4, జులై 2012, బుధవారం

కొండెక్కిన కూరగాయల ధరలు


  • భారీగా పెరిగిన బియ్యం, పళ్లు, నూనె, పాల ధరలు
  • గత నెలతో పోల్చితే 40శాతం అధిక ధరలు
  • బెంబేలెత్తుతున్న సామాన్యులు
రాష్ట్రంలో నిత్యావసరకుల ధరలు కొండెక్కాయి. వర్షాభావ పరిస్థితులతో కూరగాయలు, పళ్ల దిగుబడులు భారీ ఎత్తున తగ్గాయి. దీంతో నెల వ్యవధిలోనే  ధరలు 40శాతం పెరిగాయి.  దీంతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.ఏం కొనేటట్టు లేదు... ఏం తినే టట్టులేదు అన్న చందంగా తయారైంది రాష్ట్రంలో సామాన్యుడి పరిస్థితి. ఓ వైపు కరువు, మరో వైపు వర్షాభావ పరిస్థితులు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఖరీఫ్‌ సీజన్ ప్రారంభమైనా ఇంకా వర్షాలు పడక పోవడంతో  పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. కూరగాయల ఉత్పత్తి కూడా పూర్తిగా తగ్గడంతో ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. కూరగాయల ధరలకు తోడు బియ్యం, నూనె, పాలు, గుడ్లు, పండ్ల ధరలు సైతం 40 శాతానికి పైగా పెరిగిపోయాయి. దాంతో  చాలీచాలని జీతాలతో బతుకు ఎలా వెళ్లదీస్తామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.

        నెలరోజుల్లో ధరల వ్యత్యాసాలు

 వస్తువు                  గతంలో ధర       ప్రస్తుత ధర

బియ్యం                           28                34
                                                            
తమాట                           16                32    
            
గుడ్లు                              36                44    
            
మామిడి పండ్లు  కిలో          50                70        
            
పచ్చి మిర్చి                     50                 70    
            
ఇక ఇదంతా గతం . ఇప్పుడు పరిస్థితి ముదిరింది. వర్షాకాలం మొదలై నెలన్నర పూర్తైనా ఎక్కడా వర్షాలు పూర్తిస్థాయిలో కురవలేదు. దాంతో కూరగాయల దిగుబడి కూడా గణనీయంగా పడిపోయింది. ఈ దుస్థితితో రాబోయేరోజుల్లో కూడా కూరగాయలు మరింత పెరిగే చాన్సూ లేకపోలేదు. ప్రభుత్వానికి పన్నుల వసూలుపై ఉన్న శ్రద్ద ధరల నియంత్రణపై లేదని విశ్లేషకులు అంటున్నారు.నిత్యం ఆమ్ ఆద్మి జపం చేస్తున్న సర్కార్..నిజంగా వారి పాలనలో ఆ వర్గాలు ఎంత సంతోషంగా ఉన్నాయన్నది గుర్తించాలి. ప్రభుత్వం మేలుకొనక పోతే సగటుజీవికి పప్పన్నం కూడా దూరమయ్యే పరిస్థితి దాపురించనుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి