28, నవంబర్ 2011, సోమవారం

పారా మిలటరీ దళాల్లో 90 వేల ఉద్యోగాలు

పారా మిలటరీ దళాల్లో 90 వేల ఉద్యోగాలు

న్యూఢిల్లీ, నవంబర్ 28 : ఆరు కేంద్ర పా రామిలటరీ దళాల్లో 90 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం పత్రికా ప్రకటనను విడుదల చేసింది. దాని ప్రకారం 'నాన్ గెజిటెడ్ గ్రూప్ బి, నాన్ టెక్నికల్ గ్రూప్ సి'లలో ఈ నియామకాలు చేపడతారు. జనరల్ డ్యూటీ కానిస్టేబుళ్లు, సీపీవోలలో రైఫిల్ మెన్‌ల నియామకానికి డిసెంబర్ 3న షెడ్యూల్ విడుదల చేస్తారు. 2012 అక్టోబర్ 31 నాటికి ఈ ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలనే ప్రతిపాదనలున్నాయి. మరోవైపు భారత ఆహార సంస్థలో సుమారు 8వేల ఉద్యోగాలను కూడా ఎస్ఎస్‌సీ ద్వారా భర్తీ చేయనున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి