తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం తెలంగాణ రాజకీయ జెఎసి నెలరోజులకు పైగా
నిర్వహిస్తున్న సకలజనుల సమ్మె విజయవంతం అయినట్లా? విఫలమైనట్లా? ఈ ప్రశ్నకు
ఎవరికి కావాల్సిన సమాధానం వారు చెప్పుకోవచ్చు. సమ్మె విజయవంతం అయిందని
తెలంగాణ ఉద్యమ నేతలు ప్రకటిస్తున్నారు. ఒకరకంగా చూస్తే సమ్మె విజయవంతం
అయినట్లు తెలంగాణ ఎన్.జీ.ఓలంతా సమ్మెలోకి వచ్చారు. సింగరేణి కార్మికులు,
టీచర్లు, విద్యాసంస్థలు ఆయా రంగాలకు చెందిన ఉద్యోగులు, చివరికి ఎక్సైజ్
ఉద్యోగులు సైతం సమ్మెలో పాల్గొన్నారు. అంతవరకు కచ్చితంగా విజయం కిందే
తీసుకోవాలి. అంతేకాదు. అసలే నష్టాలలో ఉన్న ఆర్టీసిని మరింత కష్టాలలోకి
నెట్టడంలో విజయవంతం అయినట్లే లెక్క. అదే సమయంలో ప్రైవేటు వాహనాల పంట
పండింది.విజయవాడ హైవే మినహాయించి మిగిలిన ప్రాంతాలకు అవి ఇబ్బంది లేకుండా
నడిచాయి. ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూలు చేశారు. హైదరాబాద్ నగరంలో సిటీ బస్
లు లేకుండా చేశారు. తద్వారా ఆటోలు, క్యాబ్ లు వంటివి రేట్లు పెంచి వాహనాలు
నడిపారు.సింగరేణి బొగ్గు సరఫరా లేక వేలాది రైతులు తమ పంటలు ఎండబెట్టుకోవలసి
వచ్చింది. ఇక విద్యార్ధులు చదువులు లేకుండా ఇళ్లకే పరిమితం
అయ్యారు.సమ్మెను స్వచ్చందంగా చేసినవారు ఉన్నారు. భయపడి చేసినవారూ ఉన్నారు.
ఏది ఏమైనా సమ్మె జరిగింది. కాని ఎవరికి ప్రయోజనం కలిగింది.సకల జనుల సమ్మెలో
అందరూ పాల్గొనడం వల్ల, రైల్ రకోను నిర్వహించడం ద్వారా తెలంగాణ సమస్య
తీవ్రతను ,ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లగలిగామని ఉద్యమ
నేతలు వాదిస్తున్నారు. ఇందులో కొంత వాస్తవం ఉంది. అయితే ఉద్యోగ సంఘాలు ఒక
రాజకీయ అంశంపై సమ్మెలకు దిగితే అవి పరిష్కారం అవుతాయన్న నమ్మకం లేదని గత
అనుభవాలు చెబుతున్నా ,తెలంగాణ నేతలు ఈ బ్రహ్మాస్త్రాన్ని వదిలారు. లక్షల
సంఖ్యలో ఉన్న వీరు సమ్మె చేశారు కాని, ఆ తర్వాత నెల పూర్తి అయ్యేసరికి
ఒక్కక్కరుగా సమ్మెను ఏదో కారణంగా విరమించుకోక తప్పని స్థితి ఏర్పడింది.
