1, జులై 2014, మంగళవారం

India Current Affairs: రైతులకు మోడీ చెప్పిదేమిటి? ఇప్పుడు చేసిందేమిటి?



ఎన్నికల సమయంలో కాంగ్రెస్
పాలనలో రైతుల దుస్థితి పై నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. తాము
అధికారంలోకి వస్తే ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50 శాతం కలిపి ధరచెల్లించుతామని
హామీ ఇచ్చారు. అని ఇప్పుడు మోడి పభుత్వం ప్రకటించిన మద్దత్తు ధరలు
ఉత్పత్తి ఖర్చులకన్నా తక్కువగా వున్నాయి. రైతులకు మద్ధతు ధర పెరిగితేనే,
వినియోగదారులకు భారం కాదు. మధ్యదళారీలను అరికడితే ఇరువురికీ న్యాయం
చేయవచ్చు. 




 వ్యవసాయ వ్యయం, ధరల కమీషన్ సిఫార్సుల ఆధారంగా ప్రతి ఏటా కేంద్రం మద్దతు ధరలు
ప్రకటిస్తుంది. ఈ ఏడాది ఖరీఫ్
, రబీ  సీజన్ కు కేంద్రం ప్రకటించిన ధరలు అన్యాయంగా వున్నాయన్న
ఆవేదన వ్యక్తమవుతోంది. వరి ధాన్యాన్నే తీసుకుంటే క్వింటా వడ్లు పండించడానికి
1234  రూపాయలు ఖర్చవుతుందని. వ్యవసాయ వ్యయ
ధరల కమిషన్ చెప్పిన లెక్క ఇది. అది కూడా ఏడాది క్రితం చెప్పిన లెక్క. ఈ ఏడాది ఎల్ నినో
ప్రభావం పొంచి వుంది. యూరియా ధరలు పెంచేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇతర ఎరువుల
,
క్రిమి సంహారక మందులు కూడా పెరగబోతున్నాయి. దీంతో వ్యవసాయం మరింత భారం
కాబోతోంది. ఖర్చులు పెరగబోతున్నాయి. వాతావరణం అనుకూలించక ఇప్పటికే అదును తప్పుతోంది.
దీని ప్రభావం దిగుబడి మీద ఉండబోతోంది. ఈ విషయాలన్నీ తెలిసి మోడీ ప్రభుత్వం మద్దతు దగ్గర
అన్యాయం చేస్తోంది. క్వింటా వరి ధాన్యం మద్దతు ధరను కేవలం యాభై రూపాయలు పెంచింది.
1310 నుంచి 1360కి మాత్రమే పెంచింది. పత్తి విషయంలోనూ అంతే.
యాభై రూపాయలే పెంచింది. వేరుసెనగ
, సోయాచిక్కుడు లాంటివాటికి నయా
పైసా పెంచలేదు. 




రాష్ట్ర విభజన కంటే ముందు
పంటల సాగు వ్యయంపై అధ్యయనం చేసిన వ్యవసాయ శాఖ ఏ గ్రేడ్ వరి ధాన్యం పండించడానికి క్వింటాకు
2100  రూపాయలు ఖర్చు అవుతుందని లెక్కలేసింది.
రైతు పెట్టే ఖర్చుకి అదనంగా యాభై శాతం వేసి
,
మద్దతు ధర ప్రకటించాలని గతంలో స్వామినాధన్ కమిటీ
సూచించింది. ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించాడు
తాను అధికారంలోకి వస్తే ఇస్తానన్నారు.  ఈ లెక్కన
వరికి కనీసం 3000 రూపాయల  మద్దతు ధర ఇవ్వాల్సి
వుంటుంది. కానీ
, ఏవన్ గ్రేడ్ వరి ధాన్యానికి మోడీ ప్రభుత్వం ప్రకటించిన
మద్దతు ధర కేవలం 1400 రూపాయలే. కొత్త ప్రభుత్వం కూడా ఇంత అన్యాయం చేస్తే ఇక రైతులు
తమ బాధ ఎవరికి చెప్పుకోవాలి
?
కేంద్రం ప్రకటించే మద్దతు
ధరకు కర్నాటకలో 250 రూపాయలు
, తమిళనాడులో
140 రూపాయలు
, కేరళలో 100 రూపాయలు బోనస్ ధర ప్రకటిస్తున్నారు.
కానీ సమైక్య రాష్ట్రంలో అలాంటి సంప్రదాయమే లేకుండా పోయింది. తెలంగాణ
, ఆంధ్రప్రదేశ్ లలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వాలైనా బోనస్ ధరల సంప్రదాయం ప్రారంభిస్తే
రైతులకు కాస్తంత మేలు జరుగుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి