జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్‌కు శుక్రవారం మన రాష్ట్రం తేల్చి చెప్పింది. నీటి వినియోగంపై ఆంధ్రవూపదేశ్ శుక్రవారం వాదనలను విన్పించడంతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకలు చేసిన వాదనలపై అభ్యంతరాలను ట్రిబ్యునల్‌కు రాతపూర్వకంగా తెలియజేసింది. ఆంధ్రవూపదేశ్ వాదనలతో బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎదుట మూడు రాష్ట్రాల తుది వాదనలు ముగిసినట్లయింది. దీంతో జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్ నీటి వినియోగంపై తుది తీర్పును రిజర్వులో ఉంచింది.

సెప్టెంబర్ 30లోగా ట్రిబ్యునల్ తుది తీర్పును వెలువరించే అవకాశం ఉంది. కృష్ణా జలాల వినియోగానికి సంబంధించిన తాజా ప్రతిపాదనపై మూడు రాష్ట్రాల మధ్య ఏకాభివూపాయం కుదరకపోవడంతో ఇక ట్రిబ్యునలే తుది నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యత ఆధారంగా కృష్ణా నదిలో మొత్తం 2,130 టీఎంసీల నికర జలాలు ఉన్నట్లు లెక్కగట్టి, బేసిన్‌లోని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రవూపదేశ్‌ల ఇదివరకే మధ్య కేటాయింపులు చేసింది. దీని ప్రకారం.. మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, ఆంధ్రవూపదేశ్‌కు 811 టీఎంసీలు దక్కాయి. కొత్తగా ఏర్పాటైన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్.. 65 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,293 టీఎంసీలు, సరాసరి నీటి లభ్యత కింద 2,578 టీఎంసీలు ఉన్నట్లు లెక్కగట్టి అదనపు జలాల(448 టీఎంసీల)ను మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది.

అయితే, బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల వినియోగం పూర్తయిన తర్వాతే... 65 శాతం లభ్యత ఆధారంగా అదనంగా కేటాయించిన 448 టీఎంసీలను వినియోగం ప్రారంభమవుతుందని తొలుత స్పష్టం చేసింది. దీనిపై ఎగువ రాష్ట్రాలు అభ్యంతరం తెలిపాయి. దీంతో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తాజాగా ఒక ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం.. 75 శాతం నీటి లభ్యత కింద ఆంధ్రవూపదేశ్‌లో లభ్యమయ్యే నీటి(352 టీఎంసీల)ని మినహాయిస్తే 459 టీఎంసీలు ఎగువ రాష్ట్రాల నుంచి రావాల్సి ఉంటుంది. ఈ నీటిని విడుదల చేసిన తర్వాత 65 శాతం నీటి లభ్యత ప్రకారం లభించే మిగులు జలాలను ఎగువ రాష్ట్రాలు వినియోగించుకోవచ్చని సూచించింది. దీనిపై మూడు రాష్ట్రాలు కలిసి చర్చించుకొని ఓ అభివూపాయానికి రావాలని ట్రిబ్యునల్ కోరింది.

ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల న్యాయవాదులు, ఇంజనీర్లు గత ఆది, సోమవారాల్లో ఢిల్లీలో సమావేశమై చర్చించినా.. ఏకాభివూపాయం రాలేదు. కొత్త కేటాయింపులు ఖరీఫ్ నుంచే వాడుకుంటామని కర్ణాటక, ప్రధాన కృష్ణా నుంచి భీమాకు మళ్లించుకుంటామని మహారాష్ట్ర, అదనపు నీటిని కేటాయించాలని ఆంధ్రవూపదేశ్ పట్టుబట్టాయి. ఎవరి వాదనలు వారివే కావడంతో ట్రిబ్యునల్ సూచనపై ఏకాభివూపాయం సాధ్యం కాలేదు. దీంతో ఈ విషయమై కర్ణాటక, మహారాష్ట్రలు మంగళవారమే ట్రిబ్యునల్‌కు తమ అభివూపాయాన్ని తెలుపగా... ఆంధవూపదేశ్ శుక్రవారం తన అభివూపాయాన్ని వెల్లడించింది. ట్రిబ్యునల్ తాజా సూచనను వ్యతిరేకించింది. ఈ కొత్త ప్రతిపాదన వల్ల రాష్ట్ర ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని పేర్కొంది.

విలీనం వివాహం వంటిది


-సంకుచిత తత్వాలను వదలాలి
-ఉదారంగా వ్యవహరించాలి
-దురహంకారం తగదని ఉద్బోధ
-ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో నాటి ప్రధాని నెహ్రూ వ్యాఖ్యలు
-సూచనలు పట్టించుకోని ఆంధ్ర నేతలు
-అడుగడుగునా తెలంగాణకు అన్యాయం
-దశాబ్దాల పోరాటాలతోనే సీడబ్ల్యూసీ నిర్ణయం
సెంట్రల్ డెస్క్:1956 నవంబర్ 1న గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో నెహ్రూ ప్రసంగం నవంబర్ 3వ నాటి ఆంధ్రపత్రికలో ఇలా రిపోర్టయింది..తెలంగాణ అనే అమాయక పడుచుకు ఆంధ్రా అనే గడుసరి కుర్రాడికి వివాహం జరిగిందని.. విలీనం సందర్భంగా నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చెప్పారు. నూతన సంబంధాలకు మూలమైన మసస్తత్వ సమస్యలన్నింటినీ గమనించి వ్యవహరించకపోతే వివాహం దుఃఖ హేతువు అవుతుందని కూడా హెచ్చరించారు. కొత్త ఆంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇది పరీక్షా సమయమని చెప్పిన నెహ్రూ.. ఉదారంగా వ్యవహరిస్తారో లేక.. సంకుచితంగా వ్యవహరిస్తారోనని ఆనాడే సందేహం వ్యక్తం చేశారు. అందరినీ కూడగట్టుకుని పోతారో లేక దురహంకారంతో వ్యవహరిస్తారోనని అనుమానాలూ వ్యక్తం చేశారు! కానీ.. నెహ్రూ అనుమానాలు నిజమయ్యాయి! ఆయన సందేహించిందే జరిగింది! విలీనం తర్వాతి దాదాపు ఆరు దశాబ్దాల కాలంలో తెలంగాణ నిలువునా మోసపోయింది! బంధం ముసుగులో బాధలు అనుభవించింది.

సంకుచితత్వాలను వదలాలని నెహ్రూ చేసిన ఉద్బోధలు గాలికి కొట్టుకుపోయి.. తెలంగాణపై తీవ్ర వివక్ష సాగింది. వర్గ కక్ష విభేదాలు మానాలన్న నెహ్రూ సూచనలను బుట్టదాఖలు చేసిన సీమాంధ్ర పాలకులు తెలంగాణ ప్రాంతంపై కక్షగట్టి.. వెనుకబాటుకు గురి చేశారు. భయాలు, సందేహాలు తొలగించాలని ఆనాడు ప్రధాని కోరితే.. వాటిని కొనసాగించిన పాలకులు.. పైగా రెట్టింపు చేశారు. తెలంగాణకు కల్పించిన రక్షణలన్నీ నీటిమూటలయ్యాయి. పెద్ద మనుషుల ఒప్పందం.. కాగితాలకే పరిమితమైంది. నీళ్లలో నిధుల్లో.. నియామకాల్లో పెద్ద ఎత్తున వివక్ష కొనసాగింది. తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులు నిండిపోయారు. సొంత నేలపైనే తెలంగాణ యువకులు, విద్యాధికులు నిరుద్యోగులుగా తిరిగారు. కడపుమండి.. ఆందోళనలకు దిగారు. అవి ఇంతింతై.. అన్నట్లు పెరిగాయి. అన్యాయాలపై బలమైన పోరాటాలు నిర్మితమయ్యాయి. లెక్కకు మిక్కిలి ఆందోళనలు జరిగాయి.

ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన తొలి దశ పోరాటంలో దాదాపు 360 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు. ఆ తర్వాత మళ్లీ 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావం అనంతరం పుంజుకున్న తెలంగాణ ఉద్యమం.. అన్యాయాలపై ప్రజలను చైతన్యం చేసే రీతిలో ఆందోళనలు నిర్వహించింది. పోరాటాల్లో ప్రజలను భాగస్వాములను చేసింది. 2009లో కేసీఆర్ నిరాహార దీక్ష నేపథ్యంలో డిసెంబర్ 9 ప్రకటన వెలువడినా.. సీమాంధ్ర నేతలు అడ్డం పడటంతో నోటిదాకా వచ్చిన కూడు.. దూరమైంది. తెలంగాణ కలతపడింది. వెయ్యికిపైగా యువత ఆత్మబలిదానాలు చేసింది. ఈ ఉద్యమ పునాదులపైనే జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నది.
-ఆంధ్రప్రదేశ్ మంత్రులకు నెహ్రూ హితవు
-ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కేంద్రం తీసుకుంటుంది
‘భారతదేశంలోని రాష్ట్రాల స్వరూపమే మారిపోయినవి. కాని, ఈ మార్పులన్నీ ఒక ఎత్తూ హైదరాబాదులో జరిగిన మార్పులు మరొక ఎత్తూను. ఒక శతాబ్దంగాపైగా హైదరాబాద్ ప్రత్యేక సంస్థానంగా విరాజిల్లుతూ వచ్చింది. nehru
అతి దీర్ఘమైన ఈ కాలంలో కొన్ని ప్రత్యేక ఆచార సంప్రదాయాలు ఇక్కడ ఏర్పడినవి. వీటిని పోషిస్తూ వచ్చిన వ్యవస్థ నేటితో అంతరిస్తున్నది. హైదరాబాదు నగరం ఇక విస్తృత ఆంధ్రరాష్ట్రానికి రాజధాని అవుతుంది. మహత్తరమైన ఈ తరుణం, ఆంధ్రప్రదేశ్ మంత్రులకూ, శాసనసభ్యులకూ పరీక్షా సమయం. సంకుచిత తత్వాలను వదలి వర్గ కక్ష విభేదాలను మాని, అందరి భయ సందేహాలనూ తొలగించి ప్రజలందరి విశ్వాసాన్ని పెంపొందించినప్పుడే వారు విజయం పొందినవారవుతారు. ఆంధ్ర మంత్రులకూ శాసనసభ్యులకూ ఇదే నా హితవు’ అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ శాసనసభ్యుల సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ అన్నారు.

ప్రధానమంత్రికి స్వాగతం చెబుతూ డాక్టరు బూర్గుల రామకృష్ణారావు ఇట్లా అన్నారు. ‘దేశమంతటా నేడు కొత్త రాష్ట్రాలు ఏర్పడినవి. కొత్తగా కొన్ని భూభాగాలు కలిసో, లేక కొన్ని భూభాగాలు విడిపోవడం వల్లను ఇవన్నీ ఏర్పడితే, ఒక రాష్ట్రంగా తన ఉనికిని కోల్పోవడం హైదరాబాదు ప్రత్యేక. ఇటువంటి సమయంలో ప్రధాన మంత్రి వచ్చి మనకందరికీ వారి సందేశాన్ని వినిపించే అవకాశం కలిపించినందుకు కృతజ్ఞులం. ప్రధానమంత్రి వస్తారో రారో అనుకున్నాం. వాతావరణం కూడా విషమించింది. అయినా మనలనూ, నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నీ ఆశీర్వదించేందుకు ఆయన నేటి ఉదయం వచ్చారు.

మహత్తరమైన సందర్భం
ప్రధాని నెహ్రూ ప్రసంగం ఇట్లా ఉన్నది : నేను నేడిక్కడికి వచ్చిన సందర్భం మహత్తరమైనది. ఈ రోజులలోనే ప్రపంచంలో వేరొక చోట కొన్ని ఘటనలు జరిగి పరిస్థితిని చిక్కుపరుస్తున్నదవి. ఇవి హఠాత్తుగా, పిడుగులాగా మనపై పడినవి. వీటి ప్రభావం భారతదేశం మీదనూ, ప్రపంచమంతటిమీదా పడక మానదు’.

అక్టోబరు సూర్యుడు అస్తమించాడు
‘అక్టోబరు సూర్యుడు నిన్నటితో అస్తమించాడు. ఇవాళ్ల నవంబరు మొదటి తేదీ. నవంబరు సూర్యుడు నూతన భారతి చిత్రపటంపై ఉదయించాడు. ఈ మార్పులు చడి చప్పుడూ లేకుండా ఎంత నిశ్శబ్దంగా వస్తున్నవో! గత సంవత్సరం ఈ సమస్య కారణంగానే దేశమంతటా వాదోపవాదాలూ కొన్ని చోట్ల అల్లర్లూ కూడా జరిగినయి. ఈ నాడు కొత్త పరిస్థితులు కొత్త రూపాలు ఏర్పడినయి. పాత రాష్ట్రాలు ఎన్నో పోయి, కొత్తవి ఏర్పడినయి. బహుశా వీటన్నింటికంటే ముఖ్యమైన, మహత్తరమైన పరిణామం ఆంధ్రలో ఇక్కడ హైదరాబాదులో జరుగుతున్నది. మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న మార్పులు కూడా ముఖ్యమైనవే కాని, హైదరాబాదులో మార్పులు నిరుపమానమైనవి.ఇక హైదరాబాదు విస్తృత రాష్ట్రానికి రాజధాని అయినది. స్వాతంత్య్రం సంపాదించుకున్న తర్వాత సంస్థానాల సమస్య మొట్టమొదటి సారిగా మనలను ఎదుర్కొన్నది. జమీందారీ, భూస్వామ్య సమస్యలను కూడా పరిష్కరింప సంకల్పించాం. ఇక సామ్యవాద సరళి సమాజాన్ని నెలకొల్పడం మనం ధ్యేయంగా నిర్ణయించుకున్నాం.

పటాలోపం లేకుండా మార్పులు
సంస్థానాలకంటే చిక్కు సమస్యను ఇంత ప్రశాంతంగా ఇంత వరకూ మరెవరైనా పరిష్కరించారేమో నాకు తెలియదు. జమీందారీల సమస్యను కూడా ఇదే విధంగా పరిష్కరించ సంకల్పించినాము. ఇందువల్ల కొందరికి ఇబ్బందులు కలుగుతున్న మాట నిజమే. అన్యాయార్జితాలననుభవిస్తున్నవారికే ఈ ఇబ్బందులు. అటువంటివారికి కలిగే ఇబ్బందులను మనం లెక్కచేయనవసరం లేదు. సామ్యవాద వ్యవస్థ నెలకొల్పడానికి పారిశ్రామికాభ్యున్నతికీ కూడా మనం కొన్ని ఏర్పాట్లు చేశాం. మహత్తరమైన ఈ మార్పులూ, సంస్కరణలన్నీ హడావిడీ, పటాటోపమూ లేకుండా సాధించాలి. ఇక రాష్ట్రాల సమస్య కొన్ని తాలూకాలూ లేక గ్రామాలు ఈ రాష్ట్రంలో ఉండాలని కొందరు అభిప్రాయపడవచ్చు. ఏ భూభాగం ఏ రాష్ట్రంలో ఉన్నా నా మటుకు పేచీ ఏమీ లేదు. ఇవన్నీ పరిపాలనా నిర్వహణకు సంబంధించినవి. ప్రజలలో కూడా పొటమారిస్తున్న రాష్ట్రీయ సంకుచిత తత్వం మనందరినీ కలవరపెడుతోంది. స్వరాష్ట్రాభిమానం అభిలషణీయమే. కాని మితిమీరితే చేటు కలుగుతుంది. ఈ దురభిమానాన్ని అంతమొందించేందుకు గట్టి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కొందరికి కష్టం
బ్రిటిషు పాలకులు ఈ సరిహద్దులను ఏర్పాటు చేశారు. కొంతకాలంగా అవి అమలులో ఉన్నాయి. ఇప్పుడు వాటిని మార్చితే కొందరికి బాధ కలగవచ్చు. అయితే దేశాభ్యున్నతికి అవసరమైన మార్పులనే మనం ప్రవేశపెడుతున్నాం. దైనందిన జీవితానికి అవరోధం కలిగించకుండా మార్పులను తీసుకురావడమే మన విధానం. గత శతాబ్దంగా హైదరాబాద్ ఒక పెద్ద సంస్థానంగా ఉంటూ వచ్చింది. ఆ కాలంలో ఇక్కడ కొన్ని సంప్రదాయాలూ, ఆచార వ్యవహారాలలో ఒక రకమైన సంస్కృతి ఏర్పడినాయి. ఈ సంస్కృతిలో బూజుపట్టి ఈ కాలానికి పనికిరాని అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. వీటికి ఆలవాలమైన వ్యవస్థలను మనం రూపుమాపుతున్న మాట నిజమే.

ఎందుకంటే దేశంలో కొంత భాగం పాత పద్ధతిలోనూ దాని పక్క భాగం నూతన పద్ధతులలోనూ ఉండజాలదు. హైదరాబాదు సంస్థానంలో ముఖ్యంగా తెలంగాణకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ ముస్లిమ్ జనాభాకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలూ, అవకాశాలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా జమీందారీ, జాగీర్దారీ వ్యవస్థలకు సంబంధించినవి. ఇవి పోక తప్పదు. వారి భయాందోళనలను తొలగించక తప్పదు. ఈ సందర్భంలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కేంద్రం ఆధీనంలోకి తీసుకుని పెద్ద విద్యా కేంద్రంగా రూపొందించాలని కొంత కాలం కిందట ఆలోచించాం. ఇందులో తప్పు ఏమీలేదు. ఈ ప్రతిపాదన సరి అయినదే. ఉచితమైనదీ కూడా. ఇక దీనిని అమలు పరచవలసి ఉన్నది’

వివాహం వంటిది
‘తెలంగాణా ఆంధ్ర ప్రాంతాలు కలిసిపోయినాయి. ఇదోరకం వివాహం వంటి ఏర్పాటు. వివాహం ఎంత సంతోషవూపదమైనదో అంత ప్రమాదకరమైనది కూడా. (నవ్వు)’ నూతన సంబంధాలకు మూలమైన మసస్తత్వ సమస్యలన్నింటినీ గమనించి వ్యవహరించకపోతే వివాహం దుఃఖ హేతువు అవుతుంది. కొత్త ఆంధ్ర మంత్రులూ, శాసనసభ్యులూ ఇక్కడ ఉన్నారు. వారందరికీ ఇది పరీక్షా సమయం. ఉదారంగా వ్యవహరిస్తారో లేక సంకుచితంగా వ్యవహరిస్తారో ఇక చూడవలసి ఉన్నది. అందరినీ కూడకట్టుకునిపోతారో లేక దురహంకారంతో వ్యవహరిస్తారో చూడవలసి ఉన్నది. అందరి భయాలనూ తొలగించి అందరికీ న్యాయం చేకూర్చి రక్షణ సమకూరడానికి అనుగుణంగా పరిపాలించి ప్రజల విశ్వాసాన్ని పెంపొందించుతారో లేదో చూడవలసి ఉన్నది. శత్రువుతోనూ మైత్రిని కాంక్షించేవాడే ఘనమైన వ్యక్తి. హైదరాబాదులో ఇక ముందు ఏమి జరుగుతుందోనని కేవలం హైదరాబాదు వాసులే కాదు ఇతర ప్రాంతాల వారెందరో శ్రద్ధగా గమనిస్తూంటారు. మనం విశాల హృదయంతో వ్యవహరిస్తేనే దేశం అభ్యున్నతి చెందడమే కాక ప్రపంచంలో మన కీర్తిప్రతిష్ఠలూ, గౌరవమూ పెంపొందుతాయి. ఆంధ్ర శాసనసభ్యులూ మంత్రులూ ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తున్నాను.

అటు తర్వాత ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రసంగిస్తూ ఇట్లా అన్నారు :
‘ప్రధాన మంత్రి ఇచ్చిన సలహాలను తప్పకుండా పాటించి వారు చూపిన మార్గాన నడుస్తామని హామీ ఇస్తున్నాను. అట్లా చెయ్యలేకపోతే మా ఉద్యోగాలకు రాజీనామాలు ఇచ్చి వైదొలుగుతాము.

ఆరోగ్యం ఆంధ్రకు..జబ్బులు తెలంగాణకు పంచిపెట్టిన సమైక్యాంధ్ర


8/31/2013 6:39:10 AM
సమైక్య రోగం!
-ఆరోగ్యం ఆంధ్రకు..జబ్బులు తెలంగాణకు పంచిపెట్టిన సమైక్యాంధ్ర
-నిజాం కాలం..ప్రతి జబ్బుకూ ప్రత్యేక ఆస్పత్రి
-బొక్కల దవాఖాన, ఉస్మానియా, నీలోఫర్,చెస్ట్ హాస్పిటల్.. ఎర్రగడ్డ మానసిక వైద్యశాల
-ఆనాడే ప్రజలకు స్పెషాలిటీ వైద్యంవిలీనం తర్వాత వెలుగులు మాయం ప్రభుత్వ ఆస్పత్రుల సమాధులపై
కార్పొరేట్ ఆస్పత్రుల పునాదులు వైద్య విద్యలోనూ సీమాంధ్రకే చాన్సులు ఆస్పత్రుల అధిపతులూ అక్కడివారే
ఆధిపత్యం పోతుందనే విభజనకు వ్యతిరేకతనాలుగు జిల్లాల సీమలో నాలుగు కాలేజీలు10 జిల్లాల తెలంగాణలోనూ నాలుగే కాలేజీలురాజధాని నుంచి తరలిపోయిన హెల్త్ వర్సిటీ

ap-copy
హైదరాబాద్, ఆగస్టు 30 (టీ మీడియా):ఆరు దశాబ్దాల సమైక్య రాష్ట్రంలో.. ఆంధ్రకు ఆరోగ్యం అందితే.. తెలంగాణకు రోగాలు మిగిలాయి! కష్టసుఖాలు కలిసి పంచుకుందామని తెలంగాణను కలిపేసుకున్న సీమాంధ్ర నాయకత్వం.. ఈ ప్రాంతంలో అప్పటికే బలంగా స్ధిరపడి ఉన్న వైద్యరంగాన్ని నాశనం చేసింది. కీలక ఆస్పత్రుల ఆలనాపాలనా పట్టించుకోకుండా.. వాటిని ఉద్దేశపూర్వకంగా శిథిలావస్థకు చేర్చారు. ఒకప్పుడు సాధారణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించిన నగరంలో కార్పొరేట్ ఆస్పవూతులను పుట్టకొక్కుల్లా పెరగనిచ్చారు! వాటిలో సాధారణ, మధ్యతరగతి ప్రజలు వైద్యం చేయించుకోవడం అంటే ప్రాణం పోయేంత పరిస్థితి కల్పించారు! నగరంలోని కీలక ఆస్పత్రులన్నింటిలో సీమాంధ్రులను నింపేశారు! పారిశుధ్యం వంటి అడ్డమైన చాకిరి చేసే నాల్గో తరగతి ఉద్యోగులు తప్ప.. అంతా తెలంగాణేతరులే! నిమ్స్‌లాంటి చోట్ల ఆ మాత్రం కూడా తెలంగాణవారికి అవకాశం ఇవ్వలేదు. వైద్యారోగ్యశాఖలోనూ ఇదే తంతు.

వైద్య విద్య విషయంలోనూ అదే ధోరణి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వైద్య కళాశాలల్లో అత్యధికం సీమాంధ్ర జిల్లాలోనే ఏర్పాటయ్యాయి. తెలంగాణ ప్రాంతంలో కొత్త కాలేజీలు లేకపోవడంతో ఇక్కడి విద్యావంతులకు స్టెత్ పట్టుకునే భాగ్యం దక్కలేదు. సీమాంధ్రలోనే ఎక్కువ మెడికల్ కాలేజీలు ఉండటంతో వారికే త్వరగా పోస్టింగ్‌లు రావటం.. వాటి ఆధారంగా సీనియారిటీ పెరగడంతో కీలక పదవుల్లో ప్రస్తుతం వారే తిష్ఠవేసి ఉన్నారు. ఆంధ్రతో విలీనానికి ముందు తెలంగాణలో గాంధీ, ఉస్మానియా మెడికల్ కాలేజీలు నిజాం కాలం నుంచే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రైవేటు కాలేజీగా ఉన్న కాకతీయ మెడికల్ కాలేజీని ప్రభుత్వం తన పరిధిలోకి తెచ్చుకుంది. తప్పించి.. కొత్తగా ఒక్క కాలేజీని కూడా ఏర్పాటు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ అవతరణ నాటికి సీమాంధ్రలోని గుంటూరు, విశాఖపట్నంలో రెండు కాలేజీలు ఉండేవి. ఇప్పుడు అవి ఆరుకు పెరిగాయి. ఇవి చాలవన్నట్లు నెల్లూరులో మరో కాలేజీని ఏర్పాటు చేసేందుకు ఆగమేఘాల మీద పనులు జరుగుతున్నాయి. ఇక ఒక్క కాలేజీ కూడా లేని నాలుగు జిల్లాల రాయలసీమలో నాలుగు కాలేజీలు ఏర్పాటు చేశారు. వైద్యవిద్యలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందనే విమర్శలు పెరగడం, తెలంగాణ ప్రాంత నాయకుల ఒత్తిళ్ల నేపథ్యంలో తాజాగా నిజామాబాద్ మెడికల్ కాలేజీని ప్రారంభించారు. ఆ కాలేజీని నాలుగేళ్ల పాటు నాన్చినాన్చి 2013-14సంవత్సరానికి 100మెడికల్ సీట్లు తెచ్చారు.

ఇక రిమ్స్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన నాలుగు కాలేజీలకు గాను రెండు ఆంధ్రలో, ఒకటి రాయలసీమలో నెలకొల్పారు. తెలంగాణలోని ఆదిలాబాద్‌లో ఒక పాత భవనంలో రిమ్స్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారు. ఇప్పటికీ ఇక్కడ కాలేజీకి స్టాఫ్‌లేరు. పక్కా భవనం లేదు. కానీ.. కడప రిమ్స్‌కు ఒకేసారి రూ.100కోట్లు మంజూరు చేసి భవనాలు పూర్తి చేశారు. ఇక్కడ పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్లకు కూడా లక్ష రూపాయల వరకు వేతనం చెల్లిస్తున్నారు. అదే అదిలాబాద్ రిమ్స్ కాలేజీలో గతేడాది వరకు మహారాష్ట్ర నుండి లెక్చరర్లను అద్దెకు తెప్పిస్తూ పాఠాలు చెప్పిస్తున్నారు. ఇదీ సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు దక్కిన మెడికల్ వైద్య.

హెల్త్ యూనివర్సిటీ.. తెలంగాణకు నో ఎంట్రీ
ఆరోగ్యరంగంలో సీమాంధ్ర వెలుగులు 1986 ఏప్రిల్ 9న ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌తో విరజిమ్మడం మొదలైంది. తెలుగుజాతి ఆత్మగౌరవం నినాదంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీరామారావు.. దీనిని ఉస్మానియా పరిధినుంచి తప్పించి.. విజయవాడకు తరలించారు.

యూనివర్సిటీలను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి మార్చిన చరిత్ర ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లోనే లేదు. కేవలం తెలంగాణ ప్రాంత గుర్తుగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఉందన్న కారణంతో దీన్ని విజయవాడకు తరలించారనే విమర్శలున్నాయి. దీనికితోడు ఇంత పెద్ద యూనివర్సిటీ పరిధిలో ఒక్క తెలంగాణ వ్యక్తి కూడా ఉద్యోగిగా లేడంటే అతిశయోక్తి కాదు. మొన్నటిదాకా ఒక ఉద్యోగి ఉన్నా.. తెలంగాణ ఉద్యమం తరువాత అతను కూడా ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యకు సంబంధించిన ఈ యూనివర్సిటీలో పూర్తిగా సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులే ఉన్నారు. కొంత కాలం క్రితం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ బ్రాంచ్‌ను హైదరాబాద్‌లో పెట్టినా దానికీ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తినే ఇన్‌చార్జిగా పెట్టుకున్నారు. యూనివర్సిటీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది వైఎస్ చాన్సలర్లుగా పని చేస్తే అందులో ఏడుగురు సీమాంధ్రులే. ప్రస్తుత వీసీ ఐవీ రావు తన పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో మరికొంత కాలం పని చేసేందుకు ఆయనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

నాన్‌లోకల్ బన్‌గయా లోకల్
మెడిసిన్ సీట్లలో లోకల్ కోటా 85 శాతం, అన్ రిజర్వుడు కోటా 15శాతంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఏ విద్యార్థి అయినా ఎన్టీఆర్ హెల్త్‌యూనివర్సిటీ పరిధిలోనే చదువుకుంటాడు. కానీ సీట్లు నింపే విషయంలో మాత్రం రీజియన్ల వారీగా సీట్లను నింపుతోంది. దీని వెనుక సీమాంధ్రకు ఎక్కువ సీట్లు ఇప్పించుకునే భరీ కుట్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవో 4 ప్రకారం లోకల్ విద్యార్థులకు సీట్లు కేటాయింపులు చేసిన తరువాత 15శాతం అన్‌రిజర్వుడు సీట్లను మెరిట్ ప్రకారం కేటాయించాల్సి ఉంటుంది. ఇందులో రెండు ప్రాంతాలకు చెందినవారు ఉండొచ్చు. కానీ అన్‌రిజర్వుడు అనే పదాన్ని తొలగించి 15శాతం రిజర్వుడుగా మార్చుకుని తెలంగాణ సీట్లలో 15శాతం సీమాంధ్రులు చేరిపోయారు.

దీనికి తోడు లోకల్ కోటాలో 1986 నుండి 1997వరకు సీమాంధ్రలో చదువుకున్న విద్యార్థులు కూడా నాలుగేళ్లు తెలంగాణలోనే చదవినట్లు తప్పుడు సర్టిఫికెట్లు తీసుకుని తెలంగాణలో సీట్లు పొందుతున్నారు. ఇలా తెలంగాణలో వేల సంఖ్యలో మెడికల్ సీట్లు సీమాంధ్రులు కొట్టేశారని అధికారులు చెబుతున్నారు. దాదాపు 11ఏళ్ల పాటు ఈ తతంగం సాగింది. తెలంగాణలో ప్రతి 75వేల మందికి ఒక్కసీటు ఉంటే, రాయలసీమలో 23వేల మందికి ఒక్కసీటు చొప్పున.. ఆంధ్రలో 33వేల మందికి ఒక్కసీటు చొప్పున ఉన్నాయి.

రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ ఒకే విధానంగా సీట్లు నింపితే తమ ప్రాంతానికి సీట్లు తక్కువ అవుతాయన్న ఆలోచనతోనే సీట్లను రాష్ట్రస్థాయిలో చూడకుండా, రీజియన్ల వారీగా చూడటం మొదలు పెట్టారన్న అభిప్రాయాలు ఉన్నాయి. దీని వల్ల సీట్లు ఎక్కువ ఉండటం వల్ల ఆంధ్ర, రాయలసీమలో ర్యాంకు ఎక్కువ వచ్చినా వారికి సీట్లు దక్కుతున్నాయి. ఉదాహరణకు ఆంధ్రలో ఎస్టీ బాలుర విభాగంలో 8691ర్యాంకు వస్తేనే సీటు దక్కుతుంది. అదే రాయలసీమలో 6456ర్యాంకు వస్తే సీటు దక్కుతుంది. కానీ తెలంగాణలో 3701ర్యాంకు వస్తేనే సీటు. ర్యాంకు మరోవంద, రెండు వందలు పెరిగినా తెలంగాణ వ్యక్తికి సీటు గల్లంతే.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీల ప్రాంతాల వివరాలు
1. ఐవీ రావు (1986-1988) సీమాంధ్ర
2. ఎల్ సూర్యనారాయణ (1988-1994) సీమాంధ్ర
3. సీఎస్ భాస్కరన్ (1994-1997)
4. జీ శ్యాంసుందర్ (1997-2004) తెలంగాణ
5. ఆర్ సాంబశివరావు (2004-2007) సీమాంధ్ర
6. పీవీ రమేష్ (2007-2007) సీమాంధ్ర
7. ఏవీ కృష్ణంరాజు (2007-2010) సీమాంధ్ర
8. ఐవీ రావు (2010 నుంచి పదవిలో) సీమాంధ్ర

2011లో రీజియన్ల వారీగా ర్యాంకులు, సీట్ల వివరాలు
రీజియన్ ఓసీ (బాలికలు) ఎస్టీ (బాలికలు) ఓసీ(బాలురు) ఎస్టీ(బాలురు)
ఆంధ్ర 1221 8775 981 691
రాయలసీమ 1595 8528 1273 6458
తెలంగాణ 985 3763 685 3701


కాలేజీలు సీట్ల సంఖ్య
ఉస్మానియా 250
గాంధీ 200
కాకతీయ 200
నిజామాబాద్ 100
ఆదిలాబాద్ రిమ్స్ 100
మొత్తం 850
కర్నూలు 200
అనంతపురం 100
తిరుపతి 200
కడప రిమ్స్ 150
మొత్తం 650
ఆంధ్రా మెడికల్ 200
కాకినాడ 200
విజయవాడ 100
ఒంగోలు రిమ్స్ 100
శ్రీకాకుళం రిమ్స్ 100
మొత్తం 700

లూటీ కోసమే యూటీ పాట


8/29/2013 12:04:15 AM
జూలై 30 వరకు తెలంగాణ ఎట్లాగు రాదు.. ఇక బెంగ ఎందుకు? తెలంగాణ సపోర్టు చేస్తే పోయేదేముంది. మన నోటి మాట తప్ప.. లేకుంటే ఓ కాగితం ముక్క... మొన్నటి వరకు మాట మీద నిలబడని, వెన్నుముక లేని సీమాంధ్ర పార్టీలు, వాటి నాయకుల ఆలోచన ఇది. ఇప్పుడు మరోసారి తెలంగాణ ప్రకటన రాగానే ఒక్కసారిగా దిమ్మతిరిగి, మైండ్ బ్లాక్ అయింది. దాని నుంచి నెమ్మదిగా తేరుకొని ఇక తమ కుట్రలకు తెర లేపారు. రాజీనామా లు, రాజకీయ ఎత్తుగడలతో రాణించవని తెలుసుకున్నారు. ‘బ్రహ్మస్త్రం’ గా భావించే సీమాంధ్ర మీడియాను, సీమాంధ్ర ఉద్యోగులను ప్రత్యక్షంగా రంగంలోకి దింపారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, తెలంగాణలోని సీమాంవూధుల భద్రతే తమకు ముఖ్యమనీ,నీటి పంపకాలు, హైదరాబాద్‌పై హక్కుల మాత్రమే తమ లక్ష్యమని ఒకవైపు చెబుతూ వచ్చారు.

ఆయా సమస్యల పరిష్కారానికి కేంద్రం సిద్ధం కాగానే ‘ఆంటోని కమిటీ వద్దు- సమైక్యాంధ్ర ముద్దు’ అంటూ తమ మనసులో ఉన్న విషం కక్కుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించడమే తమ లక్ష్యానికి అసలు రూపమని బట్టబయలు చేశారు. ‘మాది మాకే కావాలి, మీది మాకే కావాలి’ అన్నది సీమాంధ్ర పెట్టుబడివర్గాల అసలు సిద్ధాంతం. సమైక్యాంవూధ తప్ప, వేరే ఏవైనా, అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తామని ఆంటోని కమిటీ అంటే పెత్తనమే లక్ష్యమని చెప్పలేక.. ఉంటే సమైక్యాంధ్ర లేదంటే హైదరాబాద్‌ను యూనియన్ టెరిటరీ అని అంటున్నారు. యూనియన్ టెరిటరీ చేయడం వల్ల మీకు లాభం లేదు, తెలంగాణకు నష్టం కదా అని ఆంటోనీ కమిటీ అంటే మగధీర సినిమాలో విలన్ చెప్పినట్టు ‘నాకుదక్కనిది, ఇంకెవరికీ దక్కనివ్వను’ అన్నట్టు ఈరోజు చిరంజీవి మాట్లాడడం శోచనీయం. యూటీ ముసుగులో లూటీ చేయవచ్చుని వారి ఆలోచన. దీంతో తెలంగాణ ప్రజలకు కొంత కనువిప్పు కలిగింది.
సెక్ర అత్యధికులు సీమాంధ్ర ఉద్యోగులే ఉన్నారంటూ ఇన్నేళ్ల నుంచి మన ఉద్యోగులు చేస్తున్న ఆరోపణలను నిజం చేస్తున్నారు.

వందేళ్లయిన చావు తప్పదు, వెయ్యి ఏళ్లున్నా వేరు తప్పదు, ఇక్కడ ఎన్నేళ్లున్నా సీమాంవూధులు తెలంగాణవారు కాలేరని నిరూపించుకున్నారు. రెండు వారాలుగా జరుగుతు న్న హింసాయుత ఘటనలు, వీహెచ్ లాంటి సీనియర్ నాయకులపై దాడి, సిద్దిపేట నుంచి శ్రీశైలం వెళ్లే బస్సులను అడ్డుకోవడం ఇందుకు నిదర్శనం. ప్రపంచంలోనే అత్యంత హేయమైన సంఘటన ఇటీవల జరిగింది. వైద్య వృత్తికే కళంకం తెచ్చే విధంగా పురిటి నొప్పులతో ప్రసవ వేదనతో వెళ్లిన నిండు గర్భిణి కర్నూల్ హస్పిటల్‌కు వెళ్తే కర్కశంగా గెంటివేయబడింది. గద్వాల్‌కు చెందిన ఆమె తెలంగాణ మహిళ కావడమే ఇందుకు కారణం. ఈ గోవిందమ్మ ఉదం తం తర్వాత ‘రక్షణ’ ఎవరికి అవసరం అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. తెలంగాణలో ఉండి, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సీమాంధ్ర ఉద్యోగు లు, కొందరు ప్రజలు ‘ఆవేశంతో, దురాలోచనలతో’ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు’. సద్భావనతో సోదరులుగా ఉందామని తెలంగాణ ప్రజలు అంటుంటే, సెటిలర్స్ మేము, స్థానికులం కామని మీకు మీరే ముద్ర వేసుకుంటుంటే ఏమి చెప్పగలం?

ఆంటోని కమిటీ పలు విషయాలు ప్రస్తావిస్తూ కిరణ్‌కుమార్‌డ్డి ప్రధానంగా హైదరాబాద్‌ను కేంద్ర పరిపాలన (యూటీ)లో ఉంచాలని ప్రతిపాదించారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత దురాలోచనతో కొంతమంది సీమాంధ్ర నాయకులు ఈ కుట్రకు బీజం వేశారు.1896లో మొదట హైదరాబాద్ మున్సిపాలిటీ, 1950లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఏర్పడ్డది. 2007లో ఎంసీహెచ్‌ను విస్తరింపజేస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేశారు. 2008లో జీవో 570 ప్రకారం 25-8-2008 న నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్, రంగాడ్డిలోని 36 మండలాలను కలుపుతూ 7100 స్కేర్ కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉండి, తెలంగాణలో దాదాపు 7శాతం కలిగి ఉన్న ది. తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో దాదాపు 50 శాతం వచ్చే ప్రాం తాన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డవలప్‌మెంట్ ఏరియా కింద మార్చారు. బెంగళూరు తర్వాత దేశంలో అత్యంత విస్తీర్ణం గల సిటీ హైదరాబాదే. ఒకవిధంగా ఇది ఆనాడే పన్నిన పన్నా గం. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యం అయితే హైదరాబాద్‌ను హెచ్‌ఎండీఏ రూపంలో విశాల హైదరాబాద్‌ను చేసి దాన్ని కబళించాలనే దురాలోచన దీని వెనక ఉన్న సత్యం.

ఏ నగరాన్నయినా కేంద్ర పాలిత ప్రాంతంగా ఎప్పుడు చేస్తారో ఆలోచించాలి. దేశంలో పాండిచ్చేరి, చండీగఢ్, లక్షదీప్, డయ్యూ డామన్ , దాద్రనగర్ హవేలీ ఒకప్పటి పోర్చుగీసు కాలనీలు. లక్షద్వీప్ ,అండమాన్ నికోబార్ ఫ్రెంచ్, పోర్చుగీసు కాలనీలు కావడం వల్ల వాటి ఒప్పందాల ప్రకారం లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ద్వీపాలను దేశ రక్షణ కోసం యూటీలుగా కొనసాగించారు. ఢిల్లీ దేశ రాజధాని కావటం వల్ల మొదట యూటీ చేసినా ఇప్పుడు రాష్ట్రంగా మార్చారు. చండీగఢ్ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్లాన్ ప్రకారం నిర్మించిన మొదటి నగరం. హర్యానా, పంజాబ్ రెండు రాష్ట్రాలు ఏర్పాటు అయినప్పుడు చండీగఢ్ భౌగోళికంగా రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండడం వల్ల యూటీగా మార్చి, రెండు రాష్ట్ర రాజధానులుగా మార్చారు. అంటే యూటీ చేయడానికి దేశ భద్రతా, భౌగోళిక, సంస్కృతి పరంగా వేరే రాష్ట్రంలో కలువలేని పరిస్థితి, అంతర్జాతీయ ఒప్పందాల కారణమై ఉండాలి. కానీ సీమాంధ్ర నాయకులు గొంతెమ్మ కోర్కెలకు అనుగుణంగా మార్చడం కాదని గుర్తుంచుకోవాలి. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణతో ఆంధ్ర రాష్ట్రం కలిసి ఆంధ్రవూపదేశ్ ఏర్పడిందని మరిచిపోవద్దు.

ఒకవేళ దేశ భవూదత కారణం అయితే మొదటగా యూటీని చేయవలసిన ప్రదేశాల్లో వైజాగ్ ముందుంటుంది. ఎందుకంటే అక్కడ దేశ అతిపెద్ద ఈస్టర్న్ నావల్ కమాండ్, సబ్‌మెరైన్ పోర్ట్, ఐఎన్‌ఏ విక్రాంత్ యుద్ధ నౌక లాండింగ్ సౌకర్యాలు వైజాగ్ పోర్ట్ సిటీలోనే ఉన్నాయి. అలాగే డిఫెన్సు ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిర్‌పోర్టు, ఎమ్జన్సీలో అవసరమయ్యే చమురు డిపోలు వైజాగ్ లోనే ఉండడం విశేషం. ఈ మధ్య 15 వేలకోట్లతో ఐదు వేల ఎకరాల్లో భారత దేశంలోమొట్టమొదటి సబ్‌మెరైన్ స్టేషన్ నిర్మిస్తున్నారు. అలాగే దేశంలో రెండో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ (వీఎస్‌పీ) ఇండియన్ కోస్ట్ గార్డ్, షిపింగ్ యార్డ్ తదితర అనేక రహస్య సైనిక స్థావరాలు వైజాగ్ చుట్టూ ఉన్నాయి. దాదాపు 40 శాతం ఎయిర్‌పోర్టు యాక్టివిటీ వైజాగ్ ప్రాంతంలో జరుగుతుంది. అందువల్ల ప్రస్తు తం ఉన్న ఆంధ్రవూపదేశ్‌లో దేశ, రాష్ట్ర భద్రత దృ ష్ట్యా యూటీ చేయవలసిన అవసరం వస్తే వైజాగ్ మొదటి స్థానంలో నిలుస్తుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే దేవాలయమే కాకుం డా, అత్యంత సంపన్నమైన హిందూదేవాల యం. ఈ దేవాలయాన్ని ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రజలే కాకుండా దేశ, విదేశాల్లో ఉండే హిందువులు కూడా దర్శించుకుని కానుకలు సమర్పించుకుంటారు. అందువల్ల ప్రతి సంవత్సరం ఆదాయం 2000-3000 కోట్లు ఉంటుంది. ఈ సంపద అందరికీ చెందుతుం ది. ముఖ్యంగా దీన్ని ధార్మిక అభివృద్ధికి, హిం దూ మత అభివృద్ధి, హిందూ మత ప్రక్షాళనకు ఉపయోగించాలి. అలాంటప్పుడు ఒక ధార్మిక ప్రత్యేకత కలిగి ఉన్న కోట్లాది హిందువుల మనోభావాలకు ముడిపడి ఉన్న తిరుమల, తిరుపతి ప్రాంతాలను ఒక యూటీగా మార్చడం అత్యవసరం.

ఒక మహానగరంలో వివిధ ప్రాంతాల ప్రజలు అవసరాల కోసం, అవకాశాల కోసం వచ్చి స్థిరపడుతుంటారు. చెన్నైలో 30-40 శాతం ప్రజలు వివిధ రాష్ట్రాల నుంచి స్థిరపడ్డారు. కలకత్తాలో బీహార్, ఒడిషాకు చెందిన ప్రజలు అత్యధికంగా ఉంటారు. ఇదే ప్రమాణంగా తీసుకుంటే దేశంలోని అన్ని మహానగరాలను యూటీలుగా మార్చాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజ లు దాదాపు ఆరు శాతం (శ్రీకృష్ణ కమిటీ ప్రకారం) ఉంటారు. అలాగే వివిధ తెలంగాణ జిల్లాల్లో లక్షలాది మంది సీమాంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలతో మమేకమై ఉన్నారు. అందువల్ల ‘మాకు దక్కనిది, మీకు దక్కనీయం’ అనే సం కుచిత స్వభావానికి స్వస్తి పలికి, విభజన వల్ల విద్వేష మార్గం కాకుండా, సోదర భావంతో విడిపోయి కలిసుందాం. వితండవాదాలు వీడి విభజనకు సహకరించాలి.
-డాక్టర్ బూర నర్సయ్యగౌడ్
టీఆర్‌ఎస్ రాష్ట్ర నేత, డాట్స్ చైర్మన్

సోకులు వాళ్లకు షాకులు మనకు


8/29/2013 6:40:18 AM
దశాబ్దాలుగా సీమాంధ్రులు విద్యుత్ రంగాన్ని కబ్జా చేశారు. కరెంటు దందాతో అనుబంధం ఉన్న సీమాంధ్ర పెట్టుబడిదారులు వ్యాపారపరంగా రాష్ట్ర ఎల్లలు దాటడమే కాకుండా.. విదేశాల్లో పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదిగిపోయారు. కోస్తాలోని కృష్ణా-గోదావరి బేసిన్‌లోని సహజవాయు నిక్షేపాలు,
సహజ వనరులను సొంతం చేసుకుని, రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి సొంత సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. ఇప్పుడు అదే
పెట్టుబడిదారులు.. తమ వ్యాపార ప్రయోజనాలకు భంగం కలుగకుండా చూసుకునేందుకే తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు.

currentవీటీపీఎస్‌లో 3,600 ఎకరాల భూముల్లో 1,760 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు పనిచేస్తున్నాయి. వీటికి అదనంగా బీహెచ్‌ఈఎల్ జాయింట్ వెంచర్‌తో మరో 182 మెగావాట్ల ఇంటిక్షిగేటెడ్ గ్యాసిఫికేషన్ కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్ (ఐజీసీసీపీపీ) నిర్మాణం చేపట్టాల్సి ఉంది. దీనికి అన్ని రకాల అనుమతులున్నాయి. ఇందుకోసం ఇంకా 230 ఎకరాల భూములు సేకరించాలని డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)లో పేర్కొన్నారు. అంటే దీని కోసం భూ సేకరణ జరపాల్సి ఉంది. ప్రస్తుతం వీటీపీఎస్ పరిసరాల్లో ఎకరం భూమి ధర కోటి రూపాయలకు పైగా ఉండడం విశేషం. అయినా వెనుకాడని ప్రభుత్వం.. అంత సొమ్ము వెచ్చించి భూములు సేకరించడం ద్వారా కొత్త పవర్ ప్రాజెక్టులను విజయవాడలోనే నిర్మించేందుకు ఆసక్తి చూపుతుండటం విశేషం.

తెలంగాణలో కొత్త పవర్ ప్రాజెక్టుల నిర్మాణాలకు వందల ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. రామగుండంలో 600 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. దాని పక్కనే రాయగండి వద్ద 1,512 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఇక్కడ ఎకరం ధర గరిష్ఠంగా రెండు లక్షలకు మించదని తెలంగాణ విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్నారు. వరంగల్ జిల్లా కేటీపీపీ ప్లాంటు పక్కన ఉన్న వ్యవసాయ భూములకు గిట్టుబాటు ధర కల్పిస్తే విద్యుత్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చేందుకు స్థానికులు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఎకరం రూ.4లక్షల నుంచి రూ.5లక్షలకు మించదు. కేటీపీఎస్ వద్ద స్థానికంగా మరో 8,600 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రభుత్వం, జెన్‌కో యాజమాన్యం భూసేకరణకు అవసరమైన నిధులు లేవని సాకులు చెబుతున్నాయి.


కరెంటు లోటు ఇక్కడ.. ఉత్పత్తి ప్లాంట్లు అక్కడ
విద్యుత్ రంగంలో నిండు నిర్లక్ష్యం


అందుబాటులో బొగ్గు.. పక్కనే ప్రవహించే గోదావరి.. విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు తగిన భూమి.. తెలంగాణకు ఇంకేం తక్కువ?.. కానీ సర్కారుకు చిత్తశుద్ధి లోపించింది. తెలంగాణకు కరెంటు కష్టమొచ్చింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం విద్యుత్ రంగంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైందనేది నిప్పులాంటి నిజం! విద్యుత్ అవసరాలు ఉన్న తెలంగాణలో ప్లాంటులు కట్టాల్సిన పాలకులు.. తెలంగాణకు చెందాల్సిన ప్రాజెక్టులను సైతం మళ్లించుకుని.. సీమాంధ్ర ప్రాంతాన్ని వెలుగులతో నింపుకొంటున్నారన్నది షాక్ కొట్టినంత సత్యం! భూములు సేకరించడానికి డబ్బుల్లేవని చెబుతున్న ప్రభుత్వం.. ఎకరం రెండు లక్షలకు దొరికే భూమి ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి.. అదే ఎకరం భూమి కోటికిపైగా పలుకుతున్న చోట ఖర్చుకు వెనుకాడకుండా సీమాంధ్రలోనే కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధపడుతుండటం.. పాలకుల కుటిల పన్నాగాలకు నిదర్శనం! తెలంగాణ విడిపోతే ఆ రాష్ట్రానికి తలెత్తే మొట్టమొదటి సమస్య విద్యుత్తేనంటూ సీమాంధ్ర పాలకులు బెదిరిస్తుండటమే అందుకు సాక్ష్యం!

హైదరాబాద్, ఆగస్టు 28 (టీ మీడియా): గాయం ఒక చోట ఉంటే.. మందు మరో చోట పూస్తే? విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరిగ్గా ఇలానే ఉంది. పవర్‌లోడ్ (విద్యుత్ వినియోగం) ఉన్న చోట్ల విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పాలని స్వయంగా విద్యుత్ చట్టమే చెబుతోంది. దీని వల్ల ప్రాజెక్టు పెట్టుబడి వ్యయం తగ్గడంతో పాటు విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలు తగ్గుముఖం పట్టడం, నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అవకాశం ఉంటుందనేది మానసిక వికాసం కలిగిన ప్రతిఒక్కరికీ తెలిసిన అంశం. అయితే విద్యుత్‌రంగానికి మూల వనరులైన బొగ్గు, నీళ్లు, ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమైన భూములు అందుబాటులో ఉన్నప్పటికీ తెలంగాణలో కట్టాల్సిన అనేక విద్యుత్ ప్రాజెక్టులను సీమాంధ్రకు తరలించి ఉద్దేశపూర్వంగా తెలంగాణను విద్యుత్‌రంగంలో వెనుకబడేశారన్నది నిర్వివాదాంశం. ఇందుకు నాడు విద్యుత్‌బోర్డు చైర్మన్‌గా పనిచేసిన నార్ల తాతారావు, పార్ధసారధి కారణమన్న అభిప్రాయాన్ని తెలంగాణవాదులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజనతో తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ లోటు గణనీయంగా ఉంటుందని, విద్యుత్‌పరంగా తెలంగాణ ప్రజలు ఇబ్బందులపాలు అవుతారని సీమాంధ్ర కీలక నేతలు బెదిరిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ నిపుణులు గుర్తు చేస్తున్నారు.

తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్న తరుణంలోనూ కొత్త విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనల్లో కూడా సీమాంవూధకే ప్రాతినిధ్యం ఇవ్వడం గమనార్హం. కొత్త పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూములు అందుబాటులో లేకున్నా కోటి రూపాయలకు ఎకరం చొప్పున భూసేకరణ జరిపి.. ప్రాజెక్టు వ్యయాన్ని పెంచి మరీ విజయవాడలోనే మరో కొత్త ప్రాజెక్టు (800 మెగావాట్ల) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడంపై తెలంగాణవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో 4,000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అన్ని రకాల అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు. గణనీయంగా విద్యుత్‌లోటు ఉన్న తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో వీటీపీఎస్‌లో ఏర్పాటుకు ప్రతిపాదించిన 800 మెగావాట్ల (స్టేజ్-5) పవర్‌ప్లాంట్‌ను, కృష్ణపట్నంలో రెండోదశ 800 మెగావాట్ల ప్లాంట్‌ను తెలంగాణకు మళ్లించాలని విద్యుత్‌రంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే ఏపీ జెన్‌కోకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఒడిశాలోని సర్పల్‌నౌపారా, మధ్యప్రదేశ్‌లోని సులియారి బెల్వారీ బొగ్గు గనులను తెలంగాణ కొత్త ప్రాజెక్టుల కోసం మళ్లించేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సూచిస్తున్నారు.


గనులిక్కడ.. ప్రాజెక్టులక్కడా?
విజయవాడలోని వీటీపీఎస్‌లో స్టేజ్-5 ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన భూములు అందుబాటులో లేవు. ప్రస్తుతం అక్కడ (వీటీపీఎస్) కేవలం 85 ఎకరాలు మాత్రమే ఉంది. ఇప్పటికే వీటీపీఎస్‌లో 3,600 ఎకరాల భూముల్లో 1,760 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు పనిచేస్తున్నాయి. వీటికి అదనంగా బీహెచ్‌ఈఎల్ జాయింట్ వెంచర్‌తో మరో 182 మెగావాట్ల ఇంటిక్షిగేటెడ్ గ్యాసిఫికేషన్ కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్ (ఐజీసీసీపీపీ) నిర్మాణం చేపట్టాల్సి ఉంది. దీనికి అన్ని రకాల అనుమతులున్నాయి. ఇందుకోసం ఇంకా 230 ఎకరాల భూములు సేకరించాలని డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)లో పేర్కొన్నారు. అంటే దీని కోసం భూ సేకరణ జరపాల్సి ఉంది. ప్రస్తుతం వీటీపీఎస్ పరిసరాల్లో ఎకరం భూమి వ్యయం కోటి రూపాయలకు పైగా ఉండడం విశేషం. అయినా వెనుకాడని ప్రభుత్వం.. అంత సొమ్ము వెచ్చించి భూములు సేకరించడం ద్వారా కొత్త పవర్ ప్రాజెక్టులను విజయవాడలోనే నిర్మించేందుకు ఆసక్తి చూపుతుండటం విశేషం. వీటీపీఎస్ పక్కనే మరో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేస్తున్నారు. కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలను తాము స్వయంగా పరిశీలిస్తామని కేంద్ర విద్యుత్ అథారిటీ (సీఈఏ) కమిటీ ఏపీ జెన్‌కోకు సమాచారాన్ని అందించింది. అయితే కమిటీ వస్తే వాస్తవాలు (భూమి కొరత) వెలుగులోకి వస్తాయనే భయంతో కొత్త పవర్ ప్లాంట్ల నిర్మాణానికి అంగీకారం తెలియజేస్తూ ఆమోద లేఖ రాయాలని సీమాంధ్ర రాజకీయనేతలు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీపై ఒత్తిళ్లు తీసుకు వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.


తెలంగాణలో భూసేకరణ సులువు
తెలంగాణలో కొత్త పవర్ ప్రాజెక్టు నిర్మాణాలకు భూపాలపల్లి, రామగుండం, కొత్తగూడెం విద్యుత్ ప్రాజెక్టుల పరిసరాల్లో కొన్ని వందల ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రామగుండంలో 600 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. దాని పక్కనే రాయగండి వద్ద 1,512 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఇక్కడ భూ సేకరణ జరపాల్సి వస్తే ఎకరం ధర గరిష్ఠంగా రెండు లక్షలకు మించదని తెలంగాణ విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్నారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి వద్ద కేటీపీపీ పరిసరాల్లో కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. కేటీపీపీ ప్లాంటు పక్కన ఉన్న దుబ్బపల్లి గ్రామాన్ని జెన్‌కో యాజమాన్యం దత్తత తీసుకుంది. ఇక్కడి వ్యవసాయ భూములకు గిట్టుబాటు ధర కల్పిస్తే విద్యుత్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చేందుకు స్థానికులు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ భూసేకరణ జరపాల్సి వస్తే ఎకరం రూ.4లక్షల నుంచి రూ.5లక్షలకు మించదు. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్)లో ప్రస్తుతం 1,720 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. స్థానికంగా మరో 8,600 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రభుత్వం, జెన్‌కో యాజమాన్యం భూసేకరణకు అవసరమైన నిధులు తమ వద్దలేవని సాకులు చూపుతుండడం విశేషం.


బొగ్గు సింగరేణిది.. సోకు సీమాంధ్రది
తెలంగాణలో కడతామన్న ప్రాజెక్టులు ఎన్నో ఏళ్లుగా మూలుగుతునే ఉన్నాయి. బొగ్గు, నీరు లేని రాయలసీమలో ఆర్టీపీపీ కట్టారు. సింగరేణి బొగ్గుతో మణుగూరులో కట్టాల్సిన ప్రాజెక్టును తరలించి విజయవాడ వద్ద వీటీపీఎస్‌గా మార్చారు. తెలంగాణ ప్రాంతంలో 1400 మెగావాట్ల శంకరపల్లి గ్యాస్ పవర్ ప్రాజెక్టు గత పదేళ్ళుగా పడకేసింది. అన్నీ అనుమతులు పొందిన కరీంనగర్ జిల్లా నేదునూరు గ్యాస్ పవర్ ప్రాజెక్టు ఇప్పటికీ అతీగతి లేదు. సత్తుపల్లిలో 600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు రాకుండా పోయింది. ఫలితంగానే తెలంగాణలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు ఎదగాల్సినంత ఎదగలేకపోయాయని నిపుణులు చెబుతున్నారు. దాని పర్యవసానంగానే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను తెలంగాణ ప్రాంతం కోల్పోయిందని అంటున్నారు. మొత్తంగా తెలంగాణ ప్రాజెక్టులకు 13.17 మిలియన్ టన్నుల కోల్ లింకేజీ ఉండగా.. ఆంధ్రకు 13.31 మిలియన్ టన్నులు, రాయల సీమకు 8.07 మిలియన్‌టన్నుల లింకేజీ ఉండటం విశేషం.


సీమాంధ్రులదే పెత్తనం......
నేటికీ విద్యుత్‌రంగంలో చైర్మన్లు, డైరెక్టర్లు, ఉద్యోగులుగా అత్యధిక శాతం సీమాంద్రులే ఉన్నారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌ల పరిధిలోనూ సీమాంధ్ర కాంట్రాక్టర్లదే ఆధిపత్యం. విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రభుత్వరంగంలో విద్యుత్ ఉత్పత్తికి పాతర వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రైవేటు రంగంలో విద్యుత్ ఉత్పత్తి (జనరేషన్)కి ప్రాధాన్యం ఇచ్చారు. తద్వారా సీమాంధ్ర పెట్టుబడిదారులు విద్యుత్ ప్రాజెక్టులు పెట్టుకునేందుకు అవకాశాన్ని కల్పించారు. ప్రభుత్వరంగంలో రావాల్సిన విద్యుత్ ప్రాజెక్టులు రాకుండా పోయాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ప్రతిపాదించిన విద్యుత్ ప్రాజెక్టుల్లో ఏ ఒక్కటీ ఈనాటి వరకు ఆచరణకు నోచుకోలేదు.


విద్యుత్‌బోర్డు నుంచే కుట్రలు
విద్యుత్ సంస్కరణలకు ముందు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బోర్డు (ఏపీఎస్‌ఈబీ) నాటి నుంచే సీమాంధ్రులు కుట్రలు కుతంత్రాల్లో ఆరితేరారు. విద్యుత్‌బోర్డు కాలంలో డైరెక్టర్లుగా పనిచేసిన ఎక్కువ మంది బినామీ పేర్లతో కాంట్రాక్టులు చేసిన ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ పాలనలో విద్యుత్ బోర్డులో పదవీ విరమణ చేసిన ఉన్నతాధికారులను ప్రైవేటు ప్లాంటు యాజమాన్యాలు డైరెక్టర్లుగా నియమించుకున్నాయి. వారిచేత సీమాంధ్ర ప్రాజెక్టులకు అనుకూలంగా, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వంతో అనుమతులు తెప్పించుకుని.. ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ఆరోపణలు ఉన్నాయి.


జెన్‌కో ప్రాజెక్టులు రాకుండా..ప్రభుత్వరంగ సంస్థ ఏపీ జెన్ పరిధిలో కొత్త గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు రాకుండా, ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టుల సామర్ధ్యం పెరగకుండా గుప్పెడు మంది సీమాంధ్ర పెట్టుబడిదారీ వర్గాలు అడ్డుకుంటున్నాయని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ జిల్లా నేదునూరు గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు, రంగారెడ్డి జిల్లాలో శంకర్‌పల్లి గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులున్నాయి. నేదునూరు ప్రాజెక్టు నిర్మాణం కాకుండా చేసిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. ఈ ప్రాజెక్టు సకాలంలో పూర్తయితే 2100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగుండేది. దాంతో ప్రభుత్వరంగ జెన్‌కోకు పేరు ప్రతిష్టలు రావడంతోపాటు తెలంగాణ ప్రాంతం వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ముందుకు దూసుకు పరిస్థితులుండేవి. శంకర్‌పల్లి ప్రాజెక్టుకు భూ కేటాయింపులు ఏనాడో జరిగినా ఇప్పటికీ నిర్మాణం ఊసే లేదు. ఇంకా ఆ ప్రాజెక్టు కాగితాలకే పరిమితమై ఉంది. ఈ ప్రాజెక్టుకు 2000 సంవత్సరంలోనే భూ సేకరణ జరిగింది. తొలుత నాఫ్తా ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చేయాలని భావించారు. అది వ్యయంతో కూడుకున్నదని తదుపరి దానిని గ్యాస్ ఆధారితంగా మార్చారు. విశేషం ఏమిటంటే.. ఈ ప్రాజెక్టును కాదని 2003లో సీమాంవూధుల పవర్ ప్రాజెక్టుకు గ్యాస్ కేటాయింపులు జరిగాయి.

గ్యాస్ కేటాయింపులోనూ మతలబు
ల్యాంకో పవర్‌ప్రాజెక్టుకు గ్యాస్ కేటాయింపులోనూ ఎంతో మతలబు చోటుచేసుకుంది. వాస్తవానికి కాకినాడ వద్ద కట్టాల్సిన ల్యాంకో పవర్ ప్రాజెక్టును విజయవాడ సమీపంలోని కొండపల్లికి తరలించారు. పైగా ప్రభుత్వ వ్యయంతో ల్యాంకో కొండపల్లి ప్రాజెక్టుకు పైప్‌లైన్ నిర్మాణాలు జరిపారు. శంకర్‌పల్లి ప్రాజెక్టుకు వచ్చిన అభ్యంతరాలు ల్యాంకో ప్రాజెక్టుకు రాకపోవడంలోనూ చాలా వ్యవహారం నడిచింది. మర్చెంట్ పవర్ ప్రాజెక్టుగా ల్యాంకో ప్రాజెక్టుకు ఏపీ ట్రాన్స్‌కో సిఫారసు చేయలేదు. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న కొన్ని పరిణామాలతో ల్యాంకోకు గ్యాస్ కేటాయింపుల కోసం ప్రభుత్వం చట్ట విరుద్ధంగా సిఫారసు చేసిందన్న విమర్శలు ఉన్నాయి. అలాంటి ల్యాంకో కొంతకాలం క్రితం జరిగిన సమ్మె కాలంలో రాష్ట్రానికి కరెంటు అందించకుండా తమిళనాడుకు అమ్ముకుంది. దీంతో కరెంటు కోతలు పెరిగి పంటలు ఎండిపోయాయి. రైతులు భారీగా నష్టపోయారు. పరిశ్రమలకు కోతలతో పారిక్షిశామిక ఉత్పత్తులు దెబ్బతిన్నాయి. వాటిల్లో పని చేసే రైతులు, కూలీలు, కార్మికుల ఉపాధిని దెబ్బతీసింది.


రాయలసీమ ప్రాజెక్టు
తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి గ్యాస్, నీళ్లు లేవని సాకులు చెప్పిన పాలకులు నీళ్లు, బొగ్గు లేని రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ) నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు సింగరేణి నుంచి బొగ్గు, దాదాపు 200 కి.మీ. మేర పైప్‌లైన్ నిర్మాణాలు చేపట్టి.. శ్రీశైలం ఎడమ కాలువ నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని అందిస్తున్నారు.


కొత్త ప్రాజెక్టులపైనే కోటి ఆశలు
తెలంగాణ ప్రాంతంలో మరో ఏడాదిలో వినియోగంలోకి వస్తాయన్న భావిస్తున్న జెన్‌కో విద్యుత్ ప్రాజెక్టులు రాష్ట్రంలో బొగ్గు, గ్యాస్ కొరతల కారణంగా నిర్దేశిత కాలానికి పూర్తి అయ్యే అవకాశాలు కనిపించడంలేదు. అదే నెల్లూరులోని కృష్ణపట్నం ప్రాజెక్టు వచ్చే నవంబర్ రెండో వారంలో విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమవుతుండడం గమనార్హం. కృష్ణపట్నం ప్రాజెక్టుకు విదేశీ బొగ్గు దిగుమతులున్న విషయం తెలిసిందే. గ్యాస్ ఆధారంగానే ప్రణాళికలో ఉన్న కరీంనగర్‌లోని 700 మెగావాట్లు, శంకరపల్లిలోని 1,000 మెగావాట్ల ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి సోలార్, విండ్ పాలసీలను ప్రకటించినప్పటికీ ఆచరణలో వాటికి సంబంధించిన ప్రాజెక్టుల ఏర్పాట్లు చురుకుగా లేవు. 2013 మార్చి చివరాంతానికి ఏపీ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 8,924.86 మెగావాట్ల వరకు ఉంది. 11వ పంచవర్ష ప్రణాళిలో 1,994 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకుని 2,374 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేర్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి మొదలయ్యే 12వ పంచవర్ష ప్రణాళికలో రూ.32,828 కోట్ల వ్యయంతో అదనంగా 7,110 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలతో కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా 2014 నాటికి కేవలం ఏపీ జెన్‌కో పరిధిలో అదనపు సామర్థ్యం ద్వారా 3,210 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. సుమారు పదివేల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు అంచనాలు రూపొందించుకుంది. ఇందుకోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.4,119.33 కోట్లు ఖర్చు చేయాలని జెన్‌కో సంకల్పించింది. ఇలాంటి ప్రాజెక్టుల్లో నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ (50 మె.వా.) మొదలుకుని లోయర్ సీలేరు (240 మె.వా.), పులిచింతల (120 మె.వా.), కొత్తగూడెం స్టేజ్-2 (600 మె.వా.), ఆర్టీపీపీ స్టేజ్-4 (600 మె.వా.)తో పాటు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం (1,600 మె.వా.) పవర్ ప్రాజెక్టులున్నాయి. గత పదేళ్లకాలంలో ఏపీ జెన్‌కో అదనంగా 2,394 మె.వా. విద్యుత్ ఉత్పత్తిని సాధించగా, వచ్చే 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలోని ఐదేళ్ళలో ఏకంగా 5,610 మె.వా. అదనపు విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకున్నది.


తెలంగాణ వ్యవసాయరంగం తెర్లు
వ్యవసాయరంగానికి ఏడు గంటల పాటు కరెంటు సరఫరా చేస్తున్నట్లుగా ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, ఆచరణలో ఉన్న పరిస్థితులకు పొంతన లేకుండా పోతున్నది. దీంతో రైతాంగం పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయి. తెలంగాణ జిల్లాల్లో బోరుబావుల్లో నీళ్లున్నా వాటిని తోడేందుకు కరెంటు లేకపోవడంతో కంటిముందే మొలక ఎండిపోతున్నది. కాలాన్నే నమ్ముకుని విత్తనం వేసిన అన్నదాత వరుణుడి కరుణ కోసం ఆకాశంవైపు ఎదురుచూస్తున్నాడు.

తాగునీటి అవసరాలను సైతం ఫణంగా పెట్టి డెల్టా ప్రాంతానికి మూడో పంట కోసం సాగర్ జలాలను వదిలిన సర్కార్.. తెలంగాణ ప్రాంత రైతాంగం పంటలను కాపాడేందుకు కరెంటును సరఫరా చేయడంలో మాత్రం ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వెల్లు తెలంగాణ జిల్లాల్లో వ్యవసాయమంతా భూగర్భజలాలపై అధారపడి ఉంది. బోరుబావుల నుంచి నీటిని తోడేందుకు కరెంటు తప్పనిసరి. అందుకే తెలంగాణలోని (హైదరాబాద్ మినహా) తొమ్మిది జిల్లాల్లో దాదాపు 17లక్షలకుపైగా వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. తెలంగాణలో వ్యవసాయరంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకే కరెంటు సరఫరాలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న అరోపణలు వెల్లు అవసరాల మేరకు విద్యుత్ కొనుగోలుపై ఆంక్షలు విధించడం, కొన్న విద్యుత్‌కు బకాయిల చెల్లింపులో తీవ్ర జాప్యంతోపాటు తెలంగాణ జిల్లాలకు నిర్దేశించిన విద్యుత్ కోటాలోనూ కోతలు విధించడం పరిపాటిగా మారిందని తెలంగాణ విద్యుత్ నిపుణులు చెబుతున్నారు. అదేసమయంలో తెలంగాణలోని సీమాంధ్ర కంపెనీలకు మాత్రం వారి అంచనాలకు మించి విద్యుత్ సరఫరా ఉండటాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.


తెలంగాణపై నష్టాల నెపం
రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ, సరఫరా టాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్) నష్టాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. భూగర్భ జలాలపై ఆధారపడి విద్యుత్ అవసరాలు ఎక్కువగా ఉన్న తెలంగాణ జిల్లాల్లోనే విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కానీ సీమాంధ్రలో పది శాతం లోపే విద్యుత్ నష్టాలున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే కరెంటు నష్టాల నెపం తెలంగాణపై నెట్టివేసి పాలకులు సీమాంధ్రకు కరెంటు సుఖాలు అందిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. తెలంగాణ జిల్లాలోనే ఎక్కువ విద్యుత్ నష్టాలు ఉంటే యుద్ధ ప్రాతిపదికన వాటిని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ.. అంతా బాగున్న సీమాంధ్రలో విద్యుత్ సరఫరాకు అవసరమైన మౌలిక సదుపాయాలు పెంచుకుంటూ పోవడంతో సీమాంధ్రలో నష్టాలు తగ్గుముఖం పడుతున్నట్లుగా తెలుస్తున్నది. తెలంగాణ ప్రాంతంలో దశాబ్దాల నాటి విద్యుత్ లైన్లు, పటిష్టంగా లేని సరఫరా వ్యవస్థతో నిర్ణీత పరిమితికి మించి విద్యుత్ నష్టాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ పరిస్థితి కొనసాగేది కాదననే అభిప్రాయం ఉంది.

తెలంగాణ ప్రాజెక్టులు
తెలంగాణలో బొగ్గు నిల్వలు, నీటి లభ్యత ఉన్నా ఏర్పాటు కావాల్సిన విద్యుత్ ప్రాజెక్టులే రాకుండాపోయాయి. సత్తుపల్లిలో థర్మల్ ప్రాజెక్టు 2007లో తలపెట్టారు. నిజానికి చుట్టూ బొగ్గు ఉన్నా.. బొగ్గు కేటాయింపులు లేవనే సాకుతో ఈ ప్రాజెక్టు ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. కరీంనగర్ జిల్లా నేదునూరు గ్యాస్ ఆధారిత ప్రాజెక్టుకు 2002లోనే అన్ని అనుమతులు వచ్చాయి. చిత్తశుద్ధి ఉంటే కేవలం 13 నెలల నుంచి 26 నెలల లోపు ఇది పూర్తయి ఉండేది. కేవలం గ్యాస్ కేటాయింపులు లేవనే సాకుతోనే నేదునూరు పవర్ ప్రాజెక్టు ముందడుగు వేయలేకపోయింది. ఇదే సమయంలో 2003లో సీమాంధ్రకు చెందిన నాలుగు గ్యాస్ పవర్ ప్రాజెక్టులు జీవీకే (220 మె.వా.), వేమగిరి (370 మె.వా.), గౌతమి (464 మె.వా.), కోనసీమ (445 మె.వా.) పవర్ ప్రాజెక్టులకు మాత్రం కేటాయింపులు జరిగాయి. తెలంగాణలోని 1400 మెగావాట్ల సామర్ధ్యం గల శంకర్‌పల్లి గ్యాస్ పవర్ ప్రాజెక్టుకు 2000 సంవత్సరంలోనే అన్ని అనుమతులూ వచ్చినా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం పక్కన పడేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో కంతనపల్లి పాటు మరికొన్ని హైడల్ ప్రాజెక్టులు సైతం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.

నాడు మద్రాసు- నేడు హైదరాబాద్


8/27/2013 12:48:11 AM

తెలంగాణలోని రాజకీయ పక్షాలన్నీ కటువుగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమయింది. తమ ప్రాంత ప్రయోజనాలే లక్ష్యం గా అన్ని రాజకీయపార్టీలు తమ తమక్షిశేణులను సిద్దం చేసుకొని వ్యూహాత్మకంగా అడుగు ముందుకు వేస్తారని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు. ఇంతవరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, లాయర్లు, కవులు, కళాకారులు ఉద్యమంలో తమవంతు పాత్ర చరివూతాత్మకంగా నిర్వహించారు. తెలంగాణ కల సాకారమయ్యే రోజు అతి సమీపంలోనే ఉందన్న విషయం తేటతెల్లమయింది. దేశ రాజకీయాలలో ప్రధాన భూమిక నిర్వహించే కాంగ్రెస్, బీజేపీలు, జాతీయ ప్రాంతీయ పార్టీలలోఅధిక భాగం తెలంగాణ రాష్ట్ర డిమాండుకు ఆమోదముద్ర వేశాయి. అంతా బాగానే వుంది,వచ్చిన చిక్కల్లా హైదరాబాదు నగరం పదేళ్ళ వరకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని సీడబ్ల్యూసీ కేంద్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకోవడంలోనే ఉంది. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని ఉద్యమం చేస్తున్న సీమాంధ్ర రాజకీయనాయకుల అసలు గొడవ అంతా హైదరాబాద్ మా చేజారి పోతున్నదన్న బాధేనని స్పష్టమవుతున్నది. ఈ పరిస్థితిలో తెలంగాణలోని రాజకీయ పక్షాలు తమ గొంతుబలంగా వినిపించాలి. నిక్కచ్చిగా వ్యవహరించి, పట్టువిడుపులకు సందివ్వకుండా ఎవరితో పొత్తులేని హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల భౌగోళిక తెలంగాణ సాధించుకోవాలి.ఉమ్మడి రాజధాని అన్నదే అసంబద్ధమైనది. ఏ ఊరు, ఏ పట్టణమైనా భౌగోళికంగా ఏప్రాంతంలో ఉంటుందో అన్ని అవసరాలకు, సాంస్కృతికంగా ఆప్రాంతానికే ఉంటుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చండీగఢ్ రాజధానిగా ఉండడం ఆరెండు రాష్ట్రాల మధ్య ఆనగరం ఉంది కాబట్టి సాధ్యమయింది. సరిహద్దులు నిర్ణయించడంలోను ఇబ్బందులేమి రాలేదు. కాని తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగం. తమ రాష్ట్రం సరిహద్దుల నుంచి రెండు మూడు వందల కిలోమీటర్లువూపయాణం చేస్తేనేగాని రాజధానికి చేరుకోలేని ఇబ్బందికరమైన పరిస్థితికి సామాన్య సీమాంవూధులను ఎందుకునెట్టి వేయబడాలి? పొరుగు రాష్ట్రంలో తమ రాజధాని ఉంటే పరిపాలన ఎలా సాధ్యమవుతుందో సీమాంవూధులు ఆలోచించాలి.

ఉమ్మడి రాజధానిలోవూపభుత్వ భూములపై అజమాయిషీ ఎవరికీ ఉంటుం ది? పూర్వపు అల్తాఫ్బలా ్దజిల్లాలోని 1263 గ్రామాలలోని లక్షలాది ఎకరాల భూములన్నీ నిజాం సొంతభూములే! అవన్నీ 1956లో ఆంధ్రవూపదేశ్ ప్రభు త్వ భూములయి పోయాయి. దేశంలో ఏ రాష్ట్ర రాజధానిలోను అంత పెద్దఎత్తున ప్రభుత్వ భూములు ఉండేవికావు. బహుళజాతి సంస్థలకు, సీమాంధ్ర పెట్టుబడిదారులకు, సినీనటులకు కొన్ని దశాబ్దాల లీజుకు, నామమావూతపు ధరకు అమ్మినవి పోగా, సెజ్జులకు కేటాయించినవి మినహాయించినా ఇంకా ప్రభుత్వ భూమి బోలెడంత ఉంటుంది. మరి రేపు ఉమ్మడి రాజధానిగా ఉండబోయే కాలంలో ఏపరిక్షిశమకో, ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్షికమానికో ప్రభుత్వ భూమిని కేటాయించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? హైదరాబాదాద్ పాలనా వ్యవస్థ ఏ ప్రభుత్వం కింద ఉంటుంది? రెవెన్యు వసూళ్ళు ఎవరు చేస్తారు ఆ వసూళ్ళు ఎవరి ఖాతాలో జమ అవుతాయి అన్న విషయాలు నిర్ణయించేటప్పుడు తెలంగాణ ప్రాంత నాయకులునిర్ణయాత్మకంగా వ్యవహరించాలి.మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో 29 డిసెంబర్ 1952 నాడు తమిళ కాంగ్రెస్ సంఘం చేసిన తీర్మానం ఇక్కడ గుర్తుచేసుకోవాలి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటవుతుందని ప్రధాని ప్రకటించారు; మద్రాసు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం అవతరించాలని ఆమరణదీక్ష చేసిన పొట్టిశ్రీరాములు మరణించి రెండువారాలే అయ్యింది; విభజన విషయాలు పరిశీలించడానికి ఒక ఉపసంఘం ఏర్పాటయింది; ఆ ఉప సంఘానికి కామరాజ్నాడార్ అధ్యక్షుడు; ఆ ఉప సంఘం ఏమాత్రం సంకోచించకుండా,ఏ శషభిషలు లేకుండా ఎకక్షిగీవ తీర్మానం ఒకటి ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఆ తీర్మాన పాటం ఇలా ఉంది: మద్రాసు నగరం మినహాగా ఆంధ్రరాష్ట్రం నిర్మాణం గురించి ప్రధాన మంత్రి చేసిన ప్రకటనను ఈ ఉప సంఘం హృదయపూర్వకంగా ఆమోదిస్తున్నది. మదరాసు నగరం తమిళనాడులోఅంతర్భాగమని, అది సహజంగాను, తప్పనిసరిగాను మదరాసు రాష్ట్రంలో ఉండి తీరాలని ఈ ఉప సంఘం భావిస్తున్నది.(ఆంధ్ర పత్రిక 28.12.1952)ఈ తీర్మానం ఆధారంగానే మదరాసు నగరము గురించి ఆలోచించడం మానివేయకపోతే పరిస్థితులు ఇంకో లా ఉంటాయని రాజాజీ తీవ్రంగా హెచ్చరించింది.సరిగా ్గఅదే పరిస్థితి ఇప్పుడు ఉత్పన్నమైంది. ఉమ్మడి రాజధాని తప్పనిసరి అయితే, సీమాంధ్ర ప్రభుత్వానికి సచివాలయంలో కొన్ని భవనాలు, శాఖాధిపతుల కార్యాలయాలలో కొన్ని గదులు తప్ప ఇంకేమి ఉండవని సీమాంవూధులకు స్పష్టం చెయ్యాలి. కేంద్రం ఏర్పాటు చేసే కమిటీలతో, అధికారులతో ఈ విషయాలు చర్చించేటప్పుడు రాజకీయపార్టీల ప్రతినిధులతోపాటు తెలంగాణ పౌరసమాజం ప్రతినిధులు ఉండాలి. ఉద్యమ సందర్భం గా చాలాసారు ్లచెప్పుకున్న ఒంటె, గుడారం కథను మళ్లీ ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. పదేళ్ల ఉమ్మడి రాజధాని ఏరూపంలోనూ శాశ్వతం కాకుండా, గడువు పొడిగించకుండా ఇప్పుడే జాగ్రత్త వహించాలి. దీనికి పూనుకోవాల్సింది రాజకీయపక్షాలే!
-ఎ. రాజేంవూదబాబు
తెలంగాణ కో-ఆర్డినేషన్ కమిటీ కోశాధికారి

తెలంగాణ సంఘీభావ ఉద్యమాల చరిత్ర


8/25/2013 12:33:43 AM
ముంబై రిపోర్ట్
దేశ ఆర్థిక రాజధానిగా, అంతర్జాతీయ నగరంగా ప్రసిద్ధి చెందిన ముంబై మహా నగరాన్ని 200 ఏళ్ళ క్రితమే చారివూతక, సామాజిక అనేక కారణాల రీత్యా వలస వచ్చిన తెలంగాణ బిడ్డలు నిర్మించినట్లు చరిత్ర పరిశోధకులు తేల్చి చెప్పారు. అంతేకాకుండా భాష తెలియని భాషా ప్రాంతానికి చేరి అక్కడి సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులకు అనుగుణంగా అతికొద్ది కాలంలోనే మార్పు చెంది, అక్కడి ప్రజలతో మమేకమై నగర నిర్మాతల బిరుదు పొందడం, సంఘ సంస్కరణ, సాహితీ, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో అగ్రక్షిశేణి పాత్ర పోషించడం చరివూతలో అరుదైన, అనూహ్య అంశంగా పరిశోధకులు అభివర్ణించారు. ఇందులోనూ బడుగు, బలహీనవర్గాల వారికి చెందిన శ్రామిక జీవులు అత్యధికం కావడం మరీ విశేషం. బట్టల మిల్లు నగరంగా ప్రసిద్ధి చెందడంతో అప్పటికే బ్రిటీష్ వారి (ఈస్ట్ ఇండియా) వలస పాలన విధానాల మూలంగా గ్రామీణ చేతివృత్తులు కుంటు పడడంతో లక్షలాది తెలంగాణ నేత కార్మికులు షోలాపూర్, పూనేలాంటి నగరాలతో బాటు ముంబైకి వలసల నేపథ్య రూపంలో చేరుకున్నారు. నాటి నుంచి నేటికీ ముంబై - తెలంగాణ ప్రాంతానికి మధ్య అవినాభావ, రక్త సంబంధాలు మాతృనేల ప్రేమతో ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి.
udhymam
2009 డిసెంబర్ 9 ప్రకటనకు పూర్వమే తెలంగాణపై స్పష్టమైన రాజకీయ వైఖరితో ప్రొ॥ జయశంకర్ సిద్ధాంతాల ప్రేరణతో ముంబైలోని కొందరు సాహితీపరులు, సామాజిక న్యాయ ఉద్యమకారులు తమ ఉద్యమ కార్యక్షికమాలతో ముందు నిలిచారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం తెలంగాణ కవులు, రచయితలు, కళాకారుల ప్రేరణ, ధూంధాం, ఆటపాటల సాంస్కృతిక వెల్లువల వెలుగులో తొలిసారి 2007లో ముంబైలోని గోరేగావ్‌లో తెలంగాణ యువశక్తి ఆధ్వర్యాన భారీ ‘ధూంధాం’ కార్యక్షికమాన్ని ఏర్పరిచారు. ఇందులో ప్రముఖ కవులు, కళాకారులూ పాల్గొని ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. రసమయి బాలకిషన్, వంతడుపుల నాగరాజు, దేశపతి శ్రీనివాస్, అంద్శై, వరంగల్లు శ్రీనులతో పాటు 40 మంది కళాకారుల బృందం పాల్గొని ముంబైలో తెలంగాణ ఉద్యమాలకు ఊపిరినిచ్చింది. ఈ సందర్భంగా ‘ముంబై తెలంగాణ ధూంధాం’ సీడీని ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని విడుదల చేశారు. ఆ తర్వాత తెలంగాణ అంశంపై రిలయన్స్ కార్మికులు, భవన నిర్మాణ కార్మిక సంఘాల మద్దతుతో ముంబై పరిసర ప్రాంతాల్లో అనేక అవగాహన సదస్సులు తెలంగాణ అనుకూల కళాకారులు, రచయితల మద్దతుతో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 2009 డిసెంబర్ 9 ప్రకటనకు ముందే భావసారూప్యత గల తెలంగాణ వాదుల సమిష్టి కృషితో ‘ముంబై తెలంగాణ సంఘీభావ వేదిక’నే ఏర్పరిచారు. ఇందులో వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులను ఎంపిక చేసి కన్వీనర్ల బాధ్యతలు అప్పగించి విస్తృత స్థాయిలో ముంబైలో తమ కార్యక్షికమాలు చేపట్టారు. దీనిలో భాగంగా 2009 డిసెంబర్ మొదటి వారంలో ముంబై ‘ఆజాద్ మైదాన్’లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన జరిపారు.

ఆ తర్వాత డిసెంబర్ 9 చిదంబరం ప్రకటనతో ఉవ్వెత్తున సంబరాలు జరిపారు. కానీ, దాని వెను వెంటనే జరిగిన కృత్రిమ రాజీనామాల, ఉద్యమాల పరిణామాల మూలంగా నోటి వద్దకు వచ్చిన ముద్దను లాక్కెళ్ళిన గుప్పెడు పెట్టుబడిదారీ సీమాంవూధుల కుట్రల మూలాలు తెలుసుకొని తిరిగి 2013 జూలై 30న సీడబ్ల్యూఎస్ తీర్మాణాల వరకు విరామం లేకుండా పోరాడిన ఘనత ముంబై తెలంగాణ ఉద్యమ సంఘీభావ వేదికకు దక్కింది. ఈ వేదికతో అనుబంధం పెంచుకొని ఆ తర్వాత స్వతంవూతంగా ముంబై తెలంగాణ బహుజన ఫోరం టీఆర్‌ఎస్ ఐక్యకార్యాచరణ సమితులు ఏర్పడి మరింత విస్తృత స్థాయిలో పనిచేశాయి. ముంబై తెలంగాణ కళాసాహితీ, ముంబై తెలంగాణ రచయితల వేదిక, ముంబై తెలంగాణ విద్యావంతుల వేదిక, ముంబై తెలంగాణ కార్మిక సంఘాల సహకారాలతో సుమారు 300లకు పైగా నిరసన, మృతవీరుల సంతాప సభలు, ధర్నాలు, వినతిపవూతాలు, అవగాహన సదస్సులు, ధూంధాం సాంస్కృతిక కార్యక్షికమాలు నిర్వహించారు. వీటితో పాటు నవంబర్ 1 విద్రోహదినం, తెలంగాణ యోధుల స్మృతి సభలూ జరిపారు.

2007 జనవరి 27వ తేదిన గోరేగావ్‌లో ఎనిమిది వేలమందితో తెలంగాణ యువశక్తి వేదిక ద్వారా అంద్శై, రసమయి, దేశపతి, నాగరాజు, శ్రీనులతో ప్రారంభమైన ధూంధాం 2010 ఆగస్టు 13 బాంద్రా ధూంధాంకు చేరే లోపుల తెలంగాణ సంఘీభావ వేదిక ఏర్పాటైంది. దాని ఆధ్వర్యాన తెరవే ప్రస్తుత అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ ముఖ్య అతిథిగా సంధ్య, వంతడుపుల నాగరాజు, విమలక్క, దరువు ఎల్లన్నల కళాబృందాలతో బాంద్రాలో సుమారు 18,000 మంది జనం సమీకరణతో భారీ ప్రదర్శన నిర్వహించారు.

చారివూతాత్మకమైన ఆగస్టు 13 ధూంధాంలో తెలంగాణ (ముంబై) కళామంచ్, నవోదయ, రిలయన్స్ కార్మిక సంఘం, బాంద్రా కార్మిక సంఘం ఎమ్‌టిఎస్‌వి నేతృత్వంలో అ.భా.తెరవే అధ్యక్షులు మచ్చ ప్రభాకర్, ఎం.టి.బి.ఎఫ్. కన్వీనర్ మూలనివాసి మాల, గ్యార శేఖర్, ఎలిజాల శ్రీను, మారంపెల్లి రవి, పిట్టల గణేష్, సత్తయ్య, దేవానంద్, రాజేశ్వర్ నాయకుల సమిష్టి కృషితో లక్షల ఖర్చుతో కూడిన ధూంధాం (బాంద్రా) నిర్వహించారు. ఆ పిదప వాషి, న్యూముంబైలో బద్ది హేమంత్ ‘తెలంగాణ టుడే’ పత్రిక ప్రారంభించడం వేదికలో పనిచేసి టిఆర్‌ఎస్‌ను ఏర్పరిచినా అక్కడ దరువు ఎల్లన్న బృందంతో మరో ధూంధాం సంఘీభావ వేదిక ఆధ్వర్యాన నిర్వహించారు. ఇక వరుసగా డోంబివలీలో వెయ్యి మందితో, జూహు, గోరేగావ్, ప్రతీక్షనగర్, ఖార్, ఘట్‌కోపర్ లాంటి అనేక తెలంగాణ ప్రజలున్న ప్రాంతాల్లో నిరసనలు, అవగాహన సదస్సులు, సంతాప సభలు నిర్వహించారు. ముఖ్యంగా ఇందులో భవన నిర్మాణ కార్మికుల, రిలయన్స్ కార్మికుల పాత్ర మరువలేని త్యాగం.

ముంబైలో ఉద్యమం విస్తరించి ఆత్మ బలిదానాల పరంపర కొనసాగుతున్న దశలోనే తెలంగాణ ఉద్యమ సంఘీభావం విస్తరించి సరికొత్త నాయకులను అందించింది. ఆందులో గొండ్యాల రమేష్, అక్కన దుర్గేశ్, మారంపెల్లి రవి, వెంక బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఉద్యమాన్ని మరింత విస్తృతి చేయటంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఇదే దశలో కంటె అశోక్, వేదిక ఆధ్వర్యాన వర్లీలో అక్కడి కొన్ని వర్గాల వారిని కలిపి తెలంగాణ అమరుల సంతాప దినం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రసమయి బృందంతో ధూంధాం నిర్వహించారు. ప్రముఖ ధూంధాం కళాకారుడు ఎం.రవి చొరవతో జుహులోని ఏడు ప్రాంతాల ప్రజలను సమీకరించి తొలిసారి ముంబై ‘జెఎసి’ని తెలంగాణలోని టి.జెఎ.సి.కి అనుబంధంగా ఉండాలన్న దూరదృష్టితో వేదిక, ఈ వ్యాస రచయిత, స్వామిగౌడ్, నారాయణగౌడ్, సాయిబాబా తదితరుల కృషితో ఏర్పాటు చేసిన పిదప మరో జెఎసి సహితం ఏర్పడి తమ కార్యక్షికమాలతో తెలంగాణ సంఘీభావం కోసం విస్తృత స్థాయిలో కృషిచేశాయి.

తెలంగాణ విద్యావంతుల వేదిక డా॥ శ్రీధర్, తెరవే రచయితలు బెల్లి యాదయ్య, కార్యదర్శి సూరేపల్లి సుజాత, గోగు శ్యామల, అన్నవరం దేవేందర్ లాంటి ఎందరో ప్రముఖ రచయివూతులు, రచయితలతో ఎమ్.టి.ఎస్.వి. సభలు నిర్వహించింది.జనవరి 19, 2013 టిఎన్‌జీవో చైర్మన్ దేవీవూపసాద్, కార్యదర్శి కె.రవీందర్‌డ్డి, రేచెల్, కె.రంగరాజు, వెంక విజయలక్ష్మీ బృందం ముంబై దర్శించినప్పుడు సుమారు 62 సంఘాలతో దాదర్ దేవరాజ్ హాలులో ‘స్వాగత సభ’ను వేదిక ఏర్పాటు చేసింది. ఆ రోజు కోదండరాం (చ్మైన్ టిజెఎసి) సందేశాన్ని ఫోను ద్వారా దేవీవూపసాద్ సభలో పాల్గొన్న వందల తెలంగాణ కార్మిక ప్రజలకు వినిపించారు. ఇంతేగాక మిలియన్ మార్చ్, సమరదీక్ష, చలో అసెంబ్లీ లాంటి అనేక టిజెఎసి పిలుపులకు స్పందించి ముంబైలోని వేదిక, ఎం.టి.బి.ఎఫ్., జెఎసి తదితర నాయకులు హాజరై తమ సంఘీభావం తెలియజేశారు.కాగా, గత జూలై 30 సీడబ్ల్యూసీ తెలంగాణ ఆమోదముద్ర ప్రకటనతో ముంబైలోనూ వర్లీ, సయాన్, దోబీఘాట్, కంపెనీ గేట్ల వద్ద పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. వివిధ తెలంగాణ ఉద్యమ సంఘాలతో పాటు ఇంతకాలం తటస్థంగా ఉన్న కొన్ని ప్రధాన కుల సంఘాలు ఆలస్యంగానైనా సరే, ఖుషీతో సంబరాలు జరుపుకోవడం విశేషం. చిట్ట చివరగా జూలై 31న సుమారు మూడు వందల మంది తెలంగాణ వాదులతో ‘తెలంగాణ సాధన సమారంబ’ సభను మాటుంగా శివాజీనగర్ సొసైటీ హాలులో స్థానిక తెలంగాణ కార్పొరేటర్, నాయకులతో ధూంధాం సాంస్కృతిక కార్యక్షికమాలను తెలంగాణ శ్రమజీవి సంఘం, పలు కార్మిక సంఘాల ఆధ్వర్యాన సంయుక్తంగా ఉత్తేజ పూరితమైన సభను ఏర్పాటు చేయడమూ విశేషమే.

రూపాయి పతనం అర్థం చేసుకునేదెలా?


8/26/2013 12:11:36 AM
రూపాయి విలువ .......ఈ మధ్య వార్తల్లో లేని రోజు లేదు. అంతర్జాతీయ విపణిలో మారకపు రేటు దృష్ట్యా రూపాయి విలువ రోజు రోజుకీ క్షీణించడం అటు ఆర్థికమంత్రి నుంచి సామాన్యుడి వరకు కలవరపెడుతోంది.ఇంతకీ రూపాయి విలువ పతనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ళలో డాలర్‌తో సమానంగా ఉన్న రూపాయి విలువ ఈ 66 సంవ త్సరాలలో 62 సార్లు పతనమైంది. రూపాయి విలువ పతనం 2011 నుంచి ప్రారంభమైనా అత్యధికంగా గత రెండేళ్ళకాలంలోనే జరిగింది. ఇటీవల వరుసగా డాలరుతో రూపాయి మారక విలువ వేగంగా క్షీణించడం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆసియాలోని ఏ ఇతర వర్థమాన ఆర్థిక వ్యవస్థల్లోనూ ఆయా దేశాల కరెన్సీ విలువ ఈ స్థాయిలో పతనం కాలేదు. రెండు దశాబ్ధాల క్రితం ప్రారంభమైన తొలి విడత సంస్కరణలు ఆరంభంలో స్థూల దేశీయోత్పత్తిని పెంచగలిగినా పేదలకు ఆసంస్కరణల ఫలాలు దక్కలేదు.
ruppe-down
డాలర్‌కు డిమాండ్ పెరగడానికి కారణాలు
ఇటీవల అంక్టాడ్ (యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్) నివేదికలో భారతదేశంలోని దేశీయ ప్రత్యక్ష పెట్టుబడి 2012లో 26బిలియన్ డాలర్లకు అంటే 29 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఎఫ్‌డిఐ రూపంలో డాలర్లు దేశంలోకి వచ్చినపుడు రూపాయితో మారకం జరుగుతుంది. తద్వారా డాలర్ సరఫరా పెరగడంతో, రూపాయికి డిమాండ్ పెరిగి రూపాయి విలువ పెరగడమో, లేదా నిలకడగా ఉండటమో జరుగుతుంది. 2012లో దేశంలోకి ఎఫ్‌డిఐలు రావడం తగ్గిపోయింది.
-రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవాస భారతీయులకు బాండ్‌లు అమ్మకం ద్వారా విలువైన డాలర్లను పొందిందనే వార్త ప్రచారంలో ఉంది. ప్రవాస భారతీయులు ఈ బాండ్లపై పెట్టుబడి పెడితే రూపాయి పతనం కారణంగా అధిక కరెన్సీ రిస్కుతో పాటు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉదాహరణకు ప్రవాస భారతీయులు ఇండియాలో లక్ష డాలర్లు పెట్టుబడి పెడితే ఒక డాలరుకు రూ. 55 చొప్పున అతనికి రూ. 55 లక్షలు వస్తుంది. ఈ డబ్బును 10 శాతం వడ్డీరేటుతో పెట్టుబడి పెడితే ఒక సంవత్సరం తరువాత రూ. 55 లక్షలు, (రూ.55 లక్షలు + రూ.55 లక్షలపై 10 శాతం వడ్డీ) 60.5 లక్షలకు పెరుగుతుంది. ఎన్‌ఆర్‌ఐలు పవాస భారతీయులు) ఈ డబ్బును వెనక్కి తీసుకుపోతారు. ఉదాహరణకు ఒక డాలరుకు రూ. 60లు అనుకుంటే ఎన్‌ఆర్‌ఐ రూపాయలను డాలర్లలోకి మార్చుకుంటే అతనికి 100,800 డాలర్లకు కొంచెం, అటూ, ఇటుగా పెట్టుబడి పెట్టిందే వస్తుంది. డాలర్లలో చూసుకుంటే అతనికి లాభం 0.8 శాతమే. వాస్తవంగా లాభం తక్కువైనా ఇది మారక వ్యయాన్ని ఖాతాలోకి తీసుకోదు. కాబట్టి ఎన్‌ఆర్‌ఐలు డాలర్లలోనే పెట్టుబడి పెట్టడమే మంచిది. ఆర్‌బిఐ బాండ్‌లలో పెట్టుబడి పెట్టడానికి ప్రవాస భారతీయులను ఆకర్షించడానికి ఎక్కువ వడ్డీ ఇవ్వవలసి ఉంటుంది.
-డాలర్ సరఫరా సమస్యాత్మకంగా ఉన్నప్పుడు దాని డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. గత కొన్ని సంవత్సరా లుగా కంపెనీలు డాలర్ల రూపంలో లోన్లు తీసుకుని ఇపుడు తిరిగి చెల్లించవలసి రావడం వల్ల డాలర్లకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది.
-భారతీయులకు బంగారంపై మోజు ఎక్కువగా ఉండటం కూడా డాలర్ డిమాండ్ పెరగడానికి తోడ్పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనే బంగారం కొనడం, అమ్మడం జరుగుతుంది. దేశంలో బంగారం కొద్ది మోతాదులోనే ఉత్పత్తి అవుతుంది. వినియోగానికి సరిపడా బంగారం కోసం దిగుమతులపైనే ఆధారపడవలసి వస్తుంది. బంగారం దిగుమతి చేసుకుంటే చెల్లింపులు డాలర్లలోనే చేయాలి కాబట్టి, ఇది డాలర్ డిమాండ్ పెరగడానికి దోహద పడింది.
-ఇండియా విద్యుత్ ప్లాంట్ అవసరాలకోసం భారీగా బొగ్గు దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. దేశంలో గత సంవత్సరంతో పోల్చుకుంటే 2013 మేలో 66-77 మిలియన్ టన్నులు, 43 శాతం దిగుమతులు తగ్గాయి. బొగ్గు దిగుమతి కారణంగా మళ్ళీ డాలర్‌కు డిమాండ్ పెరిగింది. దేశంలో ఎక్కువ బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ తవ్వకం జరగటం లేదు. దేశంలోని బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండియా లిమిటెడ్ ఏకస్వామ్యం కలిగి ఉంది. ప్రభుత్వం బొగ్గు రంగంలో ప్రైవేటు పెట్టుబడులను , ప్రోత్సహించాలని చూస్తే కోల్గేట్ కుంభకోణం వెలుగు చూసింది. ఈ కుంభకోణం కారణంగా బొగ్గు గనుల తవ్వకంలో ప్రైవేట్ రంగం ఆగమనం ఆలస్యమవుతుంది. బొగ్గు గనుల నిర్వహణలో నిపుణులు కోల్ ఇండియాకే పరిమితం కావడంతో, అటువంటి నిపుణులను ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేయాలంటే కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి అప్పటి వరకు బొగ్గు దిగుమతి చేసుకోవడానికి డాలర్లు చెల్లించ వలసి ఉంటుంది.
-భవిష్యత్‌లో ప్రభుత్వ సామాజిక రంగ విధానాల వలన డాలర్లకు భారీగా డిమాండ్ ఏర్పడవచ్చు. ఈ సంవత్సరం ప్రభుత్వం గోధుమ సేకరణ 25.08 మిలియన్ టన్నులకు అంటే 33 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం దేశంలో భారీగా ధాన్యం నిల్వలు ఉండటం వలన వెంటనే దీని ప్రభావం ఉండదు. ఆహార భద్రత హక్కు చట్టబద్ధమైన హక్కుగా మారడంతో ఆహార ధాన్యాల సేకరణ తగ్గితే ప్రభుత్వం గోధుమలు, వరి దిగుమతి చేసుకోవలసి వస్తే మళ్ళీ డాలర్‌కు డిమాండ్ ఏర్పడుతుంది. ప్రస్తుతానికి అవసరం లేనప్పటికీ, దీన్ని పూర్తిగా కొట్టి పడేయలేం. ఇవి రూపాయి-డాలరు మారకంకు సంబంధించిన ప్రాధమిక-అంశాలు వీటికి రాత్రికి రాత్రే పరిష్కారం కనుగొనలేము.
రూపాయి పతనం - దాని ప్రభావం
-పెట్రోలియం మంత్రిత్వశాఖ అంచనా ప్రకారం డాలరుతో ప్రతి రూపాయి పతనం వలన రూ. 8,000 కోట్లు, క్రూడ్ ఆయిల్ ధరలు ఒక డాలర్ పెరిగితే రూ॥ 4,000 కోట్లు అదనపు భారం పడుతుంది. మొత్తంగా చూస్తే రూపాయి పతనంతో వసూళ్ళ సంఖ్య రూ. 1,50,000 కోట్ల కు పైగా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మారకపు రేటు సుమారు రూ. 54 ఉన్నప్పుడు, వసూళ్ళు సుమారుగా రూ. 80,000 కోట్లు ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు.
-రూపాయి పతనంతో ఆయిల్ పై ఎక్కువ ద్రవ్యాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. రూపాయి పతనానికి అనేక కారణాలున్న ప్పటికీ తక్షణ కారణంగా ద్రవ్యోల్భణ ప్రభావం, ఇంధన ధరలు చెప్పుకోవచ్చు. ఆయిల్ ధరలపై నియంత్రణ ఎత్తి వేయడంతో అంతర్జాతీయ ఇంధన ధరల వ్యాపారం దేశీయ ఆయిల్ ధరలను మారకపు రేటు నిర్ణయిస్తుందనేది అపోహ మాత్రమే. ఇంధనం అంతర్జాతీయ వారధిగా ఉండడంతో ఇతర ధరలైన ఉత్పత్తి వ్యయాలు, రవాణావ్యయాలలో ప్రత్యక్షంగా పాత్ర వహిస్తుంది. కాబట్టి రాబోయే కొన్ని నెలల్లో తీవ్ర ద్రవ్యోల్భణం సంభవించే అవకాశం ఉంది.
-దిగుమతి ఆధార పర్రిశమలకు మూల్యహీనీకరణ కారణంగా ఉత్పత్తి వ్యయం పెరిగిపోయి తక్షణం ప్రభావం చూపుతుంది. మన్నికగల వినియోగ వస్తువులైన మొబైల్స్, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్, వైట్‌గూడ్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు మన్నిక కాని వినియోగ వస్తువులైన సబ్బులు, టాయ్‌లెట్‌కి సంబంధించిన వస్తువులు బాగా ప్రియమవుతాయి. ఇటీవల ధరల ప్రభావంతో బాగా ఆందోళనకు గురిచేసే అంశం ఆహార ద్రవ్యోల్భణం.
కరెన్సీ విలువ ఎందుకు పతనమౌతుంది?
రూపాయి పతనానికి గల అనేక కారకాలలో విదేశీ పెట్టుబ డులు బయటికి వెళ్ళడం, అప్పులు, ఈక్విటీలు, అంతర్జాతీ యంగా పటిష్టమైన ఇతర కరెన్సీలు కారణం.నిర్మాణాత్మక కారకాలలో ఇండియాలో కరెంట్ అకౌంట్‌లోటు పెరగడంతో రూపాయి అంతర్జాతీయంగా ఒడుదుడుకులకు లోనవుతుంది. రూపాయి పతనంతో విదేశీ ప్రయాణం కూడా భారంగా మారుతోంది.
రూపాయి పతనం ఎవరికి లబ్ధి?
ఐటీ కంపెనీ దారులకు రూపాయి పతనం వలన ప్రయోజనం కలుగుతుంది. భారత్ సందర్శించాలనుకునే పర్యాటకులకు మారకపు రేటు ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రవాస భారతీయులు వారి సొంత ప్రాంతానికి రెగ్యులర్‌గా డబ్బులు పంపేవారు, విదేశీ కరెన్సీ పొదుపును రూపాయలలోకి మార్చుకునే వారు ప్రయోజనం పొందుతారు.
ఈ పరిస్థితి నుంచి బయట పడడానికి ఆకర్షణీయమైన మార్గాలను అన్వేషిస్తామని ప్రభుత్వ ముఖ్య ఆర్ధిక సలహాదారైన రఘురామ్‌రాజన్ తెలిపారు.
రూపాయి పతనం - 2013
1. 2013 - జనవరి 01 రూ॥ 54.68
2. 2013 - మే 22 రూ॥ 55.66
3. 2013 - జూన్ 10 రూ॥ 58.15
4. 2013 - జూన్ 12 రూ॥ 57.79
5. 2013 - జూన్ 14 రూ॥ 57.51
6. 2013 - ఆగస్టు 22 రూ॥ 65.56

పీటముడిని విప్పేదెవరు?


తెలంగాణ ప్రాంతం నిజాం నుంచి 1948 సెప్టెంబర్ 17న విముక్తి అయి భారతదేశంలో విలీనమైంది. ఆంధ్ర ప్రాంతం 1953 లో మద్రాసు నుంచి విభజింపబడి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. విశాలాంవూధలో ప్రజారాజ్య స్థాపన జరుగగాలని కమ్యూనిస్టులు, తెలుగు మాట్లాడేవారు ఒకే రాష్ట్రంలో ఉండటం ద్వారా సమగ్ర అభివృద్ధి చెందుతుందని ఆనాటి పెద్దలు ఆకాంక్షించి విశాల ప్రాతిపదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు రూపకల్పన చేశారు. తెలంగాణలో అనేక మంది పెద్దలు మేధావులు అభ్యంతరం పెట్టారు. అందుకే పెద్ద మనుషుల ఒప్పందం, ఆరు సూత్రాల పథకం, రాష్ట్రపతి ఉత్తర్వులు, 610జీవోలు విడుదల చేసి భరోసా కల్పించారు. మొత్తానికి జరిగినదేమిటి, చేసుకున్న ఏ ఒక్క ఒప్పందం కూడా సక్రమంగా అమలుకు నోచుకోలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఈనాటిది కాదు, 1953 నుంచి ప్రతి సందర్భంలో రకరకాల పద్ధతులలో వ్యక్తం చేయబడుతూనే ఉన్నది. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 1972లో జై ఆంధ్ర ఉద్యమాల ను విశ్లేషణాత్మక దృష్టితో పరిశీలించాలి. ఎందుకంటే తెలంగాణకు ఉద్యోగాలు, నిధులు, సాగునీరు కొన్ని రక్షణలు కల్పిస్తే ఆంధ్ర ప్రాంతం వారు అంగీకరించలేదు.

అందుకే భిన్న ధృవాలుగా ఆలోచనలు కలిగాయి. కేంద్ర ప్రభుత్వం రెండు ప్రాంతాల వారిని ఒత్తిడి చేసి ఒప్పించగలిగినా, అది తాత్కాలిక ఉపశమనంగానే మారింది. 1985లో 610 జీవో గిర్‌గ్లాని కమిషన్, అలాగే అనేక కమిటీలు వేయబడ్డాయి. 2005లో నాటి అసెంబ్లీలో 610 జీవో అమలుకు 15 మంది శాసనసభ్యులతో మానిటరింగ్ ఇంప్లిమెం కమిటీ పెట్టినా, అమలుకు అన్ని అవరోధాలు ఎదురయ్యాయి. కారణం చిత్తశుద్ది లేకపోవడమే. పరిణామాలను గమనించిన సీపీఐ 2000 సంవత్సరం డిసెంబర్ 15న వరంగల్‌లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలిచ్చి తెలంగాణ చారివూతాత్మకంగా వెనుకబడినందున 10 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ, 610జీవో అమలు, మూసిపెట్టిన పరివూశమలు తెరిపించి, భూసంస్కరణ చట్టా న్ని అమలు చేయాలని, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలలో వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి సాగు నీరు సౌకర్యము ఇతర మౌళిక సదుపాయలపై దృష్టిలో పెట్టాలని ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వానికి, 2004 లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నవించినా పెడచెవిన పెట్టింది నిజం కాదా!.

సీపీఐ 23 జిల్లాలో కూడా తన ఆందోళనలు నిర్వహించింది. 2001 టీఆర్‌ఎస్ ఏర్పడింది. 2004లో దానితో కాంగ్రెస్ ఒప్పందం చేసుకుంది. కనీస ఉమ్మడి కార్యవూకమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశమును చేర్చి రాష్ట్రపతి ప్రసంగము ద్వా రా ప్రకటించింది. 2008 సీపీఐ జాతీయ మహాసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానించింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలమని నిర్ణయించింది. బీజేపీ తెలంగాణ ఏర్పాటు కావలసిందేనని ప్రకటించింది. 2007లో సీపీఐ శాసనసభా పక్షం వేసిన ప్రశ్నకు అసెంబ్లీలో ప్రాం తాల వారీగా నిధులు వసూల్లు, ఖర్చులపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆనాటి ఆర్థికశాఖ మంత్రి కె.రోశయ్య అస్పష్టమైన సమాధానమిచ్చారు. సభను తప్పుతోవ పట్టించారు. జలయజ్ఞంలో భాగంగా కూడా తెలంగాణ ప్రాంతానికి తెలంగాణకు మొదటి ప్రాధాన్యం ఇవ్వలేకపోయింది.

2009 డిసెంబరు 9న ప్రత్యేక తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఆనాటి కేంద్ర హోంశాఖమంత్రి చిదంబరం ప్రకటించి సీమాంధ్ర ఉద్యమ నేపథ్యంలో 13 రోజులలోనే నిలిపివేశారు. శ్రీ కృష్ణ కమిటీ, కోర్ కమిటీ లు, వారు రూంలో కమిటీలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణతో రోడు మ్యాపు తెప్పించుకొన్నారు. 2012 డిసెంబరు 28న సుశీల్ కుమార్ షిండ్ హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో హాజరైన ఎనిమిది పార్టీలలో ఆరు పార్టీలు విభజనకు అనుకూలమని తేల్చిచెప్పాయి. తరువాత ఏడు మాసాలు గడిచిన తర్వాత జూలై 30న యూపీఏ భాగస్వామ్య పక్షాలతో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీతో సంప్రదించి సీడబ్ల్యూసీలో చర్చించి రాష్ట్ర విభజనకు కార్యాచరణను ప్రకటించింది.

మరుసటి రోజు నుంచి ఎందుకు సీమాంధ్ర ఉద్యమం ఆరంభమయ్యింది. దీని వెనకాల ఏ శక్తులున్నాయి. ఇందులో పాల్గొంటున్నదెవరు. మాజీ ప్రధాన మంత్రులైన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల విగ్రహాల కూల్చివేత మూలంగా ఎటువైపు సంకేతాలు పంపుతుంది. వైఎస్‌ఆర్‌సీపీ ప్లేటు ఫిరాయించి 16 మంది ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి, విజయమ్మతో నిరవధికదీక్ష ఇపుడేమో చంచల్ గూడ జైల్లో జగన్మోహనరెడ్డి జైల్లో దీక్షలు ఏ లక్ష్యంతో కొనసాగుతున్నవి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విభజనకు అనుకూలమని, రాజధాని నిర్మాణం, ఇతర అంశాలు పరిష్కరించాలని వారు ప్రకటిస్తే, కింది స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు, ఆందోళనలు మరొక వైపున అధికార కాంగ్రెస్‌కు సంబంధించి మంత్రులు బరితెగించి సీమాంధ్ర ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ ముందే వెల్‌లోకి పోతూ, నిరసనలు తెలుపుతున్నారు.

ఎందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రేక్షకపాత్ర వహిస్తున్నది. ఇంతటి దిగజారిన విలువలను ఎవరైన ఊహించగలరా! సాక్షాత్తు రాష్ట్ర సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు మంత్రులను ఘెరావ్ చేయడంతోపాటు రోజు వినూత్న పద్ధతులలో ఆందోళనలు చేస్తున్నారు. ఈ మధ్య తెలంగాణ ఉద్యోగులు కూడ నినాదాలతో నిరసనలు చేస్తున్నారు. రెండు ప్రాంతాల ఉద్యోగులు తోపులాటలు, ఘర్షణలు పడుతున్నారు. మరోవైపు లాయర్లు ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ముద్ర వేసుకున్నారు. వీరి నాయకత్వంలో పరిపాలన ఎలా సజావుగా సాగుతుంది. పరిపాలన పడకేసింది. హైదరాబాద్, సాగునీరు, ఇతర అంశాల పరిష్కరించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, హైదరాబాద్ కేంద్ర ప్రాంతంగా వచ్చి ఇక్కడి అభివృద్ధి సంపద మేము సృష్టించిదేనన్న పెడ ధోరణలతో అక్కసు వెల్లగక్కుతున్నారు. కొంతమంది కాంగ్రెస్ ఎం పీలు, ఎమ్మెల్యేలు తెలంగాణ విభజనను బహిరంగంగానే వ్యతిరేకిస్తూ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు.

కొంత మంది తెలంగాణ నాయకులను టార్గెట్ చేస్తున్నారు. ఆనం వివేకనందాడ్డి వారు ఇం గిత జ్ఞానము కూడా కోల్పోయి తెలంగాణవాదులు విద్రోహులు, హింసవాదులని నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్బంలో ఇలాంటి అనేక అనుమానాలు సందేహలు వ్యక్తమైతే తెలంగాణ నుంచి నలుగురిని, సీమాంధ్ర నుంచి నలుగురి ముఖ్యులను ఎంపిక చేసి ఎనిమిది మందితో కేంద్ర ప్రభుత్వ మధ్యవర్తిత్వం తో పెద్ద మనుషుల ఒప్పందం చేయబడింది. ఇన్ని సంవత్సరాల సంప్రదింపుల ను కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు కొలిక్కి తీసుకరాలేక పోయింది. హైదరాబాద్, సాగునీరు, నిధులు ఇలాంటి అంశాలపై క్లారిటీగా చర్చించి, తగిన పరిష్కారం చూపడంలో విఫలం కావడం దురదృష్టకరం. సమైక్యాంధ్ర, కోరుకునే వాళ్ల అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రత్యేక దృష్టి చేయాలి. లేదా నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి. ఉద్రికత్తలు రోజురోజు పెరుగుతున్నందున, కాలయాపన పనికిరాదు.

ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రజలలో సత్సంబంధాలున్నవి. బంధుత్వాలు కూడా పెరిగినవి. అసలు ప్రశ్న ఏమిటి నిధులు, నీళ్ళు, ఉద్యోగాలు, పరిపాలనలో భాగస్వామ్యంలో వైఫల్యాలు అందుకే సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుదీర్ఘంగా ఉద్యమం సాగింది. ఆంధ్ర, రాయలసీమ కూడా హైదరాబాద్ ఆదాయం, ఉద్యోగాలు, నిధులు, అలాగే ప్రాజెక్టులు, తదితర అంశాలలో సందేహాలుంటే నివృత్తి చేయవలసిన ప్రధాన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. ఇంకా ఎంత జాప్యం చేస్తే సమస్య అంత జటిలమయ్యే పరిస్థితులు ఏర్పడతాయని కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించవలసి వుంటుంది.
-చాడ వెంకటడ్డి
మాజీ శాసనసభ్యులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

ఆదాయం యథాతథం


8/30/2013 1:36:54 AM
-ఎక్సైజ్ ఆదాయం భారీగా పెరిగింది
-రిజిస్ట్రేషన్, రవాణా మినహా మిగిలినవన్నీ ఓకే
- రిజిస్ట్రేషన్ మీద ఆషాఢం, విలువల పెంపు ప్రభావమే ఎక్కువ
- నష్టజాతక సీమాంధ్ర ఆర్టీసీ నడవకపోతేనే లాభం
- ఆదుకున్న తెలంగాణ ప్రాంతం
- ఎనీవేర్ రిజిస్ట్రేషన్ యోచనకు మోకాలడ్డుతున్న సీమాంధ్ర అధికారులు

హైదరాబాద్, ఆగస్టు 29(టీ మీడియా): సీమాంవూధలో సమైక్యాంధ్ర ఆందోళన నెలరోజులకు చేరుతున్నా cash-02tif-alfaరాష్ట్ర ఆదాయం మీద ఆ ప్రభావం దాదాపు శూన్యం. అన్ని కీలక ఆదాయ వనరులు యథాతథ రాబడులను నమోదు చేశాయి. ఆందోళనలు...ఉద్యమాల ప్రభావం రాష్ట్ర ఖజానాపై లేదని ధృవీకరించాయి. ఖజానాకు కీలక ఆదాయ వనరులైన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖలనుంచి ఆదాయ రాబడి ఆగస్టు మాసంలో ఏ మాత్రం తగ్గకపోగా ఎక్సైజ్ ఆదాయం లక్ష్యానికి మించి పెరుగుదల నమోదయింది. ఇక మరో కీలక వనరు వాణిజ్య పన్నుల వాటా 90 శాతానికి మించింది. అయితే రిజిస్ట్రేషన్ శాఖపై ఆదాయంలో కొంత కోత పడినట్లుగా కనిపిస్తోంది. దీనికి కూడా ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు, ఆషాఢ మాసం, మార్కెట్ విలువల పెంపు భారం పడిందని భావిస్తున్నారు. మరో ప్రధాన ఆదాయ వనరు రవాణా శాఖపై కొంత మేర సమ్మె ప్రభావం పడింది. రూ. 100కోట్ల ఆదాయం ఆర్టీసీ కోల్పోయిందని, అయితే సీమాంవూధలో ఆపరేటింగ్ వ్యయం నష్టాల్లో ఉందని...

ఆర్టీసి బస్సులు నిలిచిపోవడంతో వచ్చే నష్టం ఏమీ లేదని..పైగా ఆపరేటింగ్ ఖర్చులు, నష్టాలు మిగులుతున్నాయని ఆర్టీసీ ఉన్నతాధికారులు అంటున్నారు. అయితే ప్రధానంగా భారీ క్షీణత నమోదైన రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంపై అందరి దృష్టి పడుతోంది. ఈ ఆదాయం తగ్గుదలకు సమ్మెతో సంబంధం లేదని...అనేక ప్రతికూల ప్రభావాలు కారణమయ్యాయని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ఏప్రిల్ 1నుంచి మార్కెట్ విలువల పెంపుతో భూములు, స్థిరాస్థుల రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగిన సంగతి తెలిసిందే. మార్కెట్ విలువల పెంపుపై ప్రభుత్వం రెండు నెలల ముందుగానే పబ్లిక్ డొమైన్‌లో పెట్టి ప్రజల అభివూపాయాలను స్వీకరించిన సంగతి విదితమే. దీంతో విలువల పెంపు భారం భయంతో ప్రజలు మార్చిలోనే తమ ఆస్థులు, భూముల రిజిస్ట్రేషన్లు ఆగమేఘాలమీద పూర్తి చేసుకున్నారు. దీంతో సహజంగానే ఏప్రిల్‌నుంచి ఆదాయం మందగించింది. దీనికితోడు స్థానిక ఎన్నికలు, ఆషాడ మాసం కారణంగా లక్ష్యంలో 29.11 శాతం పేలవమైన ఫలితాలను సాధించింది. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు నిర్దేశించుకున్న లక్ష్యం రూ. 1527కోట్ల లక్ష్యానికిగానూ ఆగష్టు మాసాంతానికి 72.93 శాతంతో రూ. 1114 కోట్లకు చేరడం విశేషం.

ఈ నెలలో రిజిస్ట్రేషన్ల శాఖ రూ. 601.35 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకోగా అందులో 29.11 శాతం ఆదాయాన్ని సాధించి రూ. 9కోట్ల 54 లక్షల ఆదాయాన్ని మాత్రమే చేరుకుంది. అయితే ఈ ఆదాయమంతా కేవలం తెలంగాణ జిల్లాలనుంచి వచ్చిందే కావడం గమనార్హం. ఆగస్టు 1నుంచే సీమాంధ్ర జిల్లాల్లో రిజిస్ట్రేషన్ సేవలపై సమ్మె ప్రభావం పడగా...రాష్ట్రం మొత్తంమీద స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం భారీగా పడిందని రిజిస్ట్రేషన్ శాఖలోని ఉన్నతాధికారి ఒకరు అభివూపాయపడ్డారు. ఈ ఆర్జనలో అత్యధికంగా కరీంనగర్, నిజామాబాద్ డివిజన్ల నుంచి లభించింది. అయితే ఆగస్టు మాసం ఆరంభంనుంచే సీమాంవూధలో రిజిస్ట్రేషన్ సేవలకు ఆటంకాలు ఏర్పడటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. మరోవైపు సీమాంధ్ర అధికారులు రాష్ట్రవ్యాప్త ఆన్‌లైన్ సేవలను నిలిపివేయాలని సీఎంను కలిసి విజ్ఞప్తి చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే 2010-11 వార్షిక ఏడాదిలో సీమాంవూధలోని 13 జిల్లాలనుంచి రూ. 2354.0కోట్లు ఆదాయంరాగా తెలంగాణ 10 జిల్లానుంచి రూ.20.79కోట్లు సమకూరింది. 2011-12లో సీమాంవూధనుంచి రూ. 20.40కోట్లు రాగాతెలంగాణ నుంచి రూ. 2620.72కోట్లు, 2012-13లో సీమాంవూధనుంచి రూ. 2917కోట్లుకాగా తెలంగాణనుంచి రూ. 3667.31 కోట్ల ఆదాయం లభించింది.


సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ సేవలు...
తాజాగా ఇలాంటి ఆటంకాలకు చెక్ పెట్టేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ 23 జిల్లాల్లో అమలులో ఉన్న ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని విస్తరించి రాష్ట్రవ్యాప్తం చేయాలని నిర్ణయించింది. తాజాగా ట్రయల్ రన్ చేసిన అధికారులు ఈ విధానం ఆశించిన రీతిలో సఫలం కావడంతో ఇక అమలులోకి తెచ్చే చర్యలకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధానాన్ని వీలైతే సెప్టెంబర్ మొదటి వారంలో అందుబాటులోకి తెచ్చి ప్రజలకు ఆటంకాలు లేకుండా చూడాలని రిజిస్ట్రేషన్ల శాఖ యోచిస్తోంది.

ఆంధ్రోళ్ల అడ్డా.. నిమ్స్


8/30/2013 4:40:00 AM
తెలంగాణ వారిని ఇంటర్వ్యూకే రానివ్వని కుట్ర
26మందిలో ఎంపికైన ఐదుగురూ సీమాంధ్రులే..

హైదరాబాద్ ఆగస్టు 29 (టీ మీడియా):ఎవరు కట్టించిన ఆస్పత్రి?.. ఎవరికోసం కట్టించిన ఆస్పత్రి?.. చివరకు ఎవరి పాలైంది! ఏ ఆశయంతో పెట్టారు.. ఇపుడక్కడ ఏం జరుగుతోంది? తెలంగాణ తనను తాను కోల్పోవడం వల్ల జరిగిన నష్టమేమిటి?... ఈ ప్రశ్నలన్నింటికీ నగరం నడిబొడ్డున ఉన్న ఒకనాటి నిజాం బొక్కల దవాఖానా.. నేడు రంగులు పూసి.. హంగులు వేసి సీమాంవూధులు కబ్జా పెట్టిన నిమ్స్ andhraఅనబడే పెద్దోళ్ల దవాఖానా సమాధానంగా నిలుస్తుంది. ఆస్పవూతిని గుప్పిట్లో పెట్టుకున్నవాళ్లను.. ఆస్పత్రి మంచాలను ఆక్రమించిన వాళ్లను చూస్తే గుండె పగులుతుంది. గొర్రెల్లాంటి...గోదల్లాంటి కటిక పేదలైన తన ప్రజలకోసం ఒకానొక నియంత కూడా చలించి సొంత డబ్బు ఖర్చుచేసి కట్టించి ఉచితంగా వైద్యం చేయించుకుని చల్లగా బతకమని ఇచ్చిన ఆశీర్వాదం.. సీమాంవూధుల పాలై వైద్యాన్ని కరెన్సీ కట్టలతో తూ చే వ్యాపార శాపంగా మారిపోవడం ఒక విషాదం. నీళ్లున్న చోట కప్పలు చేరినట్టు కరెన్సీ కట్టల చప్పుడు వింటేనే మూగే వ్యాపార మనస్తత్వం కలిగిన వారి గుప్పిట్లో ఉక్కిరిబిక్కిరి కావడం ఒక దౌర్భాగ్యం. రాజ్యాన్ని ఏలేవాడే ఇక్కడి వైద్యాధికారాన్ని ఏలాలని అమలు చేస్తున్న అప్రకటిత శాసనం ముఫ్పై ఏళ్ల నిమ్స్ చరివూతలో తెలంగాణ వాడికి అధికారం మూడేళ్లుకూడా మిగల్చని... విభజన ముంగిట్లోనూ తెలంగాణ వాడికి దక్కనివ్వని వాస్తవం చెబుతున్నదేమిటి? ముదిరిన రోగానికి అంగఛ్చేదనంలాగే అవధులన్నీ దాటిన సీమాంధ్ర జాఢ్యానికి రాష్ట్ర విభజనే మార్గమని!!

నిమ్స్ డైరెక్టర్ పదవికి ఎన్నికలో తెలంగాణకు మళ్లీ అన్యాయం జరిగింది. ఎట్టిపరిస్థితిలోనూ తెలంగాణ వారికి అవకాశం ఇవ్వరాదన్న కృత నిశ్చయంతో సెర్చ్‌కమిటీ జరిపిన ఎంపిక ప్రహసనంలో ఇంటర్వ్యూలకు ఎంపిక స్థాయిలోనే తెలంగాణ వారందరినీ పక్కన పెట్టేశారు. ఇపుడు ఇక వారిష్టం.. వారి రాజ్యం. నిజాం బొక్కల దవాఖానా 1985లో నిమ్స్‌గా పేరుమార్చుకున్న తర్వాత సీమాంవూధులు దీన్ని తమ అడ్డాగా మార్చుకున్నారు. రాష్ట్రం విడిపోతున్న ఈ సందర్భంలోనూ ఆస్పవూతిలో తమ హవాకు అడ్డులేకుండా మళ్లీ నిమ్స్ డైరెక్టర్ పదవిని కబ్జా పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఖాళీ అయిన డైరెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకున్న 26మందిలో 20 మందీ వాళ్లే. ఉన్న ఆరుగురు తెలంగాణ వాళ్లలో ఒక్కళ్లనీ ఇంటర్వ్యూకే పిలవకుండా కుట్రలు. తెలంగాణ వాళ్లు కానీ ఐదుగురుని పిలిచి ఇంటర్వ్యూ అనే ముందే రచించుకున్న నాటకాన్ని ఆడేందుకు స్టేజీ సిద్ధమైంది. చిత్తూరు వారికి ఖాయం అయిన పోస్టుకు తూతూ తతంగంలో చివరి అంకానికి తెర లేస్తున్నది.

ఇదీ నిమ్స్ చరిత్ర
1950లో నిజాం రాజు హైదరాబాద్ రాష్ట్రానికి రాజ్‌వూపముఖ్(గవర్నర్)గా ఉండేవాడు. ఒక రోజు ఆయన డ్రైవర్‌కు చేయి విరిగితే ఉస్మానియా ఆస్పవూతిలో చేర్పించారు. మరుసటి రోజు పరామర్శకు ఉస్మానియా ఆస్పవూతికి వెళ్లిన నిజాంకు అక్కడ ఎముకల వైద్యానికి తగు ఏర్పాట్లు లేవని తెలిసింది. అక్కడున్న డాక్టర్లు కూడా ఎముకల దవాఖానా లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. ఎముకలు విరిగి వైద్య సదుపాయాలు లేక అల్లాడుతున్న ప్రజలను చూసి కరకు నియంత అయిన ఆయన మనసు కూడా తల్లడిల్లింది.

దీంతో ప్రత్యేకంగా ఎముకల వైద్యాన్నే అందించే ఒక మంచి ఆస్పత్రి కట్టించాలని నిర్ణయించి తన సొంత డబ్బు, సొంత స్థలంతో నిజాం అర్థోపెడిక్ హాస్పిటల్‌ను నిర్మించారు. పేదలందరికీ వైద్యాన్ని ఉచితంగా అందించే ఏర్పాట్లు చేశాడు. ఆ తరువాత కాలంలో ఇది ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఉచిత వైద్యం కొనసాగింది. పాతికేళ్ల పాటు ఇలా రాష్ట్రంలోని పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తూనే వచ్చింది. 1985లో ఈ దవాఖానకు కష్టాలు వచ్చిపడ్డాయి. ఎన్టీఆర్ ముఖ్యమంవూతిగా ఉన్నపుడు దీన్ని అటానమస్ అన్నారు. తన అనునాయి, తన ప్రాంతానికి చెందిన ఒకాయనకు అన్ని అధికారాలు కట్టబెట్టారు. ఖర్చుల వెసులుబాటుకు డబ్బుల వసూలు పద్దతి పెట్టారు. పేదల ఆస్పత్రి స్టార్ ఆస్పవూతిగా మారింది. పేదలకు చుక్కలను చూపింది. గతంలో ఈ నిమ్స్ ఆస్పత్రి ప్రవేశ ద్వారం వద్ద నిజాం అర్థోపెడిక్ హాస్పిటల్ అనే బోర్డు ఉండేది. కానీ ఈ సీమాంధ్ర నేతలు ఈ బోర్డును కూడా ఎత్తివేయించారు. పూర్తిగా ఈ ఆస్పవూతిని తామే కట్టించినట్లుగా ప్రవేశద్వారం కట్టించి ఇది నిమ్స్ అన్నారు.

table ఆదినుండి తెలంగాణపై వివక్షే
అప్పటినుంచి దీన్ని తమ అడ్డగా మార్చుకున్న సీమాంధ్ర పాలకులు పూర్తిగా తమ అనుయాయులనే డైరెక్టర్లుగా నియమించుకుంటూ వచ్చారు. నిమ్స్‌గా మారిన తరువాత 30ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆస్పవూతికి 15మంది డైరెక్టర్లు వస్తే వారిలో కేవలం ఒక్కరే తెలంగాణ ప్రాంత వ్యక్తి అంటే అర్థం చేసుకోవచ్చు. ఇక డైరెక్టరే కాకుండా ఇతర సిబ్బంది విషయంలోనూ 1985 నుండి లెక్కలు పూర్తిగా తారుమారయ్యాయి. అంతదాకా ఉన్న తెలంగాణ వారందరినీ తరిమివేశారు. ఇక డైరెక్టర్ పదవిలోకి వచ్చిన నిజామాబాద్ జిల్లాకు చెందిన డి.రాజాడ్డి టర్మ్ మూడు సంవత్సరాలు ఉంటే దాన్ని కూడా పూర్తిచేయనీయలేదు. కాలికి పెడితే వేలికి వేలికి పెడితే కాలికీ ముడి పెడుతూ అందులోని డాక్టర్లే అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఫిర్యాదులతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆనాడు నిమ్స్‌లో ఉన్న సోమరాజు, మరికొంతమంది సీమాంధ్ర డాక్టర్లు నానాయాగీ చేసి ఆయన విసిగి రాజీనామాచేసేదాకా నిద్రపోలేదు. ఒక్కో వ్యక్తి రెండేసి సార్లు నిమ్స్ డైరెక్టర్ అయిన సందర్భాలన్నా తెలంగాణ వారికి మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఉద్యోగుల విషయంలోనూ సీమాంధ్ర డైరెక్టర్లు పూర్తిగా వివక్షనే చూపారు.

ఈ దఫా కూడా సీమాంధ్ర డైరెక్టరే...
ప్రస్తుతం నిమ్స్ ఆస్పవూతికి ఐఎఎస్ అధికారి అజయ్‌సహానీ ఇన్‌ఛార్జీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆయన వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా కూడా ఉన్నాయి. అంతకుముందున్న సీమాంధ్ర డైరెక్టర్ అవినీతిలో ఊబిలో కూరుకుపోయి తప్పనిసరి పరిస్థితిలో పదవి వదులుకోవడం వల్ల ఈయన రావలిసి వచ్చింది. పాత డైరెక్టర్ ధర్మరక్షక్ తన పదవీకాలంలో సర్జికల్ ఐటెంల కొనుగోళ్లలో వంద కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని తేలింది. వాస్తవానికి ధర్మరక్షక్‌ను ఏడాది కాలానికే డైరెక్టర్ పదవిలో నియమించారు. ప్రభుత్వం నుండి మరో ఏడాదికి కొనసాగింపు ఆర్డర్‌ను తెచ్చుకున్నారు. ఈయనకు డైరెక్టర్ పదవి రావడానికి ప్రధాన కారణం ఢిల్లీలోని పైరవీనే అని నిమ్స్ వర్గాలు చెబుతున్నాయి. నిమ్స్‌ను ఏకచవూతాధిపత్యంగా ఏలిన ధర్మరక్షక్ అనుకున్న వారికి సర్జికల్ ఆర్డర్లు ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లు ఇదే సమయంలో ధర్మరక్షక్‌కు రెండోసారి డైరెక్టర్‌గా అవకాశం ఇవ్వడంపై నిమ్స్‌లోని ఒక వర్గం హైకోర్టుకు వెళ్లడం, కోర్టు ధర్మరక్షక్‌ను మీరు తొలగిస్తారా... మమ్మల్ని తొలగించమంటరా... అని అడగడంతో ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. దీనికి తోడు ఆయన టైంలో జరిగిన కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించడంతో తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు.

సీమాంవూధవారికి అండగా సెర్చ్‌కమిటీ
సీమాంధ్ర డైరెక్టర్ల చేతిలో అప్రతిష్టను మూటగట్టుకున్న నిమ్స్ ఆస్పవూతికి మరో కొత్త డైరెక్టర్‌ను నియమించడం కోసం ప్రభుత్వం ఒక సెర్చ్ కమిటీ వేసింది. ఈ కమిటీలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కొండ్రు మురళి, పబ్లిక్ హెల్త్ పౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీనాథ్‌డ్డి, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి అజయ్‌సహానీ ఉన్నారు. దరఖాస్తులు ఆహ్వానిస్తే 26మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఆరుగురు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారున్నారు. వీరిలో రమేష్‌రావు ప్రస్తుతం నిమ్స్‌లోనే ఫార్మకాలజీ ప్రొఫెసర్‌గా ఉన్నారు. శోభాజగదీష్ నిమ్స్‌లోనే ఎగ్జిక్యూటివ్ రిజిస్టార్‌గా, మన్మధరావు చెస్టు ఫిజీషియన్ ప్రొఫెసర్‌గా, సుదర్శన్‌డ్డి నిలోఫర్ పిడియావూటిక్ ప్రొఫెసర్‌గా, కేటీ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ వింగ్‌లో పనిచేస్తున్నారు. అయితే 26మందిలో ఐదుగురిని ఇంటర్వ్యూకు పిలిచారు.

వారిలో సీఎం సొంత జిల్లా చిత్తూరుకు చెందిన ముకుందడ్డి, నరేంవూదనాథ్ (గుంటూరు), వీబీఎన్ ప్రసాద్ (కర్నూల్), జీఎస్‌ఎన్ రాజు (రాజమండ్రి), పీవీఎల్‌ఎన్ మూర్తి (గుంటూరు రూరల్) ఉన్నారు. ఒక్కరూ తెలంగాణ వారు లేకపోవడంలో వ్యూహం ఉందంటున్నారు. ఇంటర్వ్యూలో ఒక్క తెలంగాణవారున్నా తెలంగాణవాదులు, నాయకులు ఆందోళన చేసి ఆ వ్యక్తికే డైరెక్టర్ పదవి ఇవ్వాలని అడుగుతారని, దీనితో సీమాంధ్ర చాన్స్ పోతుందనేఉద్దేశ్యంతో ఇంటర్వ్యూకు ఐదుగురూ సీమాంవూధులే ఉండేలా ప్లాన్ చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దరఖాస్తు చేసిన వారిలో సీనియారిటీ ఆధారంగా ఇచ్చామని చెబుతున్నా అధికారులు ఇన్నాళ్లు తెలంగాణ ప్రాంతానికెందుకు డైరెక్టర్ పదవి ఇవ్వలేదని అడిగితే మాత్రం సమాధానం చెప్పడం లేదు. పెద్దల ఆదేశం మేరకు చిత్తూరు జిల్లా డాక్టర్‌కే డైరెక్టర్ పదవిని కట్టబె అంతా సిద్ధమైనట్టు సమాచారం.

విమ్స్ కానీ నిమ్స్‌కు వస్తారట
సీమాంధ్ర ప్రాంత డాక్టర్ల తీరు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. విశాఖపట్నంలోని విమ్స్‌లో డైరెక్టర్ స్థాయి పోస్టు ఒకటి ఖాళీగా ఉంది. దీనికి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానించింది. కానీ ఒక్కటంటే ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. కానీ నిమ్స్ డైరెక్టర్ పోస్టు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే దరఖాస్తు చేసుకున్న 26మందిలో 20మంది సీమాంవూధులే. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకునే వారు తమ ప్రాంతం వారికి సేవచేసుకోకుండా తెలంగాణలో పనిచేయడానికి మాత్రం ఉరుకులు పరుగులుగా రావడం వింత

అన్ని పార్టీలు ఒప్పుకున్నాకే కాంగ్రెస్ నిర్ణయం


- టీడీపీ, వైఎస్సార్సీపీ ఓట్ల రాజకీయాలు మానుకోవాలి
- సమైక్యంగా ఉండేందుకు దీక్షలు: మంత్రి శైలజానాథ్

హైదరాబాద్, ఆగస్టు 29 (టీ మీడియా): రాష్ట్ర విభజనకు అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్నాకే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నదని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు. టీడీపీ, వైఎస్సార్సీపీ సీమాంవూధలో ఓట్ల రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. గురువారం ఆయన సీఎల్పీలో ఎమ్మెల్యే గాదె వెంకట్‌డ్డితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై ఆ రెండు పార్టీలు ఇప్పటికైనా మనసు మార్చుకుని.. వ్యతిరేక తీర్మానం చేయాలన్నారు.

రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని ఆంటోని కమిటీ వద్దకు వెళ్లినప్పుడు.. రాజకీయ పార్టీలు ఇచ్చిన లేఖలు తమకు చూపించారని తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మొదటి నుంచి పోరాటం చేస్తున్నది ఒక సీమాంధ్ర కాంగ్రెస్ నేతలే అన్నారు. సమన్యాయం అంటున్న జగన్ పార్టీ కూడా ఇప్పటి వరకు సమైక్యత కోసం ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను విమర్శిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంవూధకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలమంతా హైదరాబాద్‌లో దీక్షలు చేస్తామని తెలిపారు. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం లేదా తెలుగుతల్లి విగ్రహం వద్ద సెప్టెంబర్ 2 లేదా 3న దీక్షలు చేయాలనుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్రం వద్ద రాయల తెలంగాణ ప్రతిపాదన లేదని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.

విభజన జరిగితే.. పార్టీలో ఉండే విషయం ఆలోచిస్తా: గాదె
మెజార్టీ లేని యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజనపై ఎలా నిర్ణయం తీసుకుంటుందని ఎమ్మెల్యే గాదె వెంకట్‌డ్డి ప్రశ్నించారు. రాష్ట్ర విభజనపై ఇప్పటి వరకు ప్రభుత్వంలో నిర్ణయం తీసుకోలేదన్నారు. తెలుగు ప్రజల మధ్య తమ పార్టీ చిచ్చు పెట్టిందన్నారు. చిచ్చుపెట్టిన పార్టీలో ఎలా ఉంటున్నారని విలేకరులు ప్రశ్నించగా.. పార్టీలో ఉండేది, ఉండని విషయాన్ని విభజన జరిగితే ఆలోచిస్తానని బదులిచ్చారు.

బొత్సతో మంత్రి శైలజానాథ్ భేటీ
సీమాంధ్ర కాంగ్రెస్ నేతల దీక్షల విషయం చర్చించేందుకు పీపీసీ అధ్యక్షుడు బొత్స తో రాష్ట్ర మంత్రి శైలజానాథ్ గురువారం భేటీ అయ్యారు. దీక్షలకు వేదికను ఎంపిక చేసే విషయంపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. అసెంబ్లీ, తెలుగుతల్లి విగ్రహం వద్ద అనుమతి లభించకపోతే .. గాంధీభవన్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని బొత్సను కోరినట్లు తెలిసింది.

‘ఉద్యమాలతో విద్యార్థులు నష్టపోతున్నారు’
హైదరాబాద్: ఉద్యమాల కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని భారతీయ జనతా యువమోర్చ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌డ్డి అన్నారు. గతంలో తెలంగాణలో ఉద్యమాలు, ఇప్పుడు సీమాంవూధలో ఉద్యమం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, సీమాంవూధలో నెల రోజులుగా ఆందోళన జరుగుతున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ నాయకులు తమ పిల్లలను ఇతర రాష్ట్రాల్లో చదివించుకుంటున్నారని, మరి పేదల పిల్లలు ఎక్కడ చదవాలని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌లో బీజేవైఎం నాయకుడు యాదిడ్డిపై పోలీసులు దాడి చేయడాన్ని ఖండించారు. సమావేశంలో నాయకులు శ్రీనివాసనాయుడు, భరత్‌గౌడ్, నవీన్‌గౌడ్ పాల్గొన్నారు.

భంగపడిన ఆంధ్ర నేతలు


డెబ్భై ఏళ్లక్షికితం ప్రస్తుత చెన్నై.. నాటి మద్రాస్ నగరం ఉద్రిక్త సందర్భాలను చవి చూసింది. తమ భవిష్యత్ తెలుగు రాష్ట్రానికి మద్రాస్ రాజధానిగా ఉండాలని పట్టుబట్టారు నాటి ఆంధ్రా నాయకులు. 1912 నాటికే తెలుగు ప్రజలతోపాటు, తెలుగు వార్తాపవూతికలు ద్రవిడవాదంపై ఫిర్యాదులు మొదలు పెట్టాయి. ద్రవిడుల పురోగతి..

తెలుగువారిని మసకబార్చుతున్నదని, దీన్ని సరి చేయాలంటే తెలుగు మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని వాదన తీసుకువచ్చారు. దానిని దేశానికి స్వాతంత్య్రం వచ్చేంత వరకూ సజీవంగా ప్రచారంలో ఉంచారు. నిజానికి మొదట్లో మద్రాస్ నగరం స్థాయి కేంద్ర అంశంగా లేదు. 1940 నాటికి పరిస్థితి మారింది. 1941 నవంబర్‌లో ఆంధ్రా నాయకులు మద్రాస్‌ను వివాదం చేశారు. అప్పటి కాంగ్రెస్ Madras_1554662gనాయకుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు విశాఖపట్నంలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ మద్రాస్ రాష్ట్ర కేబినెట్ కొద్ది నెలల క్రితం ఆంధ్రా రాష్ట్ర ఏర్పాటు అంశంపై చర్చించిందని పేర్కొన్నారు. ఆ కేబినెట్ సమావేశానికి అప్పటి మద్రాస్ గవర్నర్ లార్డ్ ఎర్సిన్‌ను కూడా ఆహ్వానించారు. ఆయన ఆంధ్రా, మద్రాస్ రాష్ట్రాలు రెండూ నగరాన్ని పంచుకోవచ్చని చెప్పారని, దీనికి తమిళ మంత్రులు కూడా సమ్మతించారని ప్రకాశం పంతులు ఆ సమావేశంలో చెప్పారు. కానీ.. కొన్ని ‘దుష్ట శక్తులు’ ఎర్సిన్ మనసును విషతుల్యం చేశారని, ఫలితంగానే ఆయన తన ప్రతిపాదనకు వ్యతిరేకంగా నాటి ప్రభుత్వ కార్యదర్శికి లేఖ రాశారని పేర్కొన్నారు. అయితే ఆ దుష్టశక్తుపూవరన్నది ప్రకాశం వెల్లడించలేదు. మద్రాస్ నగరాన్ని విభజిస్తే నగరవీధుల్లో రక్తం పారుతుందని బ్రిటిష్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారని ఆయన విశాఖ సమావేశంలో చెప్పారు. 1947లో మద్రాస్ ప్రావిన్స్ ప్రధాని ఓపీ రామస్వామి రెడ్డియార్ చేసిన వ్యాఖ్యలు మరింత సంక్లిష్టతకు దారి తీశాయి. తెలుగువారు మద్రాస్‌ను కోరుకుంటే తమిళులు నెల్లూరు, చిత్తూరు, తిరుపతిలను ప్రతిగా కోరుకుంటారని రుల సమావేశంలో రెడ్డియార్ చెప్పారు.

దీంతో ముందు నగరంపై తేల్చాలని తెలుగు నాయకులు పట్టుబట్టారు. దీనిపై తమిళ రచయితలు, నేతలు తీవ్రంగా మండిపడ్డారు. నగరంతో తెలుగువారికంటే తమిళులకే ఎక్కువ అనుబంధం ఉందని ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. జనాభా సంఖ్యలను కూడా ప్రస్తావించిన రాజాజీ మద్రాస్‌పై హక్కు కోరితే అంగీకరించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. చివరికి 1949లో ఏర్పడిన ముగ్గురు సభ్యుల కమిటీ మద్రాస్ నగరం లేకుండానే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య సభ్యులుగా ఉన్న ఈ కమిటీజే జేవీపీ కమిటీగా ప్రసిద్ధి పొందింది. కానీ.. ఆ ప్రకటన వచ్చిన తర్వాత ఆంధ్ర నేతల పోరు మరింత పెరిగింది. కమిటీలో సభ్యుడిగా ఉన్న పట్టాభి సీతారామయ్య దీనిపై మాట మార్చుతూ.. జేవీపీ కమిటీ నివేదికలో మద్రాస్ ఆంధ్ర ప్రాంతంలో ఉండదని పేర్కొన్నదని అదే సందర్భంలో అది తమిళ ప్రాంతంలో ఉంటుందా? అన్న విషయంలోనూ నిర్దిష్టంగా చెప్పలేదని మెలిక పెట్టారు. నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని పట్టాభి డిమాండ్ చేశారు. 1952లో పొట్టి శ్రీరాములు మద్రాస్ నగరంతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష మొదలు పెట్టారు. ఆయన దీక్షతో కేంద్రంగానీ, మద్రాస్ ప్రభుత్వంగానీ వైఖరిని మార్చుకోలేదు.

51 రోజుల దీక్ష తర్వాత శ్రీరాములు చనిపోయారు. దీంతో మద్రాస్ నగరంలోని ఆంధ్ర ప్రజలు నివసించే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, ఈ అంశాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని నెహ్రూ చెప్పారు. దీనికి కొనసాగింపుగా 1953లో ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు విషయంలో జస్టిస్ వాంఛూ కమిటీని నియమించింది. కొత్త రెండు రాష్ట్రాల సరిహద్దులను గుర్తించిన వాంఛూ కమిటీ.. మద్రాస్‌ను మూడు లేదా ఐదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సూచించింది. అది సాధ్యం కాని పక్షంలో ఆంధ్రకు కొత్త రాజధాని నిర్మించుకునే వరకూ గుంటూరు లేదా విశాఖపట్నంలో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చన సలహా ఇచ్చింది. మద్రాస్‌ను తాత్కాలిక ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు రాజాజీ, ఇతర తమిళ నేతలు ఒప్పుకోలేదు.

దీంతో 1953 మార్చిలో మద్రాస్ తాత్కాలిక ఉమ్మడి రాజధానిగా ఉండబోవడం లేదని నెహ్రూ ప్రకటించారు. ఫలితంగా 1953 అక్టోబర్‌లో ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఏర్పాటైంది. ఆ తర్వాత అక్కడ ఇబ్బందులు భరింపశక్యం కావడంతో ఆంధ్రా నాయకులు హైదరాబాద్‌పై కన్నేశారు. అప్పటికి మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను కలుపుకొని హైదరాబాద్ స్టేట్ ఉంది. దీన్ని విచ్ఛిన్నం చేస్తేగానీ తమకు హైదరాబాద్ దక్కదని భావించారు. ఇందుకోసం కర్ణాటకను రెచ్చగొట్టాలని తీర్మానించుకున్నారు. అప్పటి ఆంధ్రా కాంగ్రెస్ నాయకుడు అయ్యదేవర కాళేశ్వరరావు.. హైదరాబాద్ స్టేట్ విచ్ఛిన్నం కోసం కర్ణాటకతో కలిసి గట్టిగా పని చేయాలని ఉద్భోదించారు. ఆ ఎత్తులు పని చేశాయి. రెండేళ్ల తర్వాత హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రవూపదేశ్ అవతరించింది. మద్రాస్ నగరం పూర్తిగా తమిళులకే మిగిలింది. -సెంట్రల్ డెస్క్

సమన్యాయానికి సరే!



8/29/2013 12:07:36 AM
రాష్ట్ర విభజన తప్పదని తెలిసిన తరువాత సీమాంధ్ర నాయకులు కొత్త పాట అందుకున్నారు. అది తమకు ‘సమ న్యాయం’ కావాలని! వారికి తెలువకుండానే ఒక మంచి పదాన్ని ఇప్పుడు వాడుకలోకి తెచ్చినందుకు వారిని అభినందించాల్సిందే. సమన్యాయం అంటే చట్టం ముందు సమాన న్యాయం ఉండాలనే న్యాయ సూత్రంగా ప్రసిద్ధికెక్కింది. కానీ సీమాంధ్ర నేతలు అంత కచ్చితంగా కాకుండా కొంచెం విస్తృతార్థంలో తేలికగా వాడుతున్నారు. విభజన సందర్భంగా రెండు ప్రాంతాలలో తమకు అన్యాయం జరగ కూడదనేది వారు పైకి వినిపిస్తున్న వాదన. తమ ప్రాంతానికి నిజంగా నష్టమేమీ జరగడం లేదని వారికి తెలుసు. కానీ తమకు న్యాయం జరగాలని ఇక్కడి నుంచి ఢిల్లీ దాన్క రోజూ కీకలు పెడితే, నిజంగా వీళ్ళకేదో కడుపునొప్పి ఉన్నదని చూసే వాడికి జాలి పుడుతది.

దీని వల్ల విభజనను కొంత కాలం ఆపడమో, హైదరాబాద్‌పై మెలికలు పెట్టడమో జరగవచ్చుననేది వారి ఎత్తుగడ. ఈ కుట్రల సంగతెట్లా ఉన్నా నిజంగా సమన్యాయం జరిగితే అందుకు తెలంగాణ వారు కూడా సంతోషిస్తారు. నిజానికి ఈ డిమాండ్ తెలంగాణ వారి నుంచే రావలిసింది. సమన్యాయానికి సీమాంధ్ర నాయకులు ఇచ్చే నిర్వచనం ఎట్లా ఉన్నా- విభజన సందర్భంగా రెండు ప్రధానాంశాలను పరిగణనలోకి తీసుకోవాలె. ఒకటి- విలీనం నుంచి ఇప్పటి వరకు ఎవరికి అన్యాయం జరిగిందో వారికి పరిహారం ఇవ్వడం సాధ్యమా? సాధ్యమైనా కాకపోయినా అందాజా లెక్కలు తీస్తే ఎట్లా ఉంటుంది? రెండు- విభజన సందర్భంగా సీమాంధ్ర ప్రాంతీయులు ఎంత లబ్ధి పొందుతున్నారో లెక్కించి తెలంగాణ వారికి అంతే లబ్ధి చేకూర్చడంలో తప్పేముంది? ఇందుకు సీమాంధ్ర నాయకులు సిద్ధంగా ఉన్నారా?

దాదాపు ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతానికి నిధుల్లో, నీళ్ళలో, కొలువుల్లో అన్యాయం జరిగింది. సీమాంధ్ర వారు హైదరాబాద్‌లోని ఉద్యోగాల్లో అక్రమంగా చేరి జాగలు కొన్నారు. పిల్లా జెల్లతో సుఖంగా బతికారు. నీళ్ళ దోపిడీ ద్వారా సీమాంధ్ర భూస్వామ్య వర్గం బలిసిపోయింది. సినిమా, మీడియా మొదలుకొని అనేక రంగాల్లో తమ పెత్తనం సృష్టించుకున్నది. నిధుల దోపిడీ ద్వారా సీమాంవూధలోని భిన్న వర్గాలు ప్రత్యక్ష, పరోక్ష ప్రయోజనం పొందాయి. ఇక్కడి రైతులు, బీద బిక్కి ఊళ్ళు విడిచి బొంబాయి, దుబాయి పోయి దిక్కులేని బతుకులు ఈడ్వాల్సి వచ్చింది. సీమాంధ్ర వలస దోపిడీ వల్ల తెలంగాణ సమాజం అనుభవించిన క్షోభ ఏ లెక్కలకు అందనిది. మరి ఇప్పుడు దీనికి ఎంత నష్టపరిహారం లెక్క కట్టి ఇస్తారో సీమాంధ్ర నాయకులు చెప్పాలె. గడిచిందేదో గడిచి పోయింది మరిచి పోదామని తెలంగాణ వారు అనుకుంటున్నారు. ఇక్కడి సీమాంధ్ర వారిని తమలో భాగంగా చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు సీమాంధ్ర నాయకులు తమకు తామే సమన్యాయం అంటున్నారు కనుక- విభజన సందర్భంగా ఏమైనా నష్టాన్ని చక్కదిద్దుతారా అనేది చర్చించుకోవడం మంచిది.

విభజన తరువాత ఒంగోలు లోనో, మంగళగిరిలోనో ఏదో ఒక చోట సీమాంధ్ర ప్రాంతానికి రాజధాని ఏర్పడుతుంది. ‘సమన్యాయం’ ప్రకారం- హైదరాబాద్‌లో ఎంత మంది ఆంధ్రా ఉద్యోగులు ఎంత కాలం ఉన్నారో , అంత మంది తెలంగాణ వారికి సీమాంవూధలో ఉద్యోగాలు ఇవ్వాలె. హైదరాబాద్‌లో ఆంధ్ర పెద్దలు ఎకరాల కొద్ది భూములు కబ్జా పెట్టారు. సీమాంధ్ర రాజధానిలో మళ్లీ అంత విలువైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తెలంగాణలోని పేద ప్రజలకు ఇవ్వాలె.

ఆదిలాబాద్ మొదలుకొని హైదరాబాద్ వరకు అన్ని జిల్లాల్లో సీమాంవూధులు కాంట్రాక్టులు, వ్యాపారాలు చేజిక్కించుకున్నారు. అధికార బలంతో అది సాధ్యమైంది. ఇప్పుడు సమన్యాయం ప్రకారం- సీమాంవూధలోని అన్ని జిల్లాల్లో అంతే లెక్కన తెలంగాణ వారికి కాంట్రాక్టులు, వ్యాపారాలు అప్పగించాలె. ఉమ్మడి రాష్ట్రంలో సంపాదించిన డబ్బుతో జాతీయ స్థాయిలో కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసుకుంటున్న సీమాంవూధులు ఉన్నారు. తెలంగాణ వారికి అందులో వాటా ఇవ్వాలె. నీటి ప్రాజెక్టుల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టులను, కుంటలు, చెరువుల మరమ్మత్తులను ఉమ్మడి వ్యయంతో పూర్తి చేయాలె. పాత ప్రాజెక్టులతో సంబంధం లేకుండా కొత్త పంపకాలు చేయాలె. హైదరాబాద్‌ను ఎంత కాలం సీమాంవూధులు వాడుకున్నారో, తెలంగాణ వారికి మళ్లీ అంత కాలం సీమాంధ్ర రాజధానిపై హక్కు కల్పించాలె.

సీమాంధ్ర నాయకులు చెబుతున్న సమన్యాయ వాదన చాలా విచివూతంగా ఉన్నది. తమకు కొత్త రాజధాని నిర్మించి ఇవ్వాలట, దానితో పాటు హైదరాబాద్ కూడాకావాలట! హైదరాబాద్ తమకు ఇవ్వకున్నా సరే తెలంగాణ వారికి ఉండకూడదట! కేంద్ర పాలితంగా, దేశ రెండవ రాజధానిగా పెట్టి తెలంగాణ నుంచి విడదీయాలట! వీరి దృష్టిలో సమన్యాయం అంటే- తెలంగాణ ఆదాయాన్ని ఇంత కాలం దోచుకున్నాం, ఇక ముందు కూడా దోచుకుంటాం అనే కదా! ఇంత కాలం అక్రమంగా, అణచిపెట్టి కొల్లగొట్టాం, ఇప్పుడు ఒప్పందాలకు బద్ధులని చేసి ఇంకా కొల్లగొడతాం అనే కదా! ఈ వాదనను ప్రపంచంలో మెడకాయ మీద తలకాయ ఉన్నవాడెవడైనా మెచ్చుకుంటాడా? సమన్యాయం అనే ఆధునిక నీతికి, సామాజిక ఆదర్శానికి అత్యంత నీచమైన దోపిడీ నిర్వచనం ఇచ్చిన ఘనులుగా సీమాంధ్ర నాయకులు చరివూతలో నిలిచిపోతారు.

భూ సేకరణ బిల్లు (సంపాదకీయం)

August 30, 2013
యూపీఏ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మరో బిల్లుపై గురువారం నాడు లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. రూపా యి భారీ పతనంతో విలవిల్లాడుతున్న దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని ప్రకటన కోసం సభ్యులు ఆందోళన చేస్తున్న సమయంలోనే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరామ్ రమేశ్ సమగ్ర భూ సేకరణ బిల్లును లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రైవేట్ ప్రాజెక్టుల విషయంలో 80 శాతం మంది, అదే ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల కోసం 70 శాతం మంది భూ యజమానుల అంగీకారం అవసరమని భూసేకరణ చట్టం కీలకంగా చెబుతోంది. ఇప్పటికే లోక్‌సభలో ఆహార భద్రత బిల్లుకు ఆమోదం పొందిన యూపీఏ-2 ప్రభుత్వం పార్లమెంట్‌లో తీవ్ర గందరగోళం నడుమ అత్యంత వివాదస్పదమైన 'భూ సేకరణలో న్యాయబద్ధ పరిహార హక్కు, పారదర్శకత, పునరావాస, పరిష్కార బిల్లు'ను ప్రవేశపెట్టడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలు ఈ బిల్లును విమర్శిస్తూ దాదాపు 116 సవరణలు ప్రతిపాదించాయి.


దేశానికి అవసరమైన రోడ్లు, రైలు మార్గాల వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం 1894లో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన భూ సేకరణ చట్టమే ఇప్పటికీ అమలులో ఉంది. భారీ ప్రభుత్వ రంగ ప్రాజెక్టుల నుంచి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల దాకా పలు ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ప్రజలనుంచి బలవంతంగా భూములను స్వాధీనం చేసుకున్న అనేక కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. పచ్చని క్షేత్రాలతో సహా ప్రైవేటు భూములను అత్యధిక విస్తీర్ణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించాయి. భూ సేకరణకు నిర్వాసితుల ప్రతిఘటనకు ప్రతీకగా నందిగ్రామ్ పోరాటం చరిత్ర కెక్కింది.

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా నుంచి, ఆగ్రాకు నిర్మించిన యమున ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం, మన రాష్ట్రంలో వాన్‌పిక్ భూములు, హైదరాబాద్‌లో సెజ్‌ల పేరుతో జరిగిన బలవంతపు భూ సేకరణల దాకా వివాదాస్పదంగా మారాయి. మన రాష్ట్రంతో సహా దేశంలో అనేక చోట్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ప్రజల నుంచి నేరుగా కారుచౌకగా భూమిని సేకరించి వేలాది ఎకరాలను దేశ, విదేశ బడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాయి. ప్రాజెక్టుల బాధితులు, హక్కుల సంస్థలు, వివిధ రాజకీయ పక్షాలు, ఆదివాసీలు చేసిన సంఘటిత ఉద్యమాలు ప్రభుత్వ భూసేకరణను నిలిపివేసిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. దాంతో దేశవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులు పూర్తి స్థాయి నిర్మాణానికి నోచుకోలేదు. ఈ అనిశ్చిత పరిస్థితి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం వేస్తోంది.


బలవంతపు భూ సేకరణ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో 119 ఏళ్ళ నాటి కాలం చెల్లిన భూ సేకరణ చ ట్టాన్ని పక్కన బెట్టేందుకు రంగం సిద్ధమైంది. పారిశ్రామిక అవ సరాల కోసం భూమిని సేకరించే సందర్భాల్లో నిర్వాసిత కుటుంబాలకు న్యాయమైన, సముచితమైన రీతిలో పరిహారం చెల్లించేందుకు ఈ భూ సేకరణ బిల్లు వీలు కల్పిస్తుంది. గ్రామీణ ప్రాంత నిర్వాసితులకు భూమి మార్కెట్ విలువను నాలుగు రెట్లు, పట్టణ ప్రాంత నిర్వాసితులకు రెండు రెట్లు నగదు పరిహారం చెల్లించాలని ఈ బిల్లు నిర్దేశిస్తోంది. దేశాన్ని శీఘ్రగతిన పారిశ్రామికం చేయడానికి అవసరమయ్యే భూమిని సమకూర్చడమనే లక్ష్యంగా కాకుండా భూమి యజమానులకు, ఇతరత్రా దానిపై ఆధారపడి బతుకుతున్న వారందరికీ తగు రీతిలో పరిహారం అందించి, ఆ అభివృద్ధి ఫలాల్లో భాగస్వాములను చేయవలసిన అవసరం ఉంది. భూమిని సేకరించిన తర్వాత భూ యజమానులకు, దానిపై ఆధారపడి జీవిస్తున్న ఇతరులకు కూడా నిర్దేశిత మొత్తంలో జీవన భత్యం చెల్లించాలని బిల్లు చెబుతోంది.

సాగునీటి ప్రాజెక్టు కోసం భూమిని సేకరించిన సందర్భంలో, దాని ఆయకట్టులో 20 శాతం భూమిని నిర్వాసితుల కోసం కేటాయించాలని, సేకరణ సమయానికి పదేళ్ళ తర్వాత పెరిగిన భూమి ధరలో 20 శాతాన్ని భూ యజమానికి చెల్లించాలని బిల్లు చెబుతోంది. భూ నిర్వాసిత కుటుంబాల్లోని ఒకరికి వారి భూముల్లో నిర్మించే ప్రాజెక్టుల్లో ఉద్యోగం ఇవ్వాలి లేదా నగదు రూపంలో పరిహారం చెల్లించాలని బిల్లు నిర్దేశిస్తోంది. ప్రాజెక్టు నిర్వాసితుల కష్టనష్టాలను పరిగణనలోకి తీసుకొని ఒక ప్రయత్నంగా ముందుకొచ్చిన ఈ బిల్లు ఆహ్వానించదగినదే. అమలయ్యే క్రమంలో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకొని నిర్దిష్ట కాలపరిమితిలో ఆ అనుభవాలను సమీక్షించి భూ సేకరణ చట్టాన్ని మరింతగా బలోపేతం చేయవలసి ఉంటుంది.


ప్రాజెక్టుల ప్రాంతాన్ని ముందే పసిగట్టి పేదల నుంచి కారుచౌకగా కొనుగోలు చేసి కోట్లు గడించే భూ దందా దారుల వల్ల వాస్తవ భూ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. భూ వాస్తవ యజమానులకు పరిహారంపై బీజేపీ సూచించిన సవరణ నేపథ్యంలో 2011 సెప్టెంబర్ 5 తేదీ తర్వాత సేకరించిన భూములకు చెల్లించిన పరిహారంలో 40 శాతాన్ని అసలు భూ యజమానులకు దక్కేలా బిల్లును రూపొందించారు. అయితే భూ సేకరణ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి నూతన భూ సేకరణ చట్టంలోని నిబంధన ల అమలు తీరును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం, పౌర సమాజం భాగస్వామ్యంతో కూడిన, రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన నిఘా యంత్రాంగం అవసరం ఉంది.

సార్వత్రక ఎన్నికల నేపథ్యంలో 1975 నాటి భూ గరిష్ఠ పరిమితి చట్టాన్ని సవరించి భూ కమతాల పరిమాణాన్ని కుదించేందుకు కేంద్రం ముసాయిదాను ఈమధ్యనే సిద్ధం చేసింది. అయితే గరిష్ఠ పరిమితికి మించి యజమానుల వద్ద ఉన్న మిగులు భూములను పేదలకు పంపిణీ చేయాలన్నది గతంలో ప్రభుత్వ లక్ష్యంగా ఉండేది. పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకోసం భూసేకరణను మరింత పగడ్బందీగా చేసే రహస్య ఎజెండాతో కేంద్రం భూ గరిష్ఠ పరిమితిని మరింతగా కుదిస్తున్నదన్న అనుమానాలున్నాయి. భూసేకరణ, భూ గరిష్ఠ పరిమితులపై దేశవ్యాప్తంగా లోతైన చర్చ జరగాలి.