తెలంగాణ వచ్చేవరకు సమ్మె చేస్తామని ప్రకటించిన కార్మిక నేతలు , ప్రభుత్వంతో
చర్చలకు వెళ్లి, తక్షణం తమ ఉద్యోగులకు అడ్వాన్సులు ఇప్పించుకోవడానికి, ఇతర
ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి తంటాలు పడ్డారు. ఆర్గనైజ్ డ్ సెక్టార్ లో
ఉన్న వీరు సమ్మె చేసినా ఏదో రూపంగా ప్రభుత్వం నుంచి 6, నవంబర్ 2011, ఆదివారం
సకల జనుల సమ్మె విజయమా? వైఫల్యమా?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం తెలంగాణ రాజకీయ జెఎసి నెలరోజులకు పైగా
నిర్వహిస్తున్న సకలజనుల సమ్మె విజయవంతం అయినట్లా? విఫలమైనట్లా? ఈ ప్రశ్నకు
ఎవరికి కావాల్సిన సమాధానం వారు చెప్పుకోవచ్చు. సమ్మె విజయవంతం అయిందని
తెలంగాణ ఉద్యమ నేతలు ప్రకటిస్తున్నారు. ఒకరకంగా చూస్తే సమ్మె విజయవంతం
అయినట్లు తెలంగాణ ఎన్.జీ.ఓలంతా సమ్మెలోకి వచ్చారు. సింగరేణి కార్మికులు,
టీచర్లు, విద్యాసంస్థలు ఆయా రంగాలకు చెందిన ఉద్యోగులు, చివరికి ఎక్సైజ్
ఉద్యోగులు సైతం సమ్మెలో పాల్గొన్నారు. అంతవరకు కచ్చితంగా విజయం కిందే
తీసుకోవాలి. అంతేకాదు. అసలే నష్టాలలో ఉన్న ఆర్టీసిని మరింత కష్టాలలోకి
నెట్టడంలో విజయవంతం అయినట్లే లెక్క. అదే సమయంలో ప్రైవేటు వాహనాల పంట
పండింది.విజయవాడ హైవే మినహాయించి మిగిలిన ప్రాంతాలకు అవి ఇబ్బంది లేకుండా
నడిచాయి. ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూలు చేశారు. హైదరాబాద్ నగరంలో సిటీ బస్
లు లేకుండా చేశారు. తద్వారా ఆటోలు, క్యాబ్ లు వంటివి రేట్లు పెంచి వాహనాలు
నడిపారు.సింగరేణి బొగ్గు సరఫరా లేక వేలాది రైతులు తమ పంటలు ఎండబెట్టుకోవలసి
వచ్చింది. ఇక విద్యార్ధులు చదువులు లేకుండా ఇళ్లకే పరిమితం
అయ్యారు.సమ్మెను స్వచ్చందంగా చేసినవారు ఉన్నారు. భయపడి చేసినవారూ ఉన్నారు.
ఏది ఏమైనా సమ్మె జరిగింది. కాని ఎవరికి ప్రయోజనం కలిగింది.సకల జనుల సమ్మెలో
అందరూ పాల్గొనడం వల్ల, రైల్ రకోను నిర్వహించడం ద్వారా తెలంగాణ సమస్య
తీవ్రతను ,ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లగలిగామని ఉద్యమ
నేతలు వాదిస్తున్నారు. ఇందులో కొంత వాస్తవం ఉంది. అయితే ఉద్యోగ సంఘాలు ఒక
రాజకీయ అంశంపై సమ్మెలకు దిగితే అవి పరిష్కారం అవుతాయన్న నమ్మకం లేదని గత
అనుభవాలు చెబుతున్నా ,తెలంగాణ నేతలు ఈ బ్రహ్మాస్త్రాన్ని వదిలారు. లక్షల
సంఖ్యలో ఉన్న వీరు సమ్మె చేశారు కాని, ఆ తర్వాత నెల పూర్తి అయ్యేసరికి
ఒక్కక్కరుగా సమ్మెను ఏదో కారణంగా విరమించుకోక తప్పని స్థితి ఏర్పడింది.
తెలంగాణ వచ్చేవరకు సమ్మె చేస్తామని ప్రకటించిన కార్మిక నేతలు , ప్రభుత్వంతో
చర్చలకు వెళ్లి, తక్షణం తమ ఉద్యోగులకు అడ్వాన్సులు ఇప్పించుకోవడానికి, ఇతర
ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి తంటాలు పడ్డారు. ఆర్గనైజ్ డ్ సెక్టార్ లో
ఉన్న వీరు సమ్మె చేసినా ఏదో రూపంగా ప్రభుత్వం నుంచి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి