23, సెప్టెంబర్ 2013, సోమవారం

జగన్ ఆస్తుల కేసులో క్విడ్‌ప్రోకో ఆధారల్లేవు: సీబీఐ


9/23/2013 12:50:09 PM
హైదరాబాద్ : జగన్ అక్రమాస్తుల కేసులో క్విడ్ ప్రో కో ఆధారాల్లేవని నాంపల్లి సీబీఐ కోర్టుకు సీబీఐ తెలిపింది. సండూర్ పవర్, కార్మెల్ ఏషియా, పీవీపీ బిజినెస్ వెంచర్స్, జూబ్లీ మీడియా కమ్యూనికేషన్స్, క్లాసిక్ రియాలిటీబహ్మణి ఇన్‌ఫ్రాటెక్, ఆర్‌ఆర్ గ్లోబల్, సరస్వతీ పవర్, మంత్రీ డెవలపర్స్ వ్యవహారాల్లో క్విడ్ ప్రో కో ఆధారల్లేవు అని సీబీఐ స్పష్టం చేసింది. పై కంపెనీలు ఇతర ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించి ఈడీ, ఆదాయపన్ను శాఖలకు వివరాలు పంపామని పేర్కొంది. 16 సూట్‌కేసు కంపెనీల వ్యవహారాలపై చర్యలకు ఈడీ, ఆదాయపన్ను శాఖకు సిఫార్సు చేశామని సీబీఐ తెలిపింది. జగన్ ఆస్తుల కేసులో దర్యాప్తు పూర్తి అయిందని కోర్టుకు సీబీఐ తెలిపింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి