28, నవంబర్ 2011, సోమవారం

గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ


263 పోస్టులు.. 9 నుంచి దరఖాస్తులు
మే 27న ప్రిలిమ్స్.. అక్టోబర్ 3న మెయిన్స్

హైదరాబాద్, నవంబర్ 28 : నిరుద్యోగులకు శుభవార్త. గ్రూప్-1 సర్వీసెస్ కింద 19 కేటగిరీల్లో 263 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. డిసెంబర్ 9 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. జనవరి 8ని తుది గడువుగా నిర్ణయించారు. జనవరి 6న ఫీజు చెల్లింపు గడువు ముగుస్తుంది. ప్రిలిమినరీ పరీక్షను 2012 మే 27న, మెయిన్స్ అక్టోబర్ 3 నుంచి నిర్వహిస్తారు. ఇతర వివరాల కోసం ఠీఠీఠీ.్చఞటఞటఛి.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను చూడవచ్చని ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య సూచించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి