1, అక్టోబర్ 2012, సోమవారం

పోలీసుల కుట్రలను ఛేదించి దండు



mbnrwer - అనుమతి ఉన్నా.. అడుగడుగునా నిర్బంధం
- మార్చ్‌కు తరలుతున్న వేల మంది అరెస్ట్
- నిర్బంధాలకు నిరసనగా ఆందోళనలు
- తెలంగాణవ్యాప్తంగా ఇదే పరిస్థితి
- ఒత్తిడికి తలొగ్గి వదిలేసిన పోలీసులు
- ఎవరికివారే కదిలివచ్చిన ఉద్యమకారులు
- ఎట్టకేలకు రాజధానిలో కవాతు


టీ మీడియా, నెట్‌వర్క్: తెలంగాణ మార్చ్‌కు జిల్లాల నుంచి కదనోత్సాహంతో ఉద్యమకారులు తరళివెళ్లారు. పోలీసులు అడుగడుగునా అడ్డుపడినా నిర్బంధాలను తెంచుకుని సాగర హారానికి సమరోత్సాహంతో కదలివచ్చారు. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు, జేఏసీ, పార్టీలకు చెందిన రెండువేల మందిని అరెస్టు చేశారు. నాలుగు బస్సుల్లో టీఎన్జీవో కార్యాలయం నుంచి కదిలిన ఉద్యోగులను అరెస్టు చేశారు. బస్సు డ్రైవర్లను అదుపులోకి తీసుకోవడం ఆందోళనకు దారితీసింది. పోలీసుల చర్యను నిరసిస్తూ ఉద్యోగులు స్టేషన్ ఎదుట బైఠాయించారు. టీఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు హమీద్, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మయ్య, ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి రాజయ్య, టీఎన్జీవో పట్టణ అధ్యక్షుడు రవీందర్‌ను అదుపులోకి తీసుకోవడంతో రెండుగంటల ఆందోళన చేపట్టడంతో తర్వాత వదలిపెట్టారు. గోదావరిఖని వైపు నుంచి బయలుదేరిన 40 వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. న్యూడెమోక్షికసీ, టీఆర్‌ఎస్ నాయకుల ను, టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు.

వాహనాలను అడ్డుకోవడంతో రెండున్నర గంటలపాటు రాస్తారోకో చేశారు. మానేరు వద్ద చెక్‌పోస్టు ఏర్పాటుచేసి అనుమానితులను అడ్డుకున్నారు. సిరిసిల్ల నుంచి సిద్దిపేట రోడ్డుపై జిల్లెల వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో జేఏసీ, టీఆర్‌ఎస్, ఆర్టీసీ, ఉపాధ్యాయ సంఘాల నాయకులను రెండు వం దల మందిని అరెస్టు చేశారు. ఇబ్రహీంపట్నం మండలం గండిహనుమాన్ దేవాలయం వద్ద అదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన 12 మందిని, మెట్‌పల్లి, మల్లాపూర్‌కు చెందిన 29 మందిని అరెస్టు చేశారు.


జనగామలో శాతవాహన రైలు నిలిపివేత
ఓరుగల్లు ఉద్యమకారులు అడుగడుగునా అవాంతరా లు, నిర్బంధాలు ఎదుర్కొంటూ ముందుకుసాగారు. పరకాల, ములుగు నియోజకవర్గాల్లో తెలంగాణవాదుల అరెస్టు, బైండోవర్ల పర్వం కొనసాగింది. మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, రఘునాథపల్లి, జనగామ రైల్వేస్టేషన్లలో భారీ బలగాలను మోహరించిన పోలీసు లు హైదరాబాద్‌కు వెళ్తున్న తెలంగాణవాదులను బలవంతంగా దించి వెనక్కి పంపించారు. ఖమ్మం జిల్లాకు చెందిన న్యూడెమోక్షికసీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో శాతవాహన ఎక్స్‌వూపెస్‌లో వస్తున్నట్లు తెలుసుకుని జనగామలో రైలును నిలిపివేశారు. పోలీసులు డ్రైవర్, గార్డులను అదుపులోకి తీసుకున్నారు. రెండు బోగీల్లో ఉన్న సుమారు 300 మంది తెలంగాణవాదులను దించేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరును నిరసిస్తూ తెలంగాణవాదులు ఠాణా ఎదుట బైఠాయించారు. స్టేషన్‌ఘన్‌పూర్ సమీపంలోని రాంపూర్ వద్ద ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు నిలిపివేయడంతో తెలంగాణవాదులు రాస్తారోకో చేశారు.


నల్లగొండ నుంచి 50వేల మంది హాజరు
నల్లగొండ జిల్లా నుంచి మార్చ్‌కు 50 వేల మంది తరలి జాతీయ రహదారి వెంట అడుగడుగునా తెలంగాణవాదులను అడ్డుకున్నారు. ఆందోళనకు దిగడంతో వదిలేశారు. నల్లగొండలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో వెళ్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌డ్డి స్టేషన్‌కు వెళ్లి వారిని విడుదల చేయించారు. చిట్యాల మండలం వట్టిమర్తి వద్ద టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌డ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి, తర్వాత విడిచిపెట్టారు. మునగాలలో 200 మంది కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో రాస్తారోకో చేయడంతో వదిలేశారు. కోదాడలో 150 మందిని అరెస్ట్ చేశారు. జిల్లావ్యాప్తంగా 1,500 మందిని బైండోవర్ చేశారు.


పోలీసుల అత్యుత్సాహం
నిజామాబాద్ జిల్లా కామాడ్డి, ఎల్లాడ్డి నియోజకవర్గాల నుంచి ఐదు వేల మందికిపైగా తెలంగాణవాదులు లష్కర్ బాటపట్టారు. హైదరాబాద్‌కు తరలుతున్న ఆదిలాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు శ్రీహరిరావుతోపాటు 50 మందిని బస్వాపూర్ చెక్‌పోస్టు వద్ద అడ్డుకున్నారు. బోధన్, బాన్సువాడ, ఎల్లాడ్డి ప్రాంతాల నుంచి వెళ్తున్న వారిని పోచారం చెక్‌పోస్టు వద్ద అడ్డుకున్నారు. భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన ఆదిలాబాద్ టీఆర్‌ఎస్ నాయకులను ఉన్నతాధికారులు ఆదేశాలతో వదిలేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే యెండెల లక్ష్మీనారాయణ బస్వాపూర్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయనతో పాటు తెలంగాణవాదులు, కార్యకర్తల రాస్తారోకోకు దిగారు. చెక్‌పోస్టు భారీగేట్లను ఎత్తివేశారు. కొద్దిసేపటి తర్వాత ఎమ్మెల్యే ఐజీ రాజీవ్త్రన్‌కు ఫోన్ చేయడంతో అడ్డుకోవడం, అరెస్టులు చేయడం నిలిపి వేయాలని ఆదేశాలు ఇచ్చారు.


knraalto నిర్బంధాలపై ఆందోళన
ఖమ్మం జిల్లా మీదుగా వెళ్లే గోల్కొండ, మణుగూరు-సికింవూదాబాద్ ప్యాసింజర్ రైళ్లను సర్కారు రద్దు చేసినా, ఉద్యమకారులు ప్రత్యామ్నాయమార్గాల్లో రాజధాని బాట పట్టారు. న్యూడెమోక్షికసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు నాయకత్వం శాతవాహన రైలులో హైదరాబాద్‌కు పయనమయ్యారు. వీరిని జనగామ వద్ద పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించారు. టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ దిండిగాల రాజేందర్, సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు సారథ్యంలో పార్టీల నాయకులు, కార్యకర్తలు నెక్లెస్ రోడ్డుకు చేరుకున్నారు. నిర్బంధాలపై ఇల్లెందులో న్యూడెమోక్షికసీ పెద్దఎత్తున రాస్తారోకో చేపట్టింది. ఖమ్మం మయూరి సెంటర్‌లో ఏపీటీఎఫ్ రాస్తారోకో చేపట్టింది.


అడ్డంకులను అధిగమించి..
మహబూబ్‌నగర్ జిల్లా నలుమూలల నుంచి వేల సంఖ్య లో నిర్బంధాలను అధిగమించి మార్చ్‌కు తరలి జిల్లా కేంద్రంలో రూరల్ పోలీస్‌స్టేషన్ వద్ద బీజేపీ, న్యూ డెమోక్షికసీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. సీఐతో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌డ్డి వాగ్వాదానికి దిగారు. గంటపాటు రోడ్డుపై బైఠాయించారు. షాద్‌నగర్ నియోజకవర్గం తిమ్మాపూర్ వద్ద వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు సయ్యద్ ఇబ్రహీం పోలీసులతో మాట్లాడి తెలంగాణవాదులను విడిపించారు. నాగర్‌కర్నూల్‌లో తెలంగాణ నగారా సమితి, జేఏసీ నాయకులు 200 మందిని అరెస్టుచేశారు. టీఎంయూ, ఎన్‌ఎంయూ నేతల అరెస్టుపై ఎమ్మెల్యే రావుల మండిపడ్డారు. పాన్‌గల్‌లో అడ్డుకోగా, టీఆర్‌ఎస్ నేత పాపన్న టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.



trsww మార్చ్‌కు తరలిన మెతుకుసీమ
టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు ఆధ్వర్యంలో మెదక్ జిల్లా సిద్దిపేట ప్రాంతం నుంచి వందలాది లారీల్లో జనం తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు రామలింగాడ్డి, పద్మాదేవేందర్‌డ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రఘునందన్‌రావు, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్‌లతోపాటు జేఏసీ జిల్లా చైర్మన్ అశోక్‌కుమార్, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ రాజేందర్‌తోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వేలాదిగా తరలి లక్ష మందికి పైగా జిల్లా నుంచి తరలి ఇంటెలిజెన్స్ అధికారుల అంచనా. చెక్‌పోస్టుల వద్ద 171మందిని పోలీసులు అరెస్టుచేసి విడుదల చేశారు. జిల్లా న్యాయవాదుల జేఏసీ అధ్యక్షుడు ప్రతాప్‌డ్డి ఆధ్వర్యంలో మార్చ్‌కు తరలి పటాన్‌చెరు వద్ద వారిని అరెస్టు చేశారు. ఆందోళన చేయడంతో వదిలిపెట్టారు.



ఆదిలాబాద్ నుంచి 16 వేల మంది..
ఆదిలాబాద్ జిల్లా నుంచి మార్చ్‌లో పాల్గొనడానికి పదహారు వేల మంది తరలి అంచనా. ఆటంకాలు, అరెస్టులు ఎదురైనా ఉద్యమకారులు గమ్యానికి చేరుకున్నారు. బెల్లంపల్లి, శ్రీరాంపూర్‌కు చెందిన సీపీఐ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్ నేతృత్వంలో కార్యకర్తలు 50 మందిని ములుగు వద్ద అడ్డుకోవడంతో రాస్తారోకోకు దిగారు. గంట తర్వాత వారిని వదిలేశారు. కాసిపేటకు చెందిన 20 మంది సీపీఐ కార్యకర్తలను సిద్దిపేట వద్ద అడ్డుకుని, వదిలేశారు. ముథోల్ కు చెందిన 300మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలను భిక్కనూర్ వద్ద అడ్డుకున్నారు. సింగరేణి నుంచి ఎనిమిదివేల మందికి పైగా బొగ్గుగని కార్మికులు మార్చ్‌లో పాల్గొన్నారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య, గౌరవాధ్యక్షుడు నల్లాల ఓదెలు, మంచిర్యాల ఎమ్మెల్యే జీ అరవిందడ్డి, నాయకులు బంటు సారయ్య, నూనె మల్లయ్య, రాజిడ్డి, కోటిలింగం, ఏఐటీయూసీ నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యే గుండా మల్లేశ్, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు, ఏఐటీయూసీ యూనియన్ అధ్యక్షుడు వై గట్టయ్య, ప్రధాన కార్యదర్శి వాసిడ్డి సీతారామయ్య, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ వెంక సింగరేణి విభాగం అధ్యక్షుడు టీ శ్రీనివాస్, సంపత్‌కుమార్, పాషా, దాస్, హెచ్చెమ్మెస్ నుంచి మేరుగు మల్లయ్య నాయకత్వం భారీగా కార్యకర్తలు హైదరాబాద్‌కు తరలివచ్చారు.


నగరబాట పట్టిన పల్లెలు
రంగాడ్డి జిల్లాలోని ప్రతి పల్లె నుంచి తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్,బీజేపీ,న్యూడెమోక్షికసీ, సీపీఐ నేతలు పోలీసుల కుట్రలను ఛేదించుకుని నగరానికి చేరుకున్నారు. చెక్‌పోస్టుల వద్ద మార్చ్‌కు వెళ్లే వాహనాలన్నీ పెద్దఎత్తున నిలిపివేశారు. మేడ్చల్ లో వెంక టాకీస్‌లో తెలంగాణ ఫిలిం చాం బర్ పిలుపును పాటించకుండా చిత్రం ప్రదర్శించడంపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. మార్చ్ వాహనాలకు పరిగిలో ఎమ్మెల్యే హరీశ్వర్‌డ్డి జెండా ఊపి ప్రారంభించారు. మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట్ తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు తరలి పోలీసులు అడ్డుకున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి