16, ఏప్రిల్ 2013, మంగళవారం

సబిత కుట్రదారే! దాల్మియా సిమెంట్స్ చార్జిషీట్‌లో సీబీఐ


హైదరాబాద్, ఏప్రిల్ 16: సబితా ఇంద్రారెడ్డి గనుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని, కుట్రపూరితంగానే దాల్మియా సిమెంట్స్‌కు సున్నపురాయి లీజుల బదలాయింపుపై నిర్ణయం తీసుకున్నారని సీబీఐ నిగ్గుతే ల్చింది. కపటబుద్ధితోనే సబితా ఇంద్రారెడ్డి జయా మినరల్స్‌కు ఇచ్చిన ప్రాస్పెక్టింగ్ లైసెన్స్‌ను మూడు నెలల్లో ఈశ్వర్ సిమెంట్స్‌కు బదలాయించే ఫైలుపై సంతకం చేసినట్లు సీబీఐ తన చార్జిషీట్‌లో పేర్కొంది.

అలా చేయడం మినరల్స్ యాక్ట్ -1960, రూల్ 9ని ఉల్లంఘించడమేనని తేల్చింది. కుట్రలో భాగంగానే 2006 జూలై 14న జీవో నంబరు:183 జారీ చేశారని తెలిపింది. అక్రమాస్తుల కేసులో నిందితుడు జగన్ ఏ1గా, జగతి ఆడిటర్ విజయసాయిరెడ్డిని ఏ2గా చేర్చుతూ దాల్మియా సిమెంట్స్‌పై సీబీఐ దాఖలు చేసిన ఐదో చార్జిషీటులో మంత్రి సబితను ఏ4గా చేర్చడం తెలిసిందే! ఆ చార్జిషీటులో నిందితుల పాత్రను వివరించే క్రమంలో సబిత గురించి విశదీకరించింది.

"కడప జిల్లాలోని 407 హెక్టార్ల ప్రాస్పెక్టింగ్ లైసెన్స్(పీఎల్)ను జయా మినరల్స్‌కు కేటాయిస్తూ మంత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఒప్పందం కుదుర్చుకున్న మూడు నెలల్లోనే పీఎల్‌ను ఈశ్వర్ సిమెంట్స్‌కు బదలాయించాలనే నిబంధన పెట్టారు. దీనికి అనుగుణంగానే లీజు జయా మినరల్స్ నుంచి ఈశ్వర్ సిమెంట్స్‌కు బదిలీ అయింది. అనంతరం ఈశ్వర్ సిమెంట్స్ లీజు దాల్మియా సిమెంట్స్‌కు మారింది. ఇది చట్టబద్ధమైన బంధనలను ఉల్లంఘించడమే'' అని సీబీఐ పేర్కొంది.

తన చర్యలద్వారా ఆమె దాల్మియా సిమెంట్స్‌కు చెందిన పునీత్ దాల్మియాకు అనుకూలంగా వ్యవహరించారని, ఉద్దేశపూర్వకంగానే దాల్మియాకు మేలు చేశారని వెల్లడించింది. అప్పటి గనుల శాఖ కార్యదర్శి వై.శ్రీలక్ష్మి సైతం అధికారులతో కుమ్మక్కై.. ఈ కేసులో స్వతంత్రం గా వ్యవహరించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని నివేదించింది. గనుల శాఖ జాయింట్ డైరెక్టర్ మీనకేతన్‌రెడ్డి లేవనెత్తిన అభ్యంతరాలను కూడా తోసిరాజని...శ్రీలక్ష్మి ఈ ఫైలును ముందుకు పరుగులు పెట్టించారని కోర్టుకు నివేదించింది.

తెరవెనుక పాత్ర పోషించిన జగన్
దాల్మియా పెట్టిన రూ.20 కోట్ల పెట్టుబడులు భారతి సిమెంట్స్‌లోకి వచ్చాయని, భారతి పూర్వపు పేరు రఘురాం సిమెంట్స్ లిమిటెడ్ అని సీబీఐ పేర్కొంది. రఘురాం సిమెంట్స్‌లో అధిక వాటాలు కల్గిన జగనే 2006 డిసెంబరు నుంచి 2008 ఆగస్టు వరకు ఆ కంపెనీ వ్యవహారాలన్నీ పర్యవేక్షించారని తెలిపింది. ఆయన తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని ఉపయోగించుకుని కడప జిల్లాలో 407 హెక్టార్లలో సున్నపురాయి నిక్షేపాల ను తొలుత ఈశ్వర్ సిమెంట్స్‌కు కేటాయించి, తర్వాత లీజును దాల్మియాకు బదలాయించేలా కుట్రపన్నారని పేర్కొంది. అందుకు ప్రతిగా జగతి, భార తి సిమెంట్స్‌లో దాల్మియా రూ.95కోట్లు పెట్టుబడి పెట్టినట్లు నివేదించింది.

శ్రీల క్ష్మి పాత్రపై: నిబంధనలకు విరుద్ధమని తెలిసినా.. తన అధికార పరిధిని దాటి ఆమె నిర్ణయాలు తీసుకున్నారని సీబీఐ తెలిపింది. జయామినరల్స్‌కు లీజు మంజూరు చేయడం నిబంధనలకు విరుద్ధమని అప్పటి గనులశాఖ జాయింట్ డైరెక్టర్ మీనకేతన్‌రెడ్డి ఆమె దృష్టికి తీసుకొచ్చారని, కానీ శ్రీల క్ష్మి ఆ మాటను పట్టించుకోలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆమెపై ఐపీసీ 120-బీ రెడ్‌విత్ 420, 409, పీసీ యాక్ట్ సహా పలు కేసులు నమోదు చేశామని వివరించింది.

సాయిరెడ్డి గురించి: జగన్‌కు ఆర్థిక సలహాదారుగా కొనసాగుతూ.. జగతి, భారతిలోకి రూ.95 కోట్లు పెట్టుబడుల రూపంలో రావడంలో కీలక పాత్ర పోషించారని, రూ.110 విలువ ఉన్న షేరును రూ.1440కి దాల్మియా కొనేవిధంగా చేశారని, జగన్ సంస్థల్లోకి ముడుపుల వ్యవహారంలో సాయిరెడ్డి ప్రధాన భూమిక పోషించారని సీబీఐ పేర్కొంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